త్రిపురనేని గోపీచంద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
 
గోపీచంద్ చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నారు. ఇంటి పనులతోపాటు, తండ్రి గారి నాస్తికోద్యమమునకు[[నాస్తికోద్యమము]]నకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాల గడచి పోయింది. అటు తర్వాత, మద్రాస్ లో లా చదువుకున్నారు. అతని మీద చాలా కాలము వారి నాన్న గారి ప్రభావం ఉండేది. వారు మొదట వ్రాసిన చాలా నవలలో Marxist భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి.
 
వారు వ్రాసిన "మెరుపుల మరకలు" అనే గ్రంధంలో గాంధీరామయ్య అనే ఒక పాత్ర ఉంది. . ఆ పాత్ర శ్రీ [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] పంతులు గారిని పోలి ఉంటుందన్నది కొందరి భావన. రామస్వామి, పంతులు మంచి స్నేహితులు. రెండు భిన్న ధ్రువాలు. ఒకరు కరుడుగట్టిన నాస్తిక వాది, మరి ఒకరు పూర్తి ఆస్తికులు. ఇద్దరూ గాంధేయవాదులు. రామస్వామికి యవ్వనంలోనే భార్య గతించింది. పునర్వివాహం చేసుకోలేదు. ఒక రోజు పంతులు రామస్వామిని కలవటానికి తెనాలి వెళ్ళారు. స్నేహితులిద్దరికి గోపీచంద్ భోజనం వడ్డిస్తున్నారు. ఆ సందర్భములో, పంతులు "ఏమయ్యా! రామస్వామి నీవు ఉద్యమాలలో పూర్తిగా మునిగి, కుమారుడి వివాహము సంగతే మర్చిపోయావు" అని అన్నారు. అప్పుడు, రామస్వామి, నిజమే పంతులు గారు, ఆ విషయము పూర్తిగా మరచిపోయాను. మీరే ఏదైనా మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చెయ్యండి అని అన్నారట. అప్పుడు. పంతులు, [[గోపీచంద్]] తో, "నీవు మద్రాస్ వెళ్ళే లోపు ఒక పది రోజుల ముందు, గుంటూరు రా.." అని అన్నారు. గోపీచంద్, సరే అంటం... అలాగే గుంటూరికి వెళ్ళటం జరిగింది.
 
ఆ రోజుల్లో గుంటూరులో "శారదా నికేతన్" అనే వితంతు శరణాలయం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. దాని నిర్వహణ బాధ్యత అంతా ఆ రోజుల్లో పంతులు గారే చూసుకునే వారు. ఆ రోజుల్లో అన్నీ బాల్యవివాహాలు కావటం చేత, వధూవరులకు వయోభేదం ఉండటం చేత అక్కడ ఉన్నవారిలో కూడా చాలామంది బాలవితంతువులే! గోపీచంద్ వచ్చి పంతులుని కలసి, ఎందుకు రమ్మన్నారో చెప్పమని అడిగారు. పంతులు ఏ విషయము చెప్పకుండా, నీకు నచ్చిన ఒక క్లాసుకు వెళ్లి ఒక పది రోజులు పాఠాలు చెప్పమన్నారు. ఆ వితంతు శరణాలయాన్ని పంతులు నడుపుతున్న తీరు, బాలవితంతుల దీన పరిస్థితి గోపీచంద్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆయన రచనలలో కొన్నింటిలో వాటి ప్రభావం కనపడుతుంది. కాలక్రమంలో గోపీచంద్ మీద వారి నాన్న ప్రభావం తగ్గ నారంభించింది. స్వతంత్ర భావాలను పెంచుకున్నారు. జీవితములో పెంచి పెద్ద చేసిన నాన్న కంటే పంతులు ప్రభావం అతని మీద చాలావరకు ఉంది. అందుకే, గాంధీరామయ్య పాత్ర సజీవంగా నిలిచిపోయింది.
 
గోపీచంద్ నెమ్మదిగా మార్క్సిస్టు సిద్ధాంతం నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంధాన్ని వ్రాయటం జరిగింది. పోస్ట్ చెయ్యని ఉత్తరాలు, అసమర్ధుని జీవయాత్ర, మెరుపుల మరకలు - ఈ గ్రంధాలలో కూడా చాలావరకు తాత్విక చింతన కనపడుతుంది. ఆయనే, ఒక చోట ఇలా అంటారు, "మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు". మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. నిన్న మనం నమ్మింది ఈ రోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్నివదలి మళ్ళీ అన్వేషణ సాగించాలి. ఇదే విషయాన్ని [[జిడ్డు కృష్ణమూర్తి]], [[చలం]] కూడా చెప్పారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ. ఒక పుస్తకాన్ని వారి తండ్రిగారికి అంకితం ఇస్తూ- 'ఎందుకు' అని అడగటం నేర్పిన నాన్నకి అని వ్రాసారు. అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికెదిగారు.
 
==రచనలు==