ఆంధ్ర మహాసభ (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
 
 
;[[నాల్గవ ఆంద్రమహాసభ]]:
 
నాల్గవ ఆంధ్రమహాసభ 1935 డిసెంబర్ [[సిరిసిల్ల]]లో జరిగింది.దీనికి [[మాడపాటి హనుమంతురావు]] గారు ఆద్యక్షులు.వివిధ విషయాలు పై అనేక తిర్మానాలు ఆమొదించాల్సిన మహాసభ గతానుగతం గానే నడిచింది.ఆంధ్రోద్యమానికి వ్యవస్తాపకులు ఆయిన మాడపాటి హనుమంతురావు గారు మహాసభకు, ఆయన సతిమణి మాణిక్యమ్మ మహిళ మహాసభకు ఆద్యక్షత వహించటం ఈ మహాసభ ప్రత్యేకత.మహారాష్టృ నాయకుల ప్రాధాన్యంతో ప్రారంభం ఆయిన ఆంధ్రమహాసభ దేవరకొండ నాటికే అందరు తెలుగు లోనె మాట్లడటం మెదలు పెట్టెరు.ఆరోగ్యకరంగా సాగుతున్న ఈ పరిణామాలు సిరిసిల్ల మహాసభలో ఉగ్రరూపం దాల్చాయి.ఆంధ్రమహాసభ వ్యవహరాలన్ని తెలుగు లోనె జరగాలని ,తీర్మనాలు,ప్రసంగాలు అన్ని తెలుగులోనె ఉండాలని భాషవాదులు మహసభ నిభందనావలిలో పెట్టెరు.నిజాం సంస్ధానంలో తెలుగు బాషకు,సంస్ర్కతికి జరుగుతున్న ఆన్యాయాన్ని ఎదుర్కోనడం కోసం ఉద్రిక్తులైన కొందరు యువకులు ఆలాంటి క్లాసును చేర్పించారు.అందుకని వారి సదుద్దేశాన్ని ఎవరూ శంకించవలసిన పనిలేదు.రావి నారాయణ రెడ్డి గారు ఈ క్లాసును సమర్దదించలేదు.
 
;[[ఐదవ ఆంద్రమహాసభ]]:
 
[[షాదునగరులో]] 1936 లో జరిగిన అయిదవ ఆంధ్రమహాసభకు [[కొండా వెంకట రంగారెడ్డి]] గారు ఆద్యక్షత వహించారు.ఈ మహాసభలో చేసిన తీర్మానాల్లో చెప్పుకోధగ్గ విశేషాలేమి లెవు.కాని అన్ని సభలకు వచ్చినట్లే ఈ సభకు కూడ కర్ణటక,మహారాష్ట నాయకులు వచ్చి మహాసభ వేదిక నలంకరించారు.ఆయితే నాల్గవ మహాసభలో భాషావాదులు ప్రవేశపెట్టిన క్లాసు మూలంగా వారు నోరు మెదపటానికి కూడ వీలులేకపోయింది.కోసకు వారి సందేశాన్ని కూడ ఇవ్వకుండా తిరిగి వేళ్ళవలిసి వచ్చింది.
 
[[ఆరవ ఆంద్రమహాసభ]]
 
ఆరవ ఆంధ్రమహాసభ 1937 లో నిజామాబాదులో జరిగింది.దీనికి మందముల నరసింగరావు గారు ఆద్యక్షత వహించారు. భాషావాదులు ప్రవేశపెట్టిన క్లాసు వలన దుష్పలితాలు ఈ మహాసభలో మరీ స్పష్టంగా బయట పడ్డయి అని రావి నారాయణరెడ్డి గారు చెప్పెరు.మహారాష్తృ నాయకుడైన కాశీనాధరావు ముఖ్ పాల్ కర్,మొల్విగులాంభషానీ వీరిద్దరూ ఆహ్యన సంఘం సభ్యులు.మహాసభ నియమావళి మేరకు వీరిద్దరూ కూడ విషయ నిర్ణయ సభకు ఎన్నికైనారు.ఈ సభలో వీరు ఆంధ్రేతర భాషలో మాట్లాడ్డానికి ప్రయత్నించారు.అందుకు బాషావాదులు క్లాసు అడ్డంవచ్చింది.నియమావళిలోని 31వ క్లాజు ప్రాకారం ఆంధ్రేతర భాషలో ఎవరూ ప్రసంగించడానికి వీల్లేదని నందగిరి వెంకటరావుగారి నాయకత్వాన భాషవాదులు అభ్యంతరం లేవదీశారు.దీనిపైన విషయ నిర్ణయ సభలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి .చివరికి రావి నారయణరెడ్డి గారి జోక్యంతో వారికి మాట్లాడే ఆవకాశం లభించింది. రాజికియ హక్కులు ఏ కోశానాలేని ఆ రోజుల్లొ మహసభ నాయకులు తమకు రాజకీయాలతో సంబందంలేదని చెప్పుకున్నా అప్పటికున్న చట్టాలకు లోబడి అతికష్టం మీద సభను నిర్వహిస్తూ వున్నా ఆసలు ఆంధ్రోద్యయం పుట్టుకలోనే గల రాజికీయ ప్రాముఖ్యాన్ని విస్మరించారాదు.ఆనాడు రాష్ట్రం నలుచెరుగులా ఆంధకారం వ్యాపించి వుంది.ఆలాంటి రోజుల్లో ఆంధ్రోద్యమం ఒక చిన్న దీపంలాగా వెలిగేది.ప్రజలకు మార్గం చూపించేది.
 
 
 
 
[[ఏడవ ఆంద్రమహాసభ]]
 
సప్తమాంధ్ర మహాసభ హైదరాభాద్ జిల్లా మల్కాపురంలో 1940 లో జరిగింది.దీనికి మందముల రామచంద్రరావుగారు ఆద్యక్షత వహించారు.1938 నుంచి స్టేట్ కాంగ్రెసు సత్యాగ్రహొద్యమం ఆరంభం ఆయింది.ఆంధ్ర మహాసభ కార్యకర్తలైన యువకులు ఈ సత్యగ్రహొద్యమంలొ పాల్గొన్నారు.అందువల్ల ఈ మహాసభ జరగటంలో కాలవిలంబన జరిగింది.ఈ మద్యకాలంలో ఆయ్యంగార్ కమిటీ ప్రభుత్వానికి తన నివెదిక సమర్పించింది.ఈ ఏడవ మహాసభలో చర్చకు వచ్చిన ప్రదాన తీర్మానం రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించినది.మహాసభలో ఈ తీర్మానంమీద జరిగిన చర్చలను గురించి శ్రీ మాడపాటి హనుమంతరావుగారు తమ "ఆంధ్రోద్యమం" అన్న గ్రంధంలో రాసినదాన్ని క్రింద ఉదహరిస్తున్నాను. "19 జూలై 1939 నాడు ప్రభుత్వంవారి వలన ప్రకటింపబడిన రాజ్యాంగ సంస్కరణములు తీవ్రముగా విమర్శించి ఖండింపబడుటయెగాక అట్టి నిరుపయెగములును,ఆభివ్రద్ది నిరోధకములునగు సంస్కరణములను బహిష్కరింపవలయునను తీర్మానము ప్రతిపాదింపబడెను.దీనిలోని 'బహిష్కరించవలయును' అను భాగమును తోలగించవలయునని మితవాద నాయకులు ప్రవేశ పెట్టిరి.ఉభయ పక్షముల వాదములు సయుక్తికముగా జరిపిన మీదట తీర్మానమును ఓటుకు పెట్టగా సవరణ వీగిపోయి తీర్మానము అత్యంత బహుళ సంఖ్యామోదము పోంది అంగీకరింపబడెను"."ఇట్టి ముఖ్యమగు తీర్మానమునకు అనుకూలముగ ప్రసంగించిన వారి యెక్కయు దీనికి సవరణ యవసరమని ప్రసంగించిన వారి