జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉప్ధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ పత్రి మార్కండేయశర్మ, భక్తిగీతాలు, అభ్యుదయ గేయాలు, పాటలు వ్రాయడంతోపాటు, వాటిని పాడటంలోనూ మంచిపేరు పొందినారు. పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్య రక్షణకు సమాజంలోమార్పు తీసికొని వచ్చేటందుకు, తన వంతు ప్రయత్నంగా ఈయన కృషిచేయుచున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేయుచూనే ప్రవృత్తిరీత్యా ఎన్నో కార్యక్రమాలలో కవితా గానం చేయుచూ సమాజాన్ని మేలుకొలుపుచున్నారు. వీరు హిందీ భాషలొ గూడా ప్రావీణ్యం సంపదించి బహుముఖ ప్రతిభాశాలిగా పేరుతెచ్చుకున్నారు. [3]