కృష్ణా పత్రిక: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్వాతంత్ర → స్వాతంత్ర్య (4) using AWB
పంక్తి 19:
}}
 
'''కృష్ణా పత్రిక''' [[బందరు]] కేంద్రంగా వెలువడిన ఒక ప్రసిద్ధ వారపత్రిక దీనిని ప్రసిద్ధ స్వాతంత్రస్వాతంత్ర్య సమరయోదులు [[కొండా వెంకటప్పయ్య]]గారు నడిపించారు. ఈ పత్రిక విశాలాంధ్రకు మద్ధతుగ పనిచేసింది. ప్రత్యేక ఆంధ్రప్రాంతం కావాలని వ్యాసాలు రాసేవారు. వెంకటప్పయ్య గారి తరువాత కృష్ణా పత్రికను శ్రీ [[ముట్నూరి కృష్ణారావు]] గారు నడిపారు. ఈ పత్రిక సాహిత్యము, రాజకీయాలు, వేదాంతము, హాస్యము, సినిమా, రంగస్థల కార్యక్రమాల సమీక్షలు, స్థానిక వార్తలు అన్నిటితొ నిండి సర్వాంగ సుందరంగా వెలువడేది. శ్రీ ముట్నూరివారు తమ అమూల్యమైన రచనలతో కృష్ణాపత్రికకు అపారమైన విలువను సంపాదించి పెట్టాయి. ప్రముఖ పాత్రికేయుడు [[పిరాట్ల వెంకటేశ్వర్లు]] దీనిని దినపత్రికగా పునరుద్ధరించారు.
 
==చరిత్ర==
కృష్ణా పత్రిక 1899వ సంవత్సరంలో క్రిష్ణా జిల్లా సంఘం చే జారీ చేయబడిన తీర్మానమునకు అనుగుణంగా 1902 సంవత్సరం ఫిబ్రవరి 2 న ప్రారంభమైంది. రాజకీయంగా ప్రజలను చైతన్యవంతులను చేయుటకు ప్రారంభించబడిన తొలి వార్తాపత్రికగా మొదటి సంచికలో పేర్కొన్నారు. ప్రారంభంలో ఉపసంపాదకుడిగా చేరిన ముట్నూరు కృష్ణారావు 1907లో సంపాదకబాధ్యతను చేపట్టి 1945 లో తను మరణించేవరకు ఆ పదవిలో కొనసాగారు. వ్యక్తిగా కాక ఈ పత్రిక తాలూకు శక్తిగా పేరుపొందారు.ఈ పత్రిక పక్షపత్రికగా ప్రారంభమై ఆతరువాత వార పత్రికగా వెలువడింది.భారత స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. పట్టణాలకే పరిమితమవకుండా గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలకు ఉచితంగా పంచబడి విద్యార్థుల ద్వారా గ్రామీణులందరని చైతన్య పరచింది.ఎన్.జి.రంగా, బెజవాడ గోపాలరెడ్డి, గొట్టిపాటి బ్రహ్మయ్య, తెన్నేటి విశ్వనాధం తమ చదువులకు స్వస్తి చెప్పి స్వాతంత్రోద్యమంలో చేరటానికి ఈపత్రిక మరియు [[ఆంధ్ర పత్రిక]]ల ప్రభావం వుందని తెలిపారు. బ్రిటీషు ప్రభుత్వం తమ నివేదికలలో ఈ రెండు పత్రికల ప్రభావాన్ని గుర్తించాయి. 1929లో ఈ పత్రికలకు గుర్తింపుగా విజయవాడలో సెప్టెంబరు 9 న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఎన్.వి.ఎల్ నరసింహారావు అధ్యక్షతన సన్మానం చేశారు. అదే సమయంలో ఆంధ్రజనసంఘ హైదరాబాదులో గుర్తింపుగా తీర్మానం చేసింది. ఆర్థిక ఇబ్బందులకు గురైనా దాతల విరాళాలతో నడిచింది<ref>{{Cite web|title=About us| |url=http://krishnapatrika.com/about-us.html|publisher=[[కృష్ణాపత్రిక]]|date= |accessdate=2014-03-16}} </ref>.
 
ప్రముఖ పాత్రికేయుడు [[పిరాట్ల వెంకటేశ్వర్లు]] దీనిని దినపత్రికగా పునరుద్ధరించారు. దీనిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రినల్లారి కిరణకుమార్ రెడ్డి సోదరుడు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి<ref>{{Cite web|title=మీడియా, యాత్రలు: కిరణ్ చేతికి కృష్ణాపత్రిక| |url=http://telugu.oneindia.in/feature/politics/2013/kiran-kumar-reddy-acquires-media-114434.html|publisher=[[వన్ ఇండియా]]|date= 2013-03-30|accessdate=2014-03-16}} </ref>.
 
==ఇతర విశేషాలు==
పంక్తి 40:
==ఉపయుక్త గ్రంథ సూచి==
*[http://archive.org/details/KrishnaPatrikaSahityaSevaOkaParisheelana కృష్ణాపత్రిక సాహిత్య సేవ ఒక పరిశీలన-సాదనాల వెంకట కృష్ణస్వామి నాయుడు]
 
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/కృష్ణా_పత్రిక" నుండి వెలికితీశారు