తిక్కవరపు పఠాభిరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
PattabhisRelatives.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:INeverCry. కారణం: (Per c:Commons:Deletion requests/File:PattabhisRelatives.jpg).
పంక్తి 42:
పఠాభి [[1919]] [[ఫిబ్రవరి 2]] న [[నెల్లూరు]]లో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు రామిరెడ్డి. భూస్వామి. [[మహాత్మా గాంధీ]] వారి ఇంటికి వచ్చినపుడు, ఆయన స్ఫూర్తితో అంతా స్వాతంత్య్ర సమరంలోకి దూకారు. [[రవీంద్రనాధ టాగూరు]] స్ఫూర్తితో పఠాభి [[శాంతి నికేతన్‌]]కు వెళ్ళి చదువుకున్నాడు. పట్టభద్రుడయ్యాక [[కలకత్తా]] విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు. [[1938]]లో కలకత్తా నుండి తిరిగివచ్చి కొన్నాళ్ళు [[గూడూరు,నెల్లూరు|గూడూరు]]లో కుటుంబ వ్యాపారమైన [[అభ్రకం]] ఎగుమతి వ్యాపారం చేసాడు. తరువాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితం చదివాడు. అమెరికా వెళ్లేముందే ''ఫిడేలు రాగాల డజన్‌'' రచించాడు. [[తెలుగు ఆధునిక కవిత్వం]]లో ఇది కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటికీ దానికి ఆదరణ ఉండడం గమనార్హం. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండో ప్రపంచ యుద్ధ]] సమయంలో సైన్యంలో చేరాలని [[అమెరికా]] బలవంతపెట్టింది. బ్రిటిష్‌వాళ్లు భారతీయుల్ని జైళ్లలో నెట్టినందుకు నిరసనగా సైన్యంలో చేరేందుకు నిరాకరించారు. సాహసోపేత యాత్రతో అమెరికా వదిలి [[దక్షిణ అమెరికా]], [[ఆఫ్రికా]]ల మీదుగా నౌకలో భారత్‌ చేరుకున్నాడు.
 
[[బొమ్మ:PattabhisRelatives.jpgబొమ్|thumb|left|250px|పఠాభి కుటుంబ సభ్యులు]]
దేశంలో అడుగుపెట్టాక [[1947]]లో స్నేహలతా పావెల్‌ అనే స్పానిష్‌ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె నటి. సామాజిక కార్యకర్త కూడా. ఆమె కోసం అపారమైన ఐశ్వర్యాన్ని సైతం వదులుకున్నాడు. దంపతులిద్దరూ [[ఎమర్జెన్సీ]] వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. [[పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్]] వ్యవస్థాపక సభ్యుల్లో ఆయనొకడు. సోషలిస్టు పార్టీలో పనిచేశాడు. వీరికి ఇద్దరు సంతానము. కుమారుడు కోనార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్యకారుడు. కూతురు నందనారెడ్డి కార్మిక న్యాయవాది, సామజిక సేవ కార్యకర్త