ఉమా రామారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
4-జూలై-1938 న "ఉమా మహేశ్వరి" డా. శ్రీ వి.వి. కృష్ణారావు, [[వడ్డాది సౌభాగ్య గౌరి|శ్రీమతి సౌభాగ్యం]] లకు [[విశాఖపట్టణం]] లో జన్మించినది. సాహిత్యం, సంగీతం మరియు నృత్యాల యెడల అమితాసక్తిగల వేదపండితుల ఇంట జన్మించటం, వారందించిన స్ఫూర్తి, ప్రేరణలతో 5వ ఏటి నుండే ఆచార్య పి.వి.నరసింహా రావు, పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ, బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి, గురు పక్కీరిస్వామి పిళ్ళై మరియు గురు సి.ఆర్. ఆచార్యల వద్ద [[కూచిపూడి]], [[భరతనాట్యం]] మరియు ఇతర సాంప్రదాయిక నృత్యరీతులని అభ్యసించటం ప్రారంభించినది. ఈ నృత్యరీతుల సైద్ధాంతిక మరియు ఆచరణీయ కారకాలని అవపోసన పట్టినది.
 
తొలినాళ్ళలో సోదరి సుమతి[[సుమతీ కౌశల్కౌశల్‌]] తో బాటు పలు సంధర్భాలలో పలు ప్రదేశాల్లో గురువుల వ్యక్తిగత పర్యవేక్షణ లో ప్రదర్శనలు చేసినది. 1953-55 లలో అప్పటి [[మద్రాసు]] ప్రభుత్వం నిర్వహించిన శాస్త్రీయ సంగీత, నృత్య పరీక్షలలో ఉత్తీర్ణురాలైనది. అటు పిమ్మట డా. నటరాజ రామకృష్ణ గారి ఆశీస్సులతో భావి తరాలకు ఈ సాంప్రదాయాన్ని అందించేందుకు ఆచార్యుల వృత్తిని చేపట్టారు.
 
[[అర్థశాస్త్రం]] లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి పోస్టు-గ్రాడ్యుయేట్ పట్టాని పుచ్చుకొన్నారు.
"https://te.wikipedia.org/wiki/ఉమా_రామారావు" నుండి వెలికితీశారు