ఏ.యం.రాజా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''ఏ.యం.రాజా''' ('''అయిమల మన్మథరాజు రాజా''') (జూలై 1, [[1929]]-[[1989]]) 1950వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. [[విప్రనారాయణ]], [[చక్రపాణి]], [[ప్రేమలేఖలు]], [[మిస్సమ్మ]] పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వివిధ భాషలలో 10,000 పాటలు పాడి, వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చాడు.<ref>http://www.indiafilm.com/sing.htm#amr</ref>
 
ఏ.యం.రాజా [[1929]], జూలై 1 న [[చిత్తూరు]] జిల్లాలోని [[రామచంద్రపురం]]లో మన్మధరాజు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు.<ref>http://www.tfmpage.com/ppp/amraja.html</ref> మూడు నెలల ప్రాయంలోనే తండ్రి మరణించడంతో ఈయన రేణుకాపురంకు తరలి వెల్లింది. అక్కడే రాజా తన చదువు ప్రారంభించాడు. 1951లో మద్రాసు పచ్చయప్ప కళాశాల నుండి బి.ఎ. పట్టా పొందాడు. ఈయన చదువుకునే రోజుల్లోనే సంగీతంపై ఆసక్తితో మూడేళ్ళపాటు సాధనచేసి నేర్చుకున్నాడు. పచ్చయప్ప కళాశాల సంగీత పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. 1951లో కుమారి సినిమాకు నేపథ్యగాయకునిగా పనిచేయటానికి ఒప్పందం కుదిరింది. ఆ తరువాత సంసారంలో సినిమాలో పాడాడు. ఆ తరువాత అప్పట్లో విడుదలైన దాదాపు సినిమాలన్నింటిలో రాజా గొంతు వినిపించేది. ఈయన గాత్రం 1954, 1955 సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో విపరీతంగా విహారం చేసింది.
"https://te.wikipedia.org/wiki/ఏ.యం.రాజా" నుండి వెలికితీశారు