ఇంటూరి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
'''ఇంటూరి వెంకటేశ్వరరావు''' (జ: 1 జూలై, 1909 - మ: 2002) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు.
 
వీరు [[గుంటూరు జిల్లా]]లోని [[సత్తెనపల్లి]] దగ్గరున్న [[చంద్రరాజుపాలెం]] గ్రామంలో నరసింహం పంతులు మరియు లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. [[తెనాలి]]లో విద్యాభ్యాసం అనంతరం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని 3 సంవత్సరాలకు పైగా కారాగార శిక్షను అనుభవించారు.
 
వీరు సహాయ దర్శకునిగా సుమతి, మాయలోకం, పేద రైతు, లక్ష్మి, [[సక్కుబాయి]], నాగపంచమి, లక్ష్మమ్మ మొదలైన సినిమాలకు పనిచేశారు. వీరు సృష్టించిన ''కుమ్మరి మొల్ల'' కావ్యం నాటకం, రేడియో నాటకం, బుర్రకథ మరియు సినిమాలుగా వెలుగుచూసింది.
 
వీరు చాలాకాలం [[నవజీవన్]] సినిమా పత్రిక సంపాదకులుగా కొనసాగారు.
వీరు తెలుగులో ప్రప్రథమ సినిమా మాసపత్రిక [[చిత్రకళ]] ను 1937లో ప్రారంభించారు. వీరు సుమారు 50 సంవత్సరాలు [[ఆంధ్ర నాటక కళా పరిషత్]] పోటీలకు న్యాయనిర్ణేతగా ఉన్నారు.
 
స్క్రీన్ (Screen) అనే ఆంగ్ల సినీ వారపత్రిక వీరి జీవితాన్ని సంగ్రహంగా ముద్రిస్తూ "ఎ మ్యాన్ ఆఫ్ మిలియన్ ఐడియాస్" గా అభివర్ణించింది.