కథానాయకుడు (1969): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 17:
[[ముళ్ళపూడి వెంకటరమణ]] రాసిన రాజకీయాలపై రాసిన వ్యంగ్య కథల మాలిక [[రాజకీయ బేతాళ పంచవింశతిక]]. అందులోని ఒకానొక చిన్న కథ-స్వామి ద్రోహి కథ. కథానాయకుడు సినిమా ఆ కథను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చేశారు. ముళ్ళపూడి వెంకటరమణ ఆ కథను ఆధారంగా చేసుకుని 150 పేజీల్లో సీన్ల విభజనతో సహా ట్రీట్మెంట్ రాశారు. అయితే రమణ అప్పటికే రచయితగా, నిర్మాతగా బిజీ అయిపోవడంతో సంభాషణలు [[భమిడిపాటి రాధాకృష్ణ]] రాశారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref>
== రీమేక్స్ ==
కథానాయకుడు సినిమా తమిళ, హిందీ భాషల్లో పునర్నిర్మితమై విజయవంతమైంది. 1969లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలన్న ఆలోచనతో ఉన్న ఎం.జి.రామచంద్రన్ ప్రజలు దాన్నెలా స్వీకరిస్తారోనన్న సందేహంతో ఉన్నారు. ఆ సమయంలో ప్రముఖ నిర్మాత నాగిరెడ్డిని రాజకీయ సంబంధమైన చిత్రాన్ని నిర్మించమని కోరారు. దాంతో తెలుగులో విజయవంతమైన కథానాయకుడు సినిమాను సూచించగా దాన్ని అంగీకరించి తమిళంలో ''నమ్నాడు'' పేరిట [[ఎం.జి.రామచంద్రన్]], [[జయలలిత (నటి)|జయలలిత]], [[ఎస్.వి. రంగారావు]] ప్రధాన పాత్రల్లో [[బి.నాగిరెడ్డి]], [[చక్రపాణి]] నిర్మించారు. ''నమ్నాడు'' చిత్ర విజయం, మరీ ముఖ్యంగా ఎంజిఆర్, నాగిరెడ్డి మేఖలా థియేటర్లో సినిమా చూసేప్పుడు దురై(ఎం.జి.రామచంద్రన్) మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాకా అలిమేలు(జయలలిత) విజయగీతం ఆలపించడాన్ని ప్రజలు ఆస్వాదించడం, ఆ పాట మళ్ళీ వేయాలని గొడవపెట్టి మరీ వేయించుకుని చూడడం వంటివి, రామచంద్రన్ రాజకీయాల్లోకి రావడానికి ప్రజామోదం ఉన్నట్టు నమ్మకం కలిగించాయి. తర్వాత ఆయన తమిళనాడు శాసనసభకు అతిగొప్ప మెజారిటీతో ఎన్నికై సంచలనం సృష్టించారు. ''నమ్నాడు''కు దర్శకత్వం వహించిన సి.పి.జంబులింగాన్నే దర్శకునిగా పెట్టుకుని ఇదే సినిమాను హిందీలో ''అప్నా దేశ్'' పేరిట పునర్నిర్మించారు. అప్నా దేశ్ సినిమాలో [[రాజేశ్ ఖన్నా]], [[జయలలిత (నటి)|జయలలిత]], [[ఓంప్రకాష్]] ప్రధాన పాత్రలు ధరించారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" />
==పాటలు==
|