పూల రంగడు (1967 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →అభివృద్ధి |
|||
పంక్తి 37:
=== అభివృద్ధి ===
సాధారణంగా సినిమా కథ రాసుకుని దానికి అనుగుణంగా పేరును పెట్టుకోవడం జరిగే రోజులవి. అయితే ఈ సినిమా విషయంలో పూర్తి రివర్సులో ముందుగా అక్కినేని నాగేశ్వరరావు ఇమేజ్ కి తగ్గ పేరు- పూలరంగడు అనుకుని, ఆపైన కథ రాయమని రచయితను పెట్టుకున్నారు. ముళ్లపూడి వెంకటరమణ సినిమాకి కథని అభివృద్ధి చేయడం ప్రారంభించాకా ఆయనకీ, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకీ వచ్చిన విభేదాల వల్ల దీనితో పాటుగా ఆదుర్తితో ఉన్న నాలుగైదు చిత్రాలను వదిలేశారు. ఎవరెంత వారించినా, బతిమాలినా వినకుండా మద్రాసు నుంచి విజయవాడ మారిపోయి పత్రికలో పనిచేయడం ప్రారంభించారు.ఆపైన [[గొల్లపూడి మారుతీరావు]], ప్రముఖ నవలా రచయిత్రి [[యద్దనపూడి సులోచనారాణి]] కథారచన సాగించారు. అది మధ్యలో ఉండగా గొల్లపూడి [[హైదరాబాద్]] [[ఆలిండియా రేడియో]] కు బదిలీ అయ్యారు. ఆపైన ఆ కథ మీద అప్పటికి [[బలిపీఠం (నవల)|బలిపీఠం]] నవలతో ప్రఖ్యాతిచెందిన [[ముప్పాళ్ళ రంగనాయకమ్మ]] కూడా పనిచేశారు.<br />
ఇంత జరిగినా కథ ఓ కొలిక్కి రాకపోతూండడంతో మళ్ళీ స్క్రిప్ట్ ముళ్ళపూడి వెంకటరమణ చేతికి వచ్చింది. ఆదుర్తిని, ఆయన సినిమాను వదిలేసి పత్రికలో పనికి [[విజయవాడ]] వెళ్ళగానే [[పి.పుల్లయ్య]] ఒప్పించి [[ప్రాణమిత్రులు]] సినిమాకి రాయించుకున్నారు. మళ్ళీ ఆదుర్తితో పనిచేయాలని, ఈ సినిమా కథ పూర్తిచేయాలని పిలిస్తే ముళ్లపూడి వెంకటరమణ అప్పటికి వారిద్దరి మధ్య వచ్చిన స్పర్థలు దృష్టిలో ఉంచుకుని కలసిపనిచేయడం కష్టమని క్షమించమన్నారు. రమణకు తొలినుంచీ ఆప్తుడైన [[అక్కినేని నాగేశ్వరరావు]], నవయుగ డిస్ట్రిబ్యూషన్ సంస్థకు చెందిన వాసు వంటివారు ఫోన్ చేసి పిలవగా మొహమాటం కొద్దీ ఈ కథ మీద పనిచేసేందుకు అంగీకరించారు, అయితే మద్రాసు వచ్చిపనిచేయలేమన్నారు. దాంతో కథాచర్చల కోసం అందరూ విజయవాడ వచ్చారు.<br />
అప్పటికి కథలో చాలా భాగం వివిధ రచయితలు, రచయిత్రలు రాయగా తీయడం పోగా, క్లైమాక్స్ మరికొంత ఇతర భాగాలు మిగిలాయి. విజయవాడ రైల్వేస్టేషన్ రెస్టురూముల్లోనే కథాచర్చలు సాగాయి. చివరకి క్లైమాక్స్ రాసేందుకు ముళ్ళపూడి వెంకటరమణ ప్రఖ్యాతమైన [[పంచతంత్రం]] కథల్లోని మిత్రభేదం స్వీకరించారు. సంజీవకుడు, పింగళకుడు అనే ఎద్దు, సింహం స్నేహితులు కాగా వారి మధ్య కరకట దమనకులనే నక్కలు భేదాలు సృష్టించి, శత్రువులై సింహమే ఎద్దును చంపేలా ప్రేరేపిస్తారు. ఈ అంశాన్ని స్వీకరించి కథానాయకుడు విలన్ల మధ్య విభేదాలు సృష్టించి తన చేతికి మట్టి అంటకుండా వారిలో వారే కొట్టుకుచచ్చేలా క్లైమాక్స్ రాయడంతో చివరకి కథ పూర్తయ్యింది.<ref name="ఇంకోతి కొమ్మచ్చి">{{cite book|last1=ముళ్ళపూడి|first1=వెంకటరమణ|title=(ఇం)కోతి కొమ్మచ్చి|date=జూలై 2013|publisher=వరప్రసాద్ రెడ్డి|location=హైదరాబాద్|edition=6}}</ref>
|