నాట్య శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) ఆక్షర దోష నివారణ |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: గ్రంధం → గ్రంథం (4) using AWB |
||
పంక్తి 1:
[[Image:52kuncitam c.jpg|right|thumb|నాట్య శాస్త్రములో ఉదహరింపబడిన భంగిమ]]
[[ఈశ్వరుడు]] ఆదిప్రవక్త. నందికేశ్వరుడు ఈశ్వరుని సన్నిధిలో నాట్యమును గ్రహించాడు. ఆతడే శివుని ఆజ్ఞాపై బ్రహ్మకుపదేసించాడు. అటుపై బ్రహ్మ నాట్యమును ఉదయహరించాడు. భరతుడు దానిని గ్రహించి నాట్యశాస్త్రం రచించాడు. దానికే నాట్యవేదం అని పేరు. శాండిల్య వాత్సల్య కోహాదులు భరత శిష్యులు, వారు నాట్య విద్యను ప్రచారం చేసారు. లోక సంగ్రహాన్ని ఆపేక్షించిన మనువు [[సూర్యుడు]] ని లోకసముద్ధరణోపాయమును చెప్పమని అడిగాడు. సూర్యుడు చెప్పిన ఉపాయములను బట్టి భరతుని దగ్గర మనువు నాట్యవిద్య తెలుసుకున్నాడు. దీనినే కొందరు వాగ్దేవీ సాంప్రదాయమని అందురు.
== ప్రమాణము ==
నాట్యవిద్యను అనుసరించి వెలువడిన అఖిల గ్రంధాలకూ ఇది ప్రమాణము.
== వ్యాఖ్యాతలు ==
పంక్తి 11:
== గ్రంధవిషయము ==
నాట్యశాస్త్రంలో విషయము చాలా ఉదాత్తంగా ఉంటుంది. మొదటి 7 ఆధ్యాయములు సర్వ సాధారణమైన లోక సంబధిత విషయములు, వీటిని బాగా అవగతం చేసుకుంటేగాని నాట్య పరమార్ధము తెలుసుకోవటానికి అవకాశం కలగదు. వీటిలో పలు విషయములు చర్చింపబడినవి, నాట్యము ఏవిధముగా ఉత్పన్నమైనది? అసలెందులకు కావలసి వచ్చినది? దాని సంప్రదాయం ఏమిటి? అభినయించేవాళ్ళ పరంపర ఎటువంటిది? ఎందుకొరకై నాట్య మవతరింపబడినది? నాట్యమేయే ఫలాలను సంపాదించును?ఏయే చిహ్నాలు ఏయే అమ్శాలను బోధిస్తాయి? నాట్య మంటపము ఏవిధంగా నిర్మించాలి? దాని విధానాం ఏమిటి? రంగ మంటపాలను ఎన్నివిధాల ఏర్పాటు చెయ్యొచ్చు? త్రివిధ నాట్య శాలల స్వరూపం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలకు సంబధించిన విషయములు చర్చిపబడినవి. ఇంకా తాండవము, తద్భేధాలు, స్వరూపము, అభినయించే విధానము, వాని రసభావవినియోగము, పూర్వరంగవిధి, సూత్రధారకర్తవ్యము, నటుల సముదాచారము, రసములు, లక్షణములు, స్వరూపస్వభావాలు, ఇంకా అనెక విషయములు మొదటి అధ్యాయ సప్తకంలో నిరూపించబడినవి. 8 నుండి 14 అధ్యాయములలో అభినయ విశేషాలు విపురంగా నిరూపించబడినవి. ఏభావాన్ని అభినయించడానికి ఏ అవయమును యేమేమి ఎట్లెట్లా చేయాలో ఈ అధ్యాయాలలో తెలుస్తున్నది. ఉపాంగ విధానాలు, హస్తాభినయము, శరీరాభినయము, చారీమందుల విధానాలు, గతిప్రచారము, ప్రవృత్తిధర్మాలు, ఈ ప్రకరణంలో చాలా స్పష్టంగా తెలుపును. ఈ విషయములు నటులు సామాన్యులు తెలుసుకొనినచో నాట్యమును చక్కగా ఆశ్వానించగలుగుదురు.
15, 16 అధ్యాయాలలో ఛందస్సు ఉన్నది. 17,18,20,21 అధ్యాయాలు కావ్యవిద్యకు సంబధించిన విషయప్రతిపాదనంతో నిండివున్నది. 19వ అధ్యాయంలో [[కాకుస్వరాలు]] నిరూపించబడినవి. రంగస్థలంలో మాట్లాడేటప్పుడు ఎవరేవిధంగా మాట్లాడాలి? వారి స్వరం ఏవిధంగా ఉండాలి? ఈ విషయాలన్నింటినీ ఈ అధ్యాయంలో బాగా చర్చింపబడినది. మాళ్ళా 22 నుండి 27 వ అధ్యాయములలో జగద్విలాసం అంతా కనబడుతుంది. భారత్యాదివృత్తులు, వాని అవాంతరప్రభేధాలు, అహార్యాభినయము, వాని రసభవానుకూల పరిస్థితులు, దివ్యమర్త్య భేధాల అనుసరించిన వేషధారణము, సామాన్యాభినయము, నాట్యాలంకారాలు, స్త్రీలకభినయంలో విధివిశేషాలు, బాహ్యోపచారము, వైశికవిధులు, చిత్రాభినయము, సిద్ధవ్యంజనములు, ఇటువంటి నానా విషయములు ఈ అధ్యాయములో చర్చింపబడినవి. ఈ అధ్యాయంలోనే ప్రసంగవశాన [[కామశాస్త్రం]] కొంత చర్చింపబడినది. స్త్రీల స్వభావాలు, పురుషుల ప్రవృత్తులు, విస్రంభణోపాయాలు, కామోపచారవైధగద్యవిధులు, చాలా విషయములు తెలుపబడినవి. 28 నుండి 33 అధ్యాయాలు వాద్యవిధులను చెప్పుచున్నవి. 30 వ అధ్యాయములో వంశీ వాదనం చెప్పబడినది.
34, 35,36 అధ్యాయాలను చూడకుండా తెలియకుండా విడువరాదు. ప్రకృతివిచారము, భూమికాపాత్రవికల్పము, నాట్యావతారము అన్నీ వీటిలో ఉన్నవి.
== ముఖ్య విషయము ==
నాట్యానికి అనేక ప్రయోజనాలున్నవి. అవ్వంతరప్రయోజనాలెన్ని ఉన్నప్పటికీ మహారసమే నాట్యముఖ్యప్రయోజనం. మనోరసానికి అనుకూలమైన ప్రవనత ఎక్కడ సంపాదించగలిగితే అక్కడే ఆస్వాదం కలుగుతుంది. మనోవృత్తిలో విజృంభించితే స్పందశక్తులను నిరోధించి సమానావస్థను సంపాదించినతరువాతనే సాధకుడు ఆస్వాదభూమికను అందుకోగలుగుతాడు. నాట్యం వలన చక్షురాదీంద్రియాలు ఏయే విధంగా ఉన్నప్పటికీ భవనా చక్షువు, భవనా శ్రోత్రము, భవనేంద్రియము స్వస్వవ్యాపారంలో బగా మగ్నత పొంది ఉంటవి.అందువలన మనో భూమికూడా భావనకు మహాసాగరం అవుతుంది. దీని వలన ప్రపంచభేదం సులభము. దీని వలన ఆత్మ ప్రకాశము చెందును. ఈ మహాప్రకాశావస్థనే మహారసమంటారు. ఇటువంటి మహారస సంపత్తిని నాట్యం అందజేయగలుగుతుందని ఈ శాస్త్రము తెలుపుచున్నది. ఈమహారస సంపదే ఆత్మసంవేదనము. ఆత్మసంవేదనము నాట్యం చూచే ప్రతీవానికి కలుగదు. విశిష్టమైన అర్హత ఇక్కడకూడా అవసరము. అవాంతరంగా అర్హతాసంపత్తిని కూడా నాట్యమే సంపాదించుతుంది. ధార్మిక శిక్ష నివ్వటానికి మునులు నాట్యమును అవతరింపజేసారని ఆనందవర్ధనుడు చెప్పినాడు.
==మూలాలు==
|