వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఈమె 1897 మే 5వ తేదీన కడప జిల్లా [[రాజంపేట]] తాలూకా [[నందలూరు]] గ్రామంలో భ్రమరాంబ, ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు.<ref>కమలాదేవి, వేదాంతం (1897 - 1940), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 63-64.</ref> ఈమెకు 12 ఏటనే వేదాంతం కృష్ణయ్య తో వివాహం జరిగింది. వైద్యవిద్య చదువుతున్న భర్తకు తోడుగా [[కలకత్తా]] లో ఉంటున్నప్పుడు అక్కడి ప్రముఖ సంఘ సేవికురాలు శ్రీమతి సుప్రభాదేవి తో ఏర్పడిన పరిచయసాన్నిహిత్యం వలన విశేషంగా ప్రభావితమైంది.
 
1920 లో [[కాకినాడ]] లో స్థిరపడిన పిమ్మట జాతీయోద్యమపోరాటంలో పాల్గొనడం ప్రారంభించారు.విదేశీ వస్త్ర బహిష్కరణ, నూలు వడకడం, ఖద్దరు ప్రచారం చేసారు. దేశ బాందవి [[దువ్వూరి సుబ్బమ్మ]] గారిని ఆదర్శంగా తీసుకొని 1921 లో [[సహాయ నిరాకరణోద్యమం]]లో పాల్గొన్నారు. తిలక్ స్వరాజ్య నిధికి అనేకమంది దాతల నుండి భారీ విరాళాలు స్వీకరించి గాంధీజి ప్రశంసలను పొందారు. 1923 లో కాకినాడలో అఖిల భారత కాంగ్రేస్ సభలు జరిగినప్పుడు మహర్షి [[బులుసు సాంబమూర్తి]] ప్రొత్సాహంతో మహిళా కార్యకర్తల దళానికి నాయకురాలిగా విశెషసేవలు అందించారు.
 
ఒక ప్రక్క స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే, మహిళలలొ జాగృతికై కృషి చేసారు.స్రీలలో జాతీయభావాలు ప్రేరేపించేవారు.ప్రాధమిక విద్యావ్యాప్తికి తోడ్పడ్డారు.పక్షవాతంతో సరిగా తిరగలేని స్థితిలో కూడా సేవానిరతిని కోల్పోలేదు.అస్వస్థత కారణంగా తన స్వగృహం ఆనంద నిలయాన్నే అనాధ శరణాలయంగా మార్చి సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు.
"https://te.wikipedia.org/wiki/వేదాంతం_కమలాదేవి" నుండి వెలికితీశారు