గుండమ్మ కథ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 25:
విజయా సంస్థ నిర్మించిన చిత్రలలో ఆఖరి విజయవంతమైన చిత్రం '''గుండమ్మ కథ'''. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్, కాని "గుండమ్మ కథ" అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిద్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి.
==ఇతివృత్తం==
గుండమ్మ ([[సూర్యకాంతం]]) భర్త చనిపోయిన ఇల్లాలు, ఆమెకు గయ్యాళిగా ఊళ్ళో పేరుంటుంది. ఆమె స్వంత కూతురు సరోజ([[జమున (నటి)|జమున]]), సవతి కూతురు జమున([[సావిత్రి (నటి)|సావిత్రి]]). ఇంటెడు చాకిరీ సవతి కూతురు మీద పడుతుంది. స్వంత కూతురు సరోజ మాత్రం ఏ పనిపాటలూ రాకుండా పెంకిగా తయారవుతుంది. సరోజకు గుండమ్మ పెళ్ళిచేయాలని భావించినప్పుడల్లా ఆమె తమ్ముడు
పెద్దకుమార్తె అన్ని విధాలా మంచి గృహిణి అయ్యేదే అయినా ఆమెకు మంచి సంబంధం చేయడం గుండమ్మకు ఇష్టం లేదు, ఏదోక అనాథ, పనివాడు లాంటి బాపతు వ్యక్తికి ఇచ్చిచేసి ఇద్దరినీ ఇంట్లో శాశ్వతంగా పనివాళ్ళను చేసుకోవాలని ఆలోచన. ఇక రెండవ కూతురు పెంకెతనం, బద్ధకం ఉన్నా అవన్నీ తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని పిల్ల మాత్రం మంచిదేనని రామభద్రయ్య నమ్మకం. కానీ ఆమెను కూడా ఎవరైనా ఇల్లరికం వచ్చేవారికి ఇచ్చి చేయాలని ఆశిస్తూంటుంది గుండమ్మ. ఇలా ఇద్దరూ తన కొడుకులకు సరిపోయే పెళ్ళికూతుళ్ళే అయినా గుండమ్మ, ఆమె దగ్గర చేరిన
వారి పథకం ప్రకారం పెద్దకొడుకు ఆంజనేయప్రసాద్ అంజిగా
సరోజ మంకుపట్టు పట్టడంతో రాజా వివరాలు తెలుసుకుని అతను ఆస్తిపరుడేనని అంజి చెప్పగా గుండమ్మ పెళ్ళికి అంగీకరిస్తుంది. కానీ ఆమెకన్నా పెద్దదైన గుండమ్మ
కానీ రాజా దుర్వ్యసనాలకు బానిస అని, దొంగతనాలు చేస్తూంటాడని, అతను చెప్పినట్టు ఆస్తిపరుడూ కాడని కొత్త నాటకం మొదలుపెడతారు. దాంతో గుండమ్మ ఈ వేదన భరించలేకపోతుంది. ఇంతలో రాజా తప్పతాగి అల్లరిచేస్తూంటే అదుపుచేయబోగా సరోజ, గుండమ్మ తిట్టారని కోపగించినట్టు వంకపెట్టి అంజి భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. రాజా కూడా అలిగినట్టు నటించి తన భార్య సరోజను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అంజి సమస్య తీరిపోవడంతో నేరుగా తన బంగ్లాకే తీసుకుపోయి తానెవరో చెప్పేస్తాడు. కానీ భార్య బద్ధకస్తురాలు కావడంతో ఆమెని సరిజేసుకునేందుకు రాజా మాత్రం తమ తోటలోనే ఓ పనివాడిగా తోటలోని ఇంట్లో ఉంటాడు.
పంక్తి 39:
మరోవైపు గుండమ్మ కొడుకు తాను ఇష్టపడ్డ అమ్మాయిని గుండమ్మ ఇష్టానికి విలువనివ్వకుండా ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. గుండమ్మ కోడలి కుటుంబసభ్యులు అంతటి గయ్యాళికి కోడలుగా వెళ్తోంది ఎలా నెట్టుకువస్తుందోనని బాధపడుతుంటే వారి దూరపుబంధువు, కొత్త పెళ్ళికూతురికి అత్త వరస అయ్యే దుర్గమ్మ ([[ఛాయాదేవి (తెలుగు నటి)|ఛాయాదేవి]]) తాను వెళ్ళి గుండమ్మ అంతు తేలుస్తానంటుంది. దుర్గమ్మ వచ్చి గుండమ్మ ఇల్లు దోచేస్తూ, గుండమ్మ మీదే దొంగతనం నేరం వేసి ఆమె కొడుకు, కోడలు ముందు దొంగని చేస్తుంది. గంటయ్య కొడుకు జైలు నుంచి విడుదలై వచ్చి దుర్గమ్మ దొంగసొమ్ములో వాటా కోసం, గుండమ్మపైన ఆమె ఇంట్లోనే రౌడీయిజం చేస్తాడు.
ఇంతలో
మరోవైపు కష్టం విలువ తెలిసిన మనిషిగా, అభిమానవతిగా తయారైన సరోజను ఆమె భర్త గారెలు వండిపెట్టమని కోరి, అందుకు అవసరమైనంత జీతాన్ని యజమాని నుంచి తీసుకునేందుకు పంపుతాడు. యజమానిగా తనను ఒకసారి తన కొడుక్కి చూసుకోవడానికి వచ్చిన రామభద్రయ్యే ఉండడంతో ఇబ్బందిపడుతుంది, అతను డబ్బు ఇవ్వక తనను తన భర్తను అవమానిస్తుంటే తక్షణం అక్కడ ఉండనని బయలుదేరుతుంది. ఇంతలో తన అక్క, ఆమె భర్త అంజి అక్కడ కారులో కనిపించి జరిగినదంతా చెప్తారు.మఆ యజమాని రామభద్రయ్యే తమ మావయ్య అని తెలుస్తుంది. గుండమ్మ కూడా వారింటికి రావడం, అందరిలో ఇల్లరికానికి విరుగుడుగా అల్లుడరికాన్ని తీసుకువస్తానని అంజి చమత్కరించడంతో కథ ముగుస్తుంది.
|