బెజవాడ రాజారత్నం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Bezawada Rajaratnam.jpg|right|thumb|బెజవాడ రాజారత్నం]]
'''బెజవాడ రాజారత్నం''' [[తెలుగు సినిమా]] నటి మరియు తొలి [[నేపథ్యగాయని]] . బెజవాడ రాజారత్నం [[1921]] సంవత్సరంలో [[తెనాలి]] పట్టణంలో జన్మించారు. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి మరియు జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత [[లంకా కామేశ్వరరావు]]తో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం, పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. అప్పట్లో రాజరత్నం పేరుతో ఇద్దరు నటీమణులుండేవారు. ఎవరెవరని గందరగోళం రాకుండా, వాళ్లిద్దరూ వాళ్ల వూరి పేర్లు తగిలించుకున్నారు. ఒకరు బెజవాడ రాజరత్నం. ఇంకొకరు కాకినాడ రాజరత్నం. వీరిలో కాకినాడ రాజరత్నం ప్రౌఢ పాత్రలు వేస్తే, బెజవాడ రాజరత్నం యువతి పాత్రలు ధరించేవారు. బెజవాడ రాజారత్నం గాయని, [[కాకినాడ రాజారత్నం]] గాయని కాదు.
 
==ప్రైవేటు గీతాలు==
పంక్తి 12:
సినిమాలకి వచ్చిన తర్వాత కూడా రాజరత్నం పది, పన్నెండు ప్రయివేట్‌ గీతాలు గ్రామ్‌ఫోన్‌కి పాడింది. సినిమాలకి నిదానంగా ప్లేబాక్‌ విధానం వస్తోంది. [[వందేమాతరం (1939 సినిమా)|వందేమాతరం(1939)]]లో నాగయ్య, కాంచనమాల పాడిన పాటలు ముందే రికార్డు చేసి, ప్లేబాక్‌ పద్ధతిలో చిత్రీకరించారు. ప్లేబాక్‌ కాకపోయినా, కృష్ణ అనే అబ్బాయికి సాబూ పాడాడు. ఒకరికి ఇంకొకరు పాడడం ఇలా మొదలైనా, ఈ పాట ముందుగా రికార్డు చెయ్యలేదు. వేరొకరిచేత ముందుగా పాడించి, రికార్డు చేసి ప్లేబాక్‌ చేసి చిత్రీకరించినది- [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్లీ పెళ్లి]]లో హీరో వై.వి.రావుకి ఆ చిత్రం సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు పాడారు. ఆ లెక్కలో ఓగిరాల మొదటి నేపథ్య గాయకుడు.
 
1942లో వాహిని వారి [[భక్త పోతన (1942 సినిమా)|భక్తపోతన]] విడుదలైంది. ఈ సినిమాలో రాజనర్తకి సామ్రాజ్యానికి 'ప్లే బాక్‌' పాడినది - బెజవాడ రాజరత్నం. ఈ విధంగా తెలుగు సినిమాల్లోని మొదటి నేపథ్య గాయనిగా రాజరత్నం చరిత్రకెక్కింది. 1943లో వచ్చిన [[భాగ్యలక్ష్మి (1943 సినిమా)|భాగ్యలక్ష్మి]]లో [[రావు బాలసరస్వతీ దేవి]] 'తిన్నెమీద సిన్నోడ' పాడారు- [[కమలా కోట్నీస్‌]]కి. 'భక్తపోతన' రికార్డు మీద రాజరత్నం పేరుంది. [[ఇది మంచి సమయము రారా (పాట)|ఇది మంచి సమయము రారా]] అన్నది ఆ పాట. అదేకాదు- పోతన సినిమాలో నాగయ్య, మాలతి, నాళం వనజాగుప్త- 'మానవసేవే- మాధవసేవా' పాట పాడారు; కాని, గ్రామ్‌ఫోన్‌ రికార్డులో బెజవాడ రాజరత్నం - [[మాలతి]] పాడిన చరణాలు పాడింది. నాగయ్య, వనజాగుప్తలు మళ్లీ పాడారు. ఇదొక విశేషం.
 
రాజరత్నం తమిళంలో కూడా నటించి, పాటలు పాడింది. 'మోహిని' అనే చిత్రంలో నాయిక మాధురికి ప్లేబాక్‌ పాడిందామె. జెమిని వారి [[జీవన్ముక్తి]](1942)లో రాజరత్నం నటించి, పాడింది. ఆమె, సూరిబాబు కలిసి పాడిన 'జోడుకొంటారా బాబూ, జోడుకొంటారా' పాట అప్పట్లో ప్రజల నోట వినిపించేది. ఘంటసాల బలరామయ్య తీసిన [[ముగ్గురు మరాఠీలు]](1946) రాజరత్నం చిన్నపాత్ర ధరించి రెండు పాటలు పాడింది. అయితే ఆమె ఎక్కువ చిత్రాల్లో నటించలేదు; ఎక్కువ నేపథ్య గీతాలూ పాడలేదు. మంచి కంఠంతో, హాయిగా పాటలు పాడేది గనక, పాటలున్న పాత్రలుంటే ఆమె చేత నటింపజేసి పాడించేవారు. ఆమె పాడిన పాటలన్నీ పాపులర్‌ అయినాయి.
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_రాజారత్నం" నుండి వెలికితీశారు