మాధవరం (తాడేపల్లిగూడెం): కూర్పుల మధ్య తేడాలు

మిలిటరీ మాధవరం వ్యాసం విలీనం చేసితిని.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మాధవరం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[తాడేపల్లిగూడెం]] మండలానికి చెందిన గ్రామము. దీనికి మిలట్రీ మాధవరం అని కూడా పేరు. ఘనమైన గత చరిత్ర ఈ గ్రామం సొంతం. బ్రిటీష్ ఏలుబడిలో ఉన్న సమయంలోనే ఈ గ్రామం నుంచి అనేక మంది యువత సైన్యంలో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అందులో కొందరు అమరులయ్యారు. వారి స్మారకార్థం గ్రామంలోని చెరువు గట్టున ఓ స్మారకస్థూపం కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచీకరణతో ఈ గ్రామం నుంచి అనేక మంది అనేక దేశాలకు వెళ్లి స్థిరపడిపోయారు. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. అందుకే మిలట్రీ మాధవరం పేరు సార్థకనామధేయంగా మిగిలింది. మంచి విలువలు కలిగిన విద్యా వ్యవస్థ ఈ గ్రామానికి మణిహారం. జూనియర్ కాలేజి వరకు ఇక్కడ విద్యా సౌకర్యాలున్నాయి.
 
 
 
== మాధవరం చరిత్ర ==
17వ శతాబ్దం లో ఈ గ్రామం ఏర్పడినట్టుగ ఆధారాలు ఉన్నాయి. అప్పటి ఒడిషా, డెక్కన్ ప్రాంతాలను పరిపాలించే గజపతి వంశానికి చెందినా పూసపాటి మాధవ వర్మ బ్రహ్మ తన రాజ్య రక్షణ కోసం ఈ గ్రామానికి సుమారు 6 కీ.మీ దూరం లో ఉన్న అరుగొలను గ్రామం లో ఒక కోటను నిర్మించి, ఉత్తర ఆంధ్ర నుంచి సేన్యాన్ని ఇక్కడుకు రప్పించి వారికీ సాగు భూమి మరియు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. అరుగొలను గ్రామం లో ఇప్పటికి ఆ కోట శిధిలాలు ఉన్నాయి. ఈ సైనికులు మాధవరం గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆనాటి నుండి ఈ గ్రామంలోని వాళ్ళు అందరు సైన్యం లో చేరుతూ వచ్చారు. తరతరాలుగ దేశరక్షణ తమ ధ్యేయం జీవిస్తున్నారు. బ్రిటిష్ పరిపాలనలో భారత దేశం తరుపున మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధం లో సుమారు రెండువేల మంది పాల్గొన్నారు.<ref>http://www.hindu.com/2011/01/27/stories/2011012754320700.htm</ref><ref>http://www.caravanmagazine.in/lede/madhavarams-military-men-0</ref><ref>https://www.youtube.com/watch?v=3M2ceN7Cjb8</ref>
Line 19 ⟶ 16:
==మిలిటరీ మాధవరం==
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని పశ్చిమ గోదావరి జిల్లా [[తాడేపల్లిగూడెం]] మండలం లో [[మాధవరం]] గ్రామం ఉంది. ఇది తాడేపల్లిగూడెం పట్టనణానికి 12 కీ మీ ల దూరం లో ఉంది. ఈ గ్రామన్ని చుట్టుప్రక్కల గ్రామాలు వారు మిలిటరీ మాధవరం అని పిలుస్తారు. ఈ గ్రామం లో నివసించే ప్రతి కుటుంబం లో కనీసం ఒకరు మిలిటరీ లో ఉండటమే అ పేరు కి కారణం. మొదటి మరియు రెండవ ప్రపంచం యుద్ధలలలో ఈ గ్రామం నుంచి సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు. తోంభయి ఒక్కమంది అసువులు బాసారు. ఈ గ్రామం లో ప్రతి ఒక యువకునికి మిలిటరీ లో చేరడం అంటే ఒక ఆశయం.
==మూలాలు==
 
{{Reflist}}
{{తాడేపల్లిగూడెం మండలంలోని గ్రామాలు}}