రాచమల్లు రామచంద్రారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{విస్తరణ}} రారా గా ప్రసిద్ధుడైన రాచమల్లు రామచంద్రారెడ్డి (Rachamallu Ra...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
రారా గా ప్రసిద్ధుడైన రాచమల్లు రామచంద్రారెడ్డి (Rachamallu Ramachandra Reddy) బహుముఖప్రజ్ఞాశాలి. ఆయన తెలుగు సాహిత్యానికి తన విమర్శతో, అనువాదాలతో, పాత్రికేయ రచనలతో ఎంతో దోహదం చేశాడు. ఆయన రాసిన [[అనువాద సమస్యలు]] అనే గ్రంథానికి [[కేంద్ర సాహిత్య అకాడెమీ]] పురస్కారం లభించింది. ఆయన రాసిన మరో ప్రసిద్ధ గ్రంథం 'సారస్వత వివేచన'. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది. [[మాస్కో]]లో [[ప్రగతి ప్రచురణాలయం]]లో తెలుగు అనువాదకునిగా ఆరేళ్ళు పనిచేసి ఎన్నో విలువైన గ్రంథాలను అనువదించినాడు. [[కడప]] నుంచి [[1968]] - [[1970]] ల మధ్య వెలువడిన '[[సంవేదన]]' త్రైమాసిక పత్రిక సంపాదకుడిగా తెలుగు సాహిత్య విమర్శకు ఒరవడి దిద్దాడు. [[1959 - 1963]] మధ్యకాలంలో కడప నుంచే 'సవ్యసాచి' అనే రాజకీయ పక్ష పత్రిక కూడా నడిపాడు. [[చలం]], [[శ్రీశ్రీ]], [[కొడవటిగంటి కుటుంబరావు]] (కొ.కు.), [[మహీధర రామమోహనరావు]] లాంటి రచయితలపై ఆయన చేసిన మూల్యాంకనం లోతైనది. ఆయన వాదోపవాదాల్లో దిట్ట. ఆయన్ను శ్రీశ్రీ 'క్రూరుడైన విమర్శకుడు' అన్నా నిజజీవితంలో రారా చాలా స్నేహశీలి. [[1959 - 1963]] మధ్యకాలంలో కడప నుంచే 'సవ్యసాచి' అనే రాజకీయ పక్ష పత్రిక కూడా నడిపాడు. ఈయన రాసిన మరో ప్రసిద్ధ గ్రంథం 'సారస్వత వివేచన'. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది.
 
==జీవిత విశేషాలు==