నేషనల్ ఆర్ట్ థియేటర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== చరిత్ర ==
1952 నాటికి తెలుగు సినిమా పరిశ్రమలో ముఖ్యమైన నటునిగా ఎదుగుతున్న [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]] సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంబించారు. తాను చేద్దామనుకున్న ప్రయోగాత్మకమైన సినిమాలు ఇతర నిర్మాతల డబ్బుతో చేయడం సరికాదని, వీలుకాదని భావించి ఆయన నిర్మాణానికి పూనుకున్నారు. తమ బంధువైన దోనేపూడి కృష్ణమూర్తి ఆర్థికంగా దెబ్బతినడంతో ఆయనను నిర్మాణంలో భాగస్వామిగా తీసుకుని, తన తమ్ముడు [[నందమూరి త్రివిక్రమరావు]]ను మేనేజింగ్ పార్టనర్ గా పెట్టుకుని [[నేషనల్ ఆర్ట్స్]] పతాకంపై 1953లో తొలిచిత్రంగా [[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చి పుల్లయ్య]] సినిమా నిర్మించారు. సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా ఆర్థికంగా పరాజయం పాలైంది. నిర్మాణ సంస్థ పేరు [[నేషనల్ ఆర్ట్ థియేటర్]] గా మార్చి 1954లో [[డి.యోగానంద్]] దర్శకత్వంలో [[తోడుదొంగలు (1954 సినిమా)|తోడుదొంగలు]] సినిమాను నిర్మించారు. అది కూడా పరాజయం పాలైంది. దాంతో మూడవ ప్రయత్నంలో అప్పటికి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉన్న జానపద శైలిలో చిత్రాన్ని నిర్మించారు. [[డి.యోగానంద్]] దర్శకత్వంలోనే జానపద ఫక్కీలో తీసిన [[జయసింహ (సినిమా)|జయసింహ]] చిత్రం ఘన విజయాన్ని సాధించి ఎన్టీఆర్ కి నిర్మాతగా తొలి విజయాన్ని అందించింది. తర్వాత ఎన్.ఏ.టి. పతాకంపై పండరీపుర క్షేత్రమహాత్యం, [[తెనాలి రామకృష్ణుడు]] ప్రబంధానికి ఎంచుకున్న ఇతివృత్తం అయిన ప్రసిద్ధ పుండరీకుని కథను తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తీసిన [[పాండురంగ మహత్యం]] ఘనవిజయం సాధించడంతో పాటుగా క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. ఈ నిర్మాణ సంస్థలోనే ప్రయోగాత్మకంగా తన దర్శకత్వంలో [[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కళ్యాణం]] తీశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడి పాత్రను కాదని, రావణాసురుని పాత్ర పోషించారు. అదీ మంచి విజయం సాధించింది. ఎన్.టి.రామారావు పలు వేర్వేరు సినిమాలకు వేర్వేరు బానర్ల పేర్లు పెట్టి తీశారు. ఆయా పతకాలపై తెలుగు సినిమాల్లో ప్రఖ్యాతి పొందిన నాలుగు విభాగాలైన సాంఘిక, పౌరాణిక, చారిత్రిక, జానపద విభాగాల్లోనూ సినిమాలు తీశారు.<ref name="నిర్మాతగా ఎన్టీఆర్ కి వజ్రోత్సవం">{{cite web|title=NTR's production house completes 60 years|url=http://www.nandamurifans.com/main/ntrs-production-house-completes-60-years/|website=nandamurifans.com|accessdate=18 August 2015|quote="నిర్మాతగా ఎన్టీఆర్ కి వజ్రోత్సవం" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన}}</ref> ఆయా పతకాలపై తెలుగు సినిమాల్లో ప్రఖ్యాతి పొందిన నాలుగు విభాగాలైన సాంఘిక, పౌరాణిక, చారిత్రిక, జానపద విభాగాల్లోనూ సినిమాలు తీశారు. 1953 నుంచి 60 ఏళ్ళలో 2013 వరకూ ఎన్.ఏ.టి., దాని అనుబంధ సంస్థల ద్వారా 43 సినిమాలు నిర్మించారు. వాటిలో 10 పౌరాణిక చిత్రాలు, 7 చారిత్రిక చిత్రాలు ఉన్నాయి. 40 తెలుగు సినిమాలు, రెండు తమిళ చిత్రాలు, ఒక హిందీ చిత్రం ఎన్.ఏ.టి. సంస్థలు నిర్మించాయి.
 
==నిర్మించిన సినిమాలు==