దామోదరం సంజీవయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ముఖ్యమంత్రిగా: clean up, replaced: నడిచి → నడచి using AWB
పంక్తి 43:
 
==ముఖ్యమంత్రిగా ==
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి తన ప్రత్యర్థి అయిన పిడతల రంగారెడ్డిని దెబ్బకొట్టాలని కర్నూలు జిల్లాలోని బస్సురూట్లను జాతీయీకరణ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందువల్ల సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ స్థానంలో తాత్కాలికంగా కేంద్ర మధ్యవర్తిగా దామోదరం సంజీవయ్యను 1960 జనవరిలో రాష్ట్రానికి తీసుకువచ్చారు. కనుక సంజీవయ్య శాసన సభలో అధిక సంఖ్యాకుల బలంతో వచ్చిన వ్యక్తి కాదు. సహజంగా కుల, ముఠా రాజకీయాల మధ్య సతమతమయ్యారు. బలీయమైన రెడ్డి వర్గం [[ఎ.సి.సుబ్బారెడ్డి]] నాయకత్వాన ఎదురు తిరిగి సొంత పక్షం పెట్టుకున్నారు. 1962లో ఎన్నికలు జరిగి తిరిగి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చినపుడు సంజీవయ్య పోటీ చేద్దామనుకున్నారు కానీ ఢిల్లీ నాయకత్వం అందుకు అంగీకరించలేదు. ఎ.సి. సుబ్బారెడ్డి మరీ తలబిరుసుతనంతో కులం పేరు ఎత్తి సంజీవయ్యను ఎద్దేవ చేసాడు.1962లో ముఖ్యమంత్రిగా దిగిపోయిన సంజీవయ్య, గవర్నరుకు రాజీనామా సమర్పించిన మర్నాడే సికిందరాబాదులో తన భార్యను వెంటబెట్టుకుని అజంతా టాకీసులో సినిమాకని నడచి వెళ్ళారు. త్రోవలో ఎస్.వి.పంతులు కనిపిస్తే రా పంతులూ సినిమాకి పోదాం అని ఆయనను కూడా వెంటబెట్టుకు వెళ్ళారు. సంజీవయ్య వ్రాసిన ''లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్'' పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు.
 
[[1967]]లో ఎన్నికల ప్రచార సమయములో [[విజయవాడ]] నుండి హైదరాబాదుకు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదం నుంచి పూర్తిగా ఎన్నటికి కోలుకోలేకపోయాడు. [[1972]] [[మే 7]] వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతములో [[ఢిల్లీ]]లో గుండెపోటుతో మరణించాడు. ఆయన అంత్యక్రియలు [[మే 9]]వ తేదీన [[సికింద్రాబాదు]]లోని పాటిగడ్డలో అధికార లాంఛనాలతో జరిగినవి. ఆయన స్మారకార్ధం పాటిగడ్డ సమీపమున ఒక ఉద్యానవనమును పెంచి ఆయన పేరుమీదుగా ''సంజీవయ్య పార్కు'' అని పేరు పెట్టారు. 2008 లో విశాఖపట్నంలో స్థాపితమైన ఆంధ్ర ప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీకి ఆయన జ్ఞాపకార్థం 2012 లోదామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ అని పేరుమార్చారు.
"https://te.wikipedia.org/wiki/దామోదరం_సంజీవయ్య" నుండి వెలికితీశారు