గుండమ్మ కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
విజయా సంస్థ నిర్మించిన చిత్రలలో ఆఖరి విజయవంతమైన చిత్రం '''గుండమ్మ కథ'''. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కథ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిద్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి.
==ఇతివృత్తం==
గుండమ్మ ([[సూర్యకాంతం]]) భర్త చనిపోయిన ఇల్లాలు, ఆమెకు గయ్యాళిగా ఊళ్ళో పేరుంటుంది. ఆమె స్వంత కూతురు సరోజ([[జమున (నటి)|జమున]]), సవతి కూతురు జమున([[సావిత్రి (నటి)|సావిత్రి]]). ఇంటెడు చాకిరీ సవతి కూతురు మీద పడుతుంది. స్వంత కూతురు సరోజ మాత్రం ఏ పనిపాటలూ రాకుండా పెంకిగా తయారవుతుంది. సరోజకు గుండమ్మ పెళ్ళిచేయాలని భావించినప్పుడల్లా ఆమె తమ్ముడు గంటన్నగంటయ్య([[రమణారెడ్డి]]) ఆమె గయ్యాళి అనీ, ఆమె కూతురు బద్ధకస్తురాలనీ చెప్పి, చూపించి పెళ్ళి చెడగొడతూంటాడు. ఎలాగైనా హత్యచేసి జైల్లో ఉన్న తన కొడుకు ([[రాజనాల]])కి విడుదలయ్యాకా అతనికి ఇచ్చి చేయాలని, అలా చేయాలంటే గుండమ్మ ప్రయత్నాలన్నీ వ్యర్థం కావాలని అతని పథకం. పెళ్ళిళ్ళ పేరయ్య ద్వారా ఒక జమీందారు రామ భద్రయ్యరామభద్రయ్య ([[ఎస్.వి.రంగారావు]]) ఇద్దరు కొడుకులకు, గుండమ్మ ఇద్దరు కూతుళ్ళను ఇచ్చి పెళ్ళిచేయవచ్చునన్న సంబంధం వస్తుంది. రామభద్రయ్య ఆ ఊరు, తండ్రి పేరు వినగానే ఆయన చనిపోయిన తన స్నేహితుడేనని చెప్తాడు. దాంతో రామభద్రయ్య పెళ్ళి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చి అ యింటి పరిస్థితి అర్ధం చేసుకొంటాడు.
 
పెద్దకుమార్తె అన్ని విధాలా మంచి గృహిణి అయ్యేదే అయినా ఆమెకు మంచి సంబంధం చేయడం గుండమ్మకు ఇష్టం లేదు, ఏదోక అనాథ, పనివాడు లాంటి బాపతు వ్యక్తికి ఇచ్చిచేసి ఇద్దరినీ ఇంట్లో శాశ్వతంగా పనివాళ్ళను చేసుకోవాలని ఆలోచన. ఇక రెండవ కూతురు పెంకెతనం, బద్ధకం ఉన్నా అవన్నీ తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని పిల్ల మాత్రం మంచిదేనని రామభద్రయ్య నమ్మకం. కానీ ఆమెను కూడా ఎవరైనా ఇల్లరికం వచ్చేవారికి ఇచ్చి చేయాలని ఆశిస్తూంటుంది గుండమ్మ. ఇలా ఇద్దరూ తన కొడుకులకు సరిపోయే పెళ్ళికూతుళ్ళే అయినా గుండమ్మ, ఆమె దగ్గర చేరిన గంటన్నగంటయ్య ఈ పెళ్ళిళ్ళు పడనివ్వరన్న ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్ ([[ఎన్.టి.రామారావు]]), రాజా ([[అక్కినేని నాగేశ్వరరావు]])లను పిలిచి పరిస్థితులు వివరిస్తాడు.
 
వారి పథకం ప్రకారం పెద్దకొడుకు ఆంజనేయప్రసాద్ అంజిగా గంటన్నగంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరతాడు. పొగరున్నా మాంచి పనిమంతుడుగా గుండమ్మను ఆకట్టుకుంటాడు, గంటన్ననిగంటయ్యని దెబ్బకుదెబ్బ మాటకు మాటతో అదుపుచేస్తూంటాడు. మరోవైపు గుండమ్మ సవతి కూతురునికూతురు లక్ష్మిని సాటి పనివాడిగా, మంచి మనసున్నవాడిగా ఆకర్షిస్తాడు. గుండమ్మకు ఓ కూతురుతో పాటుగా కొడుకు([[హరనాథ్]]) కూడా ఉంటాడు. అతనూ, ఓ అమ్మాయి([[ఎల్.విజయలక్ష్మి]])తో ప్రేమించుకుంటూంటారు. ఆమెకు అన్నయ్యగా రామభద్రయ్య రెండో కొడుకు రాజా ప్రవేశించి, గుండమ్మ స్వంతకుమార్తె సరోజను ఆకట్టుకుంటాడు.
 
సరోజ మంకుపట్టు పట్టడంతో రాజా వివరాలు తెలుసుకుని అతను ఆస్తిపరుడేనని అంజి చెప్పగా గుండమ్మ పెళ్ళికి అంగీకరిస్తుంది. కానీ ఆమెకన్నా పెద్దదైన గుండమ్మ సవతి కూతురులక్ష్మి పెళ్ళి సంగతి ఏం చేయాలన్న ఆలోచన వస్తుంది. అదే సమయానికి అంజి తనకు పెళ్ళిచేయకపోతే పనిచేయనని మొండికేస్తాడు. గుండమ్మ సవతి కూతురులక్ష్మి పెళ్ళి విషయంలో సతమతం కావడం అదనుగా తీసుకుని, "నీకు ఇప్పుడు రెండు సమస్యలు, ఒకటి నా పెళ్ళి, మరోటి బుల్లెమ్మ పెళ్ళి. నాకో పెళ్ళికూతుర్ని తెచ్చి, బుల్లెమ్మకో పెళ్ళికొడుకుని తెచ్చి-తంటాలు ఏం పడతావు కానీ మా ఇద్దరికీ పెళ్ళి చేసెయ్" అని సలహాఇవ్వడంతో పనిచేస్తూండే అనాథ అన్న తనకు కావాల్సిన లక్షణాలు అంజిలో దొరకడంతో అంజికి తన సవతి కూతురిని ఇచ్చి పెళ్ళిచేసేస్తుంది. అలానే తన స్వంత కూతురిని రాజాకు ఇచ్చి చేస్తుంది.
 
కానీ రాజా దుర్వ్యసనాలకు బానిస అని, దొంగతనాలు చేస్తూంటాడని, అతను చెప్పినట్టు ఆస్తిపరుడూ కాడని కొత్త నాటకం మొదలుపెడతారు. దాంతో గుండమ్మ ఈ వేదన భరించలేకపోతుంది. ఇంతలో రాజా తప్పతాగి అల్లరిచేస్తూంటే అదుపుచేయబోగా సరోజ, గుండమ్మ తిట్టారని కోపగించినట్టు వంకపెట్టి అంజి భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. రాజా కూడా అలిగినట్టు నటించి తన భార్య సరోజను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అంజి సమస్య తీరిపోవడంతో నేరుగా తన బంగ్లాకే తీసుకుపోయి తానెవరో చెప్పేస్తాడు. కానీ భార్య బద్ధకస్తురాలు కావడంతో ఆమెని సరిజేసుకునేందుకు రాజా మాత్రం తమ తోటలోనే ఓ పనివాడిగా తోటలోని ఇంట్లో ఉంటాడు.
పంక్తి 39:
మరోవైపు గుండమ్మ కొడుకు తాను ఇష్టపడ్డ అమ్మాయిని గుండమ్మ ఇష్టానికి విలువనివ్వకుండా ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. గుండమ్మ కోడలి కుటుంబసభ్యులు అంతటి గయ్యాళికి కోడలుగా వెళ్తోంది ఎలా నెట్టుకువస్తుందోనని బాధపడుతుంటే వారి దూరపుబంధువు, కొత్త పెళ్ళికూతురికి అత్త వరస అయ్యే దుర్గమ్మ ([[ఛాయాదేవి (తెలుగు నటి)|ఛాయాదేవి]]) తాను వెళ్ళి గుండమ్మ అంతు తేలుస్తానంటుంది. దుర్గమ్మ వచ్చి గుండమ్మ ఇల్లు దోచేస్తూ, గుండమ్మ మీదే దొంగతనం నేరం వేసి ఆమె కొడుకు, కోడలు ముందు దొంగని చేస్తుంది. గంటయ్య కొడుకు జైలు నుంచి విడుదలై వచ్చి దుర్గమ్మ దొంగసొమ్ములో వాటా కోసం, గుండమ్మపైన ఆమె ఇంట్లోనే రౌడీయిజం చేస్తాడు.
 
ఇంతలో తన సవతి కూతురులక్ష్మి భర్త అంజితో వచ్చి, తాము నిజానికి శ్రీమంతులమని చెప్పడంతో గుండమ్మ సంతోషిస్తుంది. ఇప్పుడు స్వంత ఇంట్లోనే అనాథలా బ్రతుకుతున్నాని చెప్పగా అంజి ఆమె సమస్య తీరుస్తానంటాడు. అతని భార్య దుర్గమ్మతో తలపడి ఆమె నుంచి గుండమ్మ నగలు, డబ్బు లాక్కుని గుండమ్మకే ఇస్తుంది. ఇంతలో ఆమెకు మద్దతుగా ఉన్న రౌడీ రాగా అంజి అతనితో ఫైట్ చేసి ఓడిస్తాడు. మొత్తానికి వారిద్దరూ గుండమ్మ ఇంట్లో సమస్యగా తయారైన గంటయ్య కొడుకుని, దుర్గమ్మనీ తరిమేస్తారు.
 
మరోవైపు కష్టం విలువ తెలిసిన మనిషిగా, అభిమానవతిగా తయారైన సరోజను ఆమె భర్త గారెలు వండిపెట్టమని కోరి, అందుకు అవసరమైనంత జీతాన్ని యజమాని నుంచి తీసుకునేందుకు పంపుతాడు. యజమానిగా తనను ఒకసారి తన కొడుక్కి చూసుకోవడానికి వచ్చిన రామభద్రయ్యే ఉండడంతో ఇబ్బందిపడుతుంది, అతను డబ్బు ఇవ్వక తనను తన భర్తను అవమానిస్తుంటే తక్షణం అక్కడ ఉండనని బయలుదేరుతుంది. ఇంతలో తన అక్క, ఆమె భర్త అంజి అక్కడ కారులో కనిపించి జరిగినదంతా చెప్తారు.మఆ యజమాని రామభద్రయ్యే తమ మావయ్య అని తెలుస్తుంది. గుండమ్మ కూడా వారింటికి రావడం, అందరిలో ఇల్లరికానికి విరుగుడుగా అల్లుడరికాన్ని తీసుకువస్తానని అంజి చమత్కరించడంతో కథ ముగుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/గుండమ్మ_కథ" నుండి వెలికితీశారు