నారాయణరావు పవార్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
 
నారాయణ రావు హైదరాబాదుకు వచ్చింతర్వాత కొంత మంది యువకులను చేరదీసి "యువ క్రాంతి దళ్" ఏర్పాటు చేశారు. దానికి [[కొండా లక్ష్మణ్ బాపూజీ]] సలహాదారుగా వుండి కొంత ఆర్థిక సహాయం కూడ చేసేవారు. ఆ విధంగా [[ఆర్య సమాజ]] కార్యక్రమాలలో పాల్గొంటూ న్యాయవాద విద్యను కొనసాగించాడు. 1946 లో ఒకసారి [[దారుస్సలాం]] మైదానంలో [[మహమ్మద్ అలీ జిన్నా]] ప్రసంగాన్ని విన్నాడు. రెచ్చగొట్టే అతని మాటలు జీర్ణించుకోలేక పోయాడు. ఏదైనా సాహసం చేయాలని అపుడే నారాయణరావు మిత్ర బృందం నిర్ణయించుకున్నది . . కాని ఏది? అనే స్పస్టత లేదు. "లా" కోర్సులో భాగంగా ప్రతి రోజు హైకోర్టులో జరిగే వకాలత్ కోర్సులకు వెళ్లేవాడు. ఒకనాడు వకాలత్ కోర్సుకు వెళుతుండగా నారాయణ రావు మిత్రుడు వకాలత్ క్లాసులు ఎలా వుంటాయో చూడాలని వెంట వచ్చాడు. ఆలా వారు వెళుతుండగా [[నయాపూల్ వంతెన]] వద్ద పోలీసులు వాహనాల రాకపోకలను ఆపేశారు. ప్రతి రోజు నిజాము నవాబు దారుల్ షిఫాలోని తన తల్లి సమాధిని దర్శించుకోడానికి వెళ్లివస్తుంటాడు. ఆ సమయాలలో పోలీసులు వాహనాల రాకపోకలను ఆపేస్తారు. నిలబడి వున్న నారాయణ రావు మిత్రబృందం కారులో వెళుతున్న [[నిజాము]]ను చూశారు. అప్పుడు మిత్రబృందంలోని ఒకడు అనాలోచితంగా, హఠాత్తుగా తన మిత్రులతో " [[నిజాము]]ను చంపేస్తె????........" అన్నాడు. ఆతరువాత ఆసంగతి గురించి ఎవరు మాట్లాడు కోలేదు. కొన్ని రోజుల తర్వాత మితృడు [[బాలకిషన్]] ఆ రోజు అనుకున్నట్లు నిజామును చంపాలని నిర్ణయించుకున్నట్లు నారాయణ రావుకు చెప్పాడు. అందరు సరే ననుకొనిసరేననుకొని ప్రణాళికను రూపొందించుకున్నారు. వీరందరూ [[సుభాష్ చంద్ర బోస్]] ఉపన్యాసాలను శ్రద్దగా చదివేవారు. అందులో అతని నినాదం "మీరు మీ రక్తాన్నివ్వండి..... నేను మీకు స్వాతంత్రం ఇస్తాను... " అన్న మాటలు వీరందరినీ ఉర్రూతలూగించింది. దాంతో మిత్రులందరు, బాంబులేసి నైజామును చంపాలని, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకున్నారు.
 
 
పంక్తి 13:
హైదరాబాద్ వచ్చి వివరంగా ఒక ప్రతిజ్ఞా పత్రాన్ని తయారు చేశారు. వీరు నిజాంను ఎందుకు చంపాలను కున్నది? దాని సారాంశం ఒక పత్రంలో రాసి, ఆరాసిన నకలును నారాయణ స్వామి వద్ద వుంచారు. పథకం అమలు చేసిన రోజు నారాయణ స్వామి బెజవాడ వెళ్లి ఆనకలు పత్రాన్ని, ముగ్గురు మిత్రులు కలిసి తీసుకున్న పోటోను, పత్రికల వారికి, రేడియో వారికి అంద జేయాలని ముందె నిర్ణయించు కున్నారు. ప్రతిజ్ఞా పత్రంపై ముగ్గురు మిత్రులు....... అనగా నారాయణ రావు పవార్ [[జగదీష్,]] [[గండయ్య]] తమ రక్తంతో సంతకం చేశారు. డిసెంబరు నెల నాల్గవ తారీఖు 1947 సాయంకాలం నాలుగు గంటల సమయం..........[[కింగ్ కోటి]]] రోడ్డు, నిజాం నివాసంముందు. రోడ్డు పై ముగ్గురు మిత్రులు దూర దూరంగా అక్కడక్కడా నిలబడాలి, మొదటి వ్యక్తి విఫలమైతే రెండో వాడు పని కానిచ్చాలి, అక్కడా తప్పితే మూడో వాడు పథకాన్ని అమలు కానివ్వాలి. ఇది వారి పథకం. కింగ్ కోఠి రోడ్డులో ప్రతి చౌరస్తా వద్ద ఒక పోలీసు మరొక జవాను వున్నారు. కానిస్టేబుల్ ట్రాపిక్ ను నియంత్రిస్తే జవాను ఆచుట్టు పక్కల తిరుగుతున్న జనాలపై నిఘా పెడుతున్నాడు.
 
నారాయణ రావు గల్లీలోంచి రోడ్డు పైకి వచ్చి తన సైకిల్ ను గోడకు ఆనించాడు. ఇది జవాను గమనించాడు. అప్పటికే నిజాము కారు రెండో కానిస్టేబులు వద్దకు వచ్చింది. ఇంతలో నారాయణరావు సంచిలో నుండి బాంబును బయటి తీసి దాని 'పిన్' లాగి [[నిజాం]] వస్తున్న కారు పైకి విసిరాడు. అది పెద్ద శబ్దంతో పేలి పోయింది. అది పడ్డ ప్రదేశంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ముగ్గురు సాధారణ పౌరులు తీవ్ర గాయ పడగా ఒక చిన్న పిల్ల అక్కిడికక్కడే మరణించింది. కారు మాత్రం తప్పించు కుంది. నారాయణ రావు జేబులో చేయి పెట్టి రివాల్వర్ తీసే లోపె జవాను వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు. అతను విషం మింగే అవకాశం కూడ లేదు. బాంబు శబ్దం విన్న మిగతా ఇద్దరు పథకం సఫలం అయిందని అక్కడి నుండి తప్పుకున్నారు. లేక పోతే నిజాముకు ఇదే ఆఖరి రోజు అయ్యెదిఅయ్యేది.
 
నారాయణ రావును పోలీసులు చుట్టుపక్కల వున్న ప్రజలు విచక్షణా రహితంగా కొట్టారు. ఒకడు రాయి తోరాయితో మూతి మీద కొట్టగా పళ్ళు రాలి పోయాయి. బాంబు పేలిన ప్రాంతంలో ఒక డాక్టర్ గారి ఇల్లు వున్నది. నిజాం కారు డ్రవర్ తెలివిగా కారును ఆ ఇంటి లోనికి పోనిచ్చాడు. నారాయణ రావు బాంబు వేస్తున్నప్పుడు మొదట చూసిన వ్యక్తి ఆ డాక్టర్ ఇంటి వాచ్ మాన్. అతను అరబ్బువాడు. వాడు నారాయణ రావు నురావును తన మొలలో వున్న బాకు తీసి చంప బోయాడు. అక్కడున్న ఇనస్పెక్టర్ చేయి అడ్డం పెట్టి "ఇప్పడే చంపొద్దు...రహస్యాలు రాబట్టాలి " అని వారించాడు. అతని చేతికి గాయం అయింది. కోర్టు విచారణ లో కూడ ఈ అరబ్బు కాపలాదారుడే మొదటి సాక్షి. పోలీసు స్టేషను లో విచారణ సమయంలో మనారాయణనారాయణ రావుని నీవు హిందువువా మిస్లిం వా , నీ పేరేమిటని అడగ్గా హిందు/ ముస్లిం తేడా తెలియకుండా వుండ డానికి తన పేరు "బాబు" అని అన్నాడు. కాని పోలీసులు నారాయణ రావు బట్టలన్నీ వూడ దీసి అతను హిందువని నిర్దారించారు. ఇంతలో [[నైజామ్]] ప్రధాని [[మీర్ లాయక్ అలి]] అక్కడికి వచ్చి నారాయణ రావునుద్దేసించి "నిన్ను ఎవరు పంపారు? రాజ కుటుంబీకులా? లేక [[సర్దార్ పటేల్|సర్దార్ పటేలా?]] " అని ప్రశ్నించాడు. దానికి నారాయణ రావు తనే స్వయంగా ఈ పనికి పూనుకున్నానని చెప్పాడు. అలా రెండు రోజులు పలు రకాలుగా చిత్ర హింసలు పెట్టారు పోలీసులు. ఆ మరు దినం ఎదురు సెల్ గదిలో [[గండయ్య]] వున్నాడు. అతను అద్దెకు తీసుకున్న సైకిల్ పైన వున్న పేరును బట్టి దాని ఆదారంతో పోలీసులు గండయ్యను అరెస్ట్ చేశారని ఆ తర్వాతి తెలిసింది. పోలీసులు వరంగల్లు వెళ్లి నారాయణ రావు ఇంటిని శోధించారు. నారాయణ రావు తండ్రి తన కొడుకు అంత సాహసికుడు కాదన్నాడు. నిజ నిర్దారణకు, అతడిని హైదరాబాదు తీసుకొచ్చి ఖైదిని చూపగా అతడు తన కొడుకే నని ఒప్పుకున్నాడు. ఆ తండ్రి తన కొడుకు ఇంత పని చేశాడని కోప్పడలేదు, కొట్టలేదు, అసహ్యించు కోలేదు. కొడుక్కి అంతా మంచి జరుగు తుందని, దేవుడు రక్షిస్తాడని, దైర్యం చెప్పాడు కొడుక్కు. నారాయణ రావు తన కేసును వాదించ డానికి ఏ వకీలును నియమించు కోలేదు. తన కేసును తనే వాదించు కున్నాడు. విచారణ సమయంలో నారాయణ రావు తండ్రి వచ్చి నప్పుడు మిఠాయి తెచ్చి ఇచ్చే వాడు. దైర్యం చెప్పేవాడు. నారాయణ రావు విచారణ సందర్భంలో తను తయారు చేసుకున్న ప్రతిజ్ఞా పాటాన్ని మళ్లి, మళ్ళి చెప్పేవాడు. నారాయణ రావు తండ్రి తనయుడి విడుదల కొరకు, పండరి నాథుడు విఠల్ దేవునికి మొక్కుకొని జుట్టు, గడ్డం, మీసాలు పెంచి సాధువులా జీవించాడు. చివరకు అత్యున్నత న్యాయస్థానం నారాయణ రావు పవార్ కు [[ఉరి శిక్ష]] విధించింది. అపుడు నారాయణ రావు పవార్ గర్వంగా "సర్ కటా సక్తే హై లెకిన్ స్ర్జుఆ సక్తే నహీ" అని[[ పండిత రాం ప్రసాద్ బిస్మిల్ల]] కవిత చరణాలను బిగ్గరగా పాడుకున్నాడు.<ref>ఆంధ్ర జ్యోతి ఆదివారం. 23 జనవరి; 2011</ref>
 
1948 సంవత్సరం, సెప్టెంబరు 17 న [[నిజాము నవాబు]] [[వల్లబాయి పఠేల్]] ముందు లొంగి పోగా, హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర భారత్ లో విలీనం అయి పోయింది. హైదరాబాద్‌ సంస్థానం విముక్తి తర్వాత మిలిటరీ గవర్నర్‌ మేజర్‌ జనరల్‌ [[జె.ఎన్.చౌదరి]] వారి ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాడు. కాని వివిధ సంస్థల ఆందోళనతో 1949 ఆగస్టు 10న జనరల్‌ చౌదరి వీరిని విడుదల చేశారు.<ref>[http://www.prabhanews.com/specialstories/article-29707 ముగిసిన నియంత నిజాం పాలన - ఆంధ్రప్రభ 17 Sep 2009]</ref> నారాయణరావు పవార్ 85 యేళ్ళ వయసులో హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో డిసెంబర్ 8, 2010న కన్నుమూసాడు.<ref>[http://archives.andhrabhoomi.net/state/4-453
"https://te.wikipedia.org/wiki/నారాయణరావు_పవార్" నుండి వెలికితీశారు