నాళేశ్వరం శంకరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నాళేశ్వరం శంకరం''' తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రముఖకవి. ఇతని చిన్నతనం ఎడ్లు కాయడంలోనూ, గేదెలకకు పచ్చిగడ్డి కోసుకురావడంలోనూ, పిడకలు తయారు చేయడంలోనూ ముగిసిపోయింది. తల్లి బీడీ కార్మికురాలు. బిక్షాటన వంశంలో పుట్టిన వాడు కావటం చేత బిక్షాటన అనే జీవనోపాధిని వదిలేయకుండా చదువుకోవాలనే తండ్రి నిర్బంధఆజ్ఞను పాటిస్తూ ఏడు మైళ్ల దూరంలో వున్న వూరుకు, చదువు కోసం వెళ్లి నాల్గవ తరగతి నుండి ఏడవ తరగతి దాకా చదువుకుకున్నాడు. ఆ సమయంలో తెలంగాణా ఉద్యమం రావడంతో చదువు కుంటుపడింది. తరువాత పక్కవూరికి వెళ్ళి మెట్రిక్ చేరాడు. ఆ సమయంలో సుభద్రాదేవితో పరిచయమై కులాంతరవివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించటంతో ఇంటికి దూరమై కష్టంతో డిగ్రీ వరకు చదివాడు. తర్వాత ఒక ఆఫీసులో రోజువారీ వేతనంపై కొన్నిరోజులు పనిచేశాడు. ఆ ఆఫీసులో పనిచేస్తున్న కె.వివేకానందరెడ్డి అనే ఇంజనీరు ప్రోత్సాహంలో ఎం.ఎ. చదివాడు<ref>[http://telugu.oneindia.com/sahiti/essay/2006/naleswaram-on-his-poetry-background.html| కవితాత్మ కథ - నాళేశ్వరం శంకరం]</ref>.
 
 
"https://te.wikipedia.org/wiki/నాళేశ్వరం_శంకరం" నుండి వెలికితీశారు