ఉన్నవ లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
==తొలి జీవితం==
ఉన్నవ లక్ష్మీనారాయణ [[గుంటూరు]] జిల్లా అప్పటి [[సత్తెనపల్లి]] తాలూకా [[వేములూరుపాడు]] గ్రామంలో [[1877]] [[డిసెంబరు 4వ4]]వ తేదీన శ్రీరాములు , శేషమ్మ దంపతులకు జన్మించాడు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది.1897లో గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివాడు. 1906లో [[రాజమండ్రి]] ఉపాధ్యాయ శిక్షాణా కళాశాలలో శిక్షణ పొందాడు. 1916లో [[బర్లాండ్]], [[డబ్లిన్]] ‍లలో బారిష్టర్ చదువు సాధించాడు. 1892లోనే లక్ష్మీబాయమ్మతో వివాహం జరిగింది.
[[బొమ్మ:Unnava llakshmi narayana pantulu.jpg|thumb|left|250px|జైలు జీవితంలో లక్ష్మీ నారాయణ పంతులు గారు]]
 
లక్ష్మీనారాయణ 1900లో [[గుంటూరు]] లో ఉపాధ్యాయ వృత్తి నిర్వహించాడు. 1903లో అక్కడే న్యాయవాద వృత్తిని చేపట్టాడు. 1908లో ర్యాలీ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. 1917 లో [[మద్రాసు]] హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు. 1923 లో కాంగ్రెసు స్వరాజ్య పార్టీలో చేరాడు. అలాగే ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శులు ఇద్దరులో ఒకడుగా ఎన్నికయ్యాడు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1931లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చేరినందుకు, 1942 లో [[క్విట్ ఇండియా]] ఉద్యమంలో చేరినందుకు జైలు శిక్ష అనుభవించాడు.
==సాంఘిక సేవ==
ఉన్నవ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించాడు. 1900 లో [[గుంటూరు]] లో యంగ్‍మెన్స్ లిటరరీ అసోసియేషన్‍ ను స్థాపించాడు. 1902 లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించాడు . [[వీరేశలింగం పంతులు]] అధ్యక్షతలో తొలి [[వితంతు వివాహం]] జరిపించాడు. వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయాన్ని 1906 లోను, పూనాలోని కార్వే మహిళా విద్యాలయాన్ని, 1912 లోను సందర్శించాడు. 1913 లో జొన్నవిత్తుల గురునాథం తో కలసి విశాలాంధ్ర పటం తయారుచేశాడు. [[రాయవేలూరు]] జైలు నుంచి విడుదల అయిన తర్వాత 1922 లో గుంటూరులో శారదానికేతన్‍ను స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించాడు.
 
==మాలపల్లి నవల==