అక్కన్న మాదన్న మహాకాళి గుడి: కూర్పుల మధ్య తేడాలు

+/- వర్గం
పంక్తి 36:
 
==చరిత్ర==
17 వ శతాబ్దంలో హైదరాబాదు [[తానీషా]] పరిపాలనలో ఉండేది. ఆయన [[గోల్కొండ]] కోటకు చక్రవర్తిగా ఉండేవారు. ఆయన రాజ్యంలో అనేక మంది మంత్రులు ఉండేవారు. వారిలో ముఖులు [[అక్కన్న]], మరియు [[మాదన్న]] లు. వారిలో ఒకరు సైనికాధికారిగానూ మరొకరు ప్రధాన మంత్రిగానూ ఉండేవారు. ఈ సోదరులు రాజాస్థానంలో ముఖ్యమైన మంత్రులుగా ఉండేవారు. వారు ఈ దేవాలయం ప్రాంతంలో నివసించేవారు. వీరు మహాకాళీ యొక్క భక్తులు. వారు ప్రతిరోజు ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. వారు పూజలు చేసిన తర్వాతనే రాజాస్థానానికి (గోల్కొండ) కు హాజరయ్యేవారు. వారు హతులైన తర్వాత ఈ దేవాలయం మూయబడినది.
 
67 సంవత్సరాల తర్వాత ఈ దేవాలయం సాలిబండ వద్ద పునః ప్రారంభించబడినది. ఈ దేవాలయం ప్రారంభించిన తర్వాత అతి కొద్దిమంది పాత నగరం ప్రజలు వెళ్ళేవారు. ప్రస్తుతం ఈ దేవాలయం అతి ప్రసిద్ధి చెందిన మహాకాళీ ఆలయంగా కొనియాడబడుతుంది.