ప్రియంవద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
సుశిక్షితురాలైన గెరిల్లా సైనికురాలు ప్రియంవద తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా ఆదర్శ జీవనప్రస్థానం సాగించారు. 1943 సంవత్సరంలో 15ఏళ్ళ వయసులోనే అన్న రాజిరెడ్డితో కలిసి ఖమ్మం ఆంధ్రమహాసభకు హాజరయ్యింది. తెలంగాణ సాయుధపోరాట యోధులు కీ.శే. [[బొమ్మగాని ధర్మభిక్షం]], [[భీమిరెడ్డి నరసింహారెడ్డి]], దాయం రాజిరెడ్డిలతో కలిసి సూర్యాపేట ప్రాంతంలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1944లో విజయవాడలో జరిగిన అఖిలభారత కిసాన్‌ మహాసభకు వలంటీర్‌గా పనిచేశారు. గెరిల్లా సైనికురాలిగా ఆయుధం పట్టడానికి ముందు ఆమె విజయవాడలో ఆత్మరక్షణ, ఆయుధశిక్షణ పొందారు. సాయుధ పోరాటంలో గాయపడ్డ యోధులకు వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఆరోగ్యసేవిక (నర్సింగ్‌) ట్రైనింగ్‌ పొందారు.
 
ప్రియంవద వాళ్ల వదిన శశిరేఖ అన్నయ్య భీంరెడ్డి నర్సింహారెడ్డి. అన్న, వదినలతో పాటు భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు వెళ్లింది ప్రియంవద. అలా పదిహేనేళ్ల ప్రాయంలో ఆమె ఉద్యమం పట్ల ప్రభావితమైంది. స్త్రీల సమస్యలపై, రైతు కూలీల సమస్యలపై అన్నతో కలిసి ఉద్యమబాట పట్టింది. 1952లో జరిగిన ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో పిడిఎఫ్‌ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. మహిళా హక్కుల సాధన, బాల్యవివాహాల నిర్మూలన, బాలికా విద్య కోసం ఉద్యమం చేపట్టారు.
 
యూనియన్‌ సైన్యాలు వచ్చిన తర్వాత పట్టుబడ్డ ప్రియంవదను సికిందరాబాద్‌ మిలిటరీ క్యాంపులో మూడు మాసాలపాటు నిర్బంధించారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జైళ్ళలోనూ ఆమె జైలు జీవితం గడిచింది. అవివాహితగా ఉన్న ప్రియంవద తుదిశ్వాస విడిచే వరకూ సిపిఐ నాయకురాలిగా, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యక్రమాల్లో చురుకైన పాత్రను నిర్వర్తించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రియంవద" నుండి వెలికితీశారు