ఆ నలుగురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
సినిమాలో కథానాయకుడు రఘురాం పాత్ర వయసుమళ్ళిన పత్రికాసంపాదకుని పాత్ర. భావోద్వేగాలు బాగా పండించాల్సిన పాత్ర కావడంతో మొదట సినిమా తీద్దామనుకున్న [[అట్లూరి పూర్ణచంద్రరావు]] దర్శక నటులు [[విసు (నటుడు)|విసు]], [[దాసరి నారాయణరావు]], నటుడు [[మోహన్‌ బాబు]]లలో ఎవరో ఒకరితో ఆ పాత్ర చేయించాలని భావించారు. వీరెవరితోనూ కుదరకుంటే [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]] ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత [[కె.భాగ్యరాజా]]కు ఈ సినిమా దర్శకత్వం వహించే అవకాశం తాను కథానాయక పాత్ర పోషిస్తానని పట్టుపట్టినందు వల్లనే చేజారింది.<br />
తర్వాత సినిమాని చేపట్టిన దర్వకుడు చంద్రసిద్ధార్థ్, మదన్ కథానాయకుని పాత్రకు [[రాజేంద్ర ప్రసాద్]] ని జర్నలిస్ట్ అన్నే రవి ద్వారా సంప్రదించారు. రాజేంద్రప్రసాద్ ఇంటి బెడ్రూంలో మదన్ దర్శకుడికి, రాజేంద్రప్రసాద్ కీ కథ వినిపించారు. కథ పూర్తికాగానే ఒకరు బాత్రూంలోకి, మరొకరు బాల్కనీలోకి వెళ్ళిపోయారు. ఒక్కడే మిగిలిపోయిన కథారచయిత మదన్ ఇక ఈ అవకాశమూ చేజారిపోయినట్టే అని నిరుత్సాహపడే దశలో రాజేంద్రప్రసాద్ కళ్ళుతుడుచుకుని వచ్చి ఈ సినిమా వెనువెంటనే ప్రారంభించాలని తన నిర్ణయం చెప్పేశారు. తర్వాత రాజేంద్రప్రసాద్ తన పాత్ర ప్రవర్తించే తీరు, సంభాషణలు చెప్పే విధానం, కళ్ళజోడు, పంచెకట్టు, విగ్గు ఇలా అన్నీ ఎలావుండాలో ఆలోచించిపెట్టుకునే పనిలో పడిపోయారు.<br />
రాజేంద్రప్రసాద్ పక్కన కథానాయిక పాత్ర కోసం చాలామందిని సంప్రదించారు. [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[గౌతమి (నటి)|గౌతమి]], [[భానుప్రియ]], [[రోజా సెల్వమణి|రోజా]] మొదలైన గతతరం కథానాయికలకు కథ వినిపించారు.
 
==అవార్డులు==
"https://te.wikipedia.org/wiki/ఆ_నలుగురు" నుండి వెలికితీశారు