అంగజాల రాజశేఖర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
అంగజాల రాజశేఖర్ [[విజయనగరం]] జిల్లా [[సాలూరు]] లో సావిత్రమ్మ,జగన్నాధయ్య దంపతులకు మూడవ కుమారునిగా [[జూలై 1]] [[1961]] న జన్మించారు. ఆయన తండ్రి సాలూరు పట్టణంలో వ్యాపారం చేసేవారు. జగన్నాధయ్య గారికి నలుగురు కుమారులు. వారు నాగేశ్వరరావు,మురళీకృష్ణ,రాజశేఖర్ మరియు రవికుమార్. రాజశేఖర్ తండ్రిగారు [[సెప్టెంబరు 29]] [[1989]] న పరమపదించారు.
 
రాజశేఖర్ ఆంధ్రా మెడికల్ కాలేజీ,విశాఖపట్నం లో ఎం.బి.బి.ఎస్. డిగ్రీని పొందారు. ఆయన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,న్యూఢిల్లీ నుండి పాథాలజీ లో ఎం.డి (1985-88) చేసారు.తరువాత నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు మెడ్విన్ హాస్పటల్ లలో తన సేవలనందించారు. ఆయన [[హైదరాబాదు]]లో నేషనల్ పాథాలజీ లేబొరేటరీని స్థాపించి దానిని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఆయన 1989లో [[శ్రీకాకుళం]] నకు చెందిన రెడ్లం శ్రీరాముకు కుమార్తె అయిన డా.పద్మకుమారిని వివాహమాడారు. రాజశేఖర్ [[బలిజిపేట]] మరియు సిగడాం లో గల బంధువులకు,ప్రజలకు వైద్యసేవలనందిస్తుంటారు. ఆయనకు ఒక కుమారుడు(హేమంత్ కుమార్) మరియు ఒక కుమార్తె (గౌతమీ ప్రియదర్శిని) ఉన్నారు.కుమార్తె ఉస్మానియా మెడికల్ కాలేజీ,హైదరాబాదులో ఎం.బి.బి.ఎస్ చేస్తున్నారు.<ref>[http://maddamasettyjagannadhayya.blogspot.in/2011/01/maddamasetty-savithramma.html Maddamasetty Savithramma]</ref>
 
==తెలుగు వికీపీడియాలో సేవలు==
"https://te.wikipedia.org/wiki/అంగజాల_రాజశేఖర్" నుండి వెలికితీశారు