ప్రియంవద: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
యూనియన్‌ సైన్యాలు వచ్చిన తర్వాత పట్టుబడ్డ ప్రియంవదను సికిందరాబాద్‌ మిలిటరీ క్యాంపులో మూడు మాసాలపాటు నిర్బంధించారు. నల్లగొండ, ఖమ్మం, [[వరంగల్‌]] జైళ్ళలోనూ ఆమె జైలు జీవితం గడిచింది. అవివాహితగా ఉన్న ప్రియంవద తుదిశ్వాస విడిచే వరకూ సిపిఐ నాయకురాలిగా, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు కార్యక్రమాల్లో చురుకైన పాత్రను నిర్వర్తించారు.
 
ఆంధ్రమహాసభలు వరంగల్, ఖమ్మంలో జరిగిన తర్వాత అన్న రాజిరెడ్డిను భువనగిరి ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్‌గా నియమించారు. ఇబ్బందుల్లో ఉన్న రాజిరెడ్డికి తోడుగా [[కొలనుపాక]] జైన మందిరంలో నడిపే స్కూలులో యాభై రూపాయల జీతంతో టీచర్‌గా చేరారు. అక్కడ ఒక సంవత్సరంపాటు పనిచేశారు. ఆసమయంలో వీరి కుటంబంపై ప్రభుత్వం నిషేదం విధించడంతో 1944లో విజయవాడ కి వెళ్లారు. అక్కడ జరిగిన అఖిలభారత కిసాన్‌ మహాసభకు వలంటీర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వివిధ గ్రామాలకు వెళ్లి తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఆడవాళ్లలో చైతన్యం కలిగించింది. సూర్యాపేటలో భక్తవత్సలాపురం, అనాసపురం, దురాసపల్లి, రాయపాడు గ్రామాలల్ల తిరిగేది ప్రియంవద. ఇళ్ళల్లోకి వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలె ? స్త్రీలకు స్థావరాలు కొన్ని తెలిసున్నా చెప్పకుండా ఎట్లుండాలె? కారం అదీ చల్లటానికి ఎట్ల సిద్ధమయ్యా చెప్పేది. ఇల్లు వదిలిపోయేటప్పుడు అన్నం గిట్ల ఉంటె అండ్ల విషం కలిపి పెట్టిపోవాలె అని చెప్పేది. రజాకార్లకు సొమ్ములు లాక్కెళ్ళడంతో పాటు తిండి సమస్య కూడా ఉండేది. అది కుమ్మరించుకుని తినేది. మామూలుగా సమాజంలో స్త్రీలకుండే ఇబ్బందులు వాటినెదుర్కోవాలంటే ఏం చెయ్యాలె ? స్త్రీలను ముందుకెట్లా తీసుకురావాలి అన్న విషయాలు ఎంతో ఉత్తేజంతో ప్రసంగించేది. చదువు విషయంలో ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకు పాఠాలు చెప్పేది. వీధివీధికి గ్రూపు మీటింగులు పెట్టేది. సూర్యాపేటలో ఒక సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత హుజూర్‌నగర్‌లో మరికొంత కాలం పనిచేసింది.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రియంవద" నుండి వెలికితీశారు