కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  8 సంవత్సరాల క్రితం
చి
→‎ముఖ్యమైన మందిరాలు: clean up, replaced: తీర్ధం → తీర్థం (9) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ముఖ్యమైన మందిరాలు: clean up, replaced: తీర్ధం → తీర్థం (9) using AWB
పంక్తి 72:
అర్జునుడు బాణప్రయోగంతో ఏర్పాటు చేసింది. దయాల్ పూర్ వద్ద ఉన్న రెండవది యుద్ధభూమిలో ఆస్వాల దాహం తీర్చడానికి బాణప్రయోగంతో ఏర్పాటు చేసింది. వైశాఖమాసం, దసరా సమయాలలో ఇక్కడ మేళా ఏర్పాటు చేస్తారు.
* కర్ణుడి ఖేడా :- ఇది బ్రహ్మసరోవరానికి ఒక మైలు దూరంలో ఉంది. యుద్ధసమయంలో కర్ణుడు ఇక్కడ బ్రాహ్మణులకు దానాలు ఇచ్చాడని కథనాలు వివరిస్తున్నాయి.
* ఆప్గా తీర్థం :- కర్ణుడి ఖేడా సమీపంలో ఉన్న అతి పవిత్రమైన సరోవరమే ఆప్గాతీర్ధంఆప్గాతీర్థం సరోవరం. కురుక్షేత్రంలో ప్రవహించిన నదులలో ఒకటైన ఆప్గానది యొక్క వరద ప్రవాహం నుండి ఏర్పడిన సరసు కనుక ఈ సరసుకీ పేరు వచ్చింది. మానస నదికి క్రోశుదూరంలో ఉన్న ఆప్గా నదిని బ్రాహ్మణులు సేవించే వారని వామనపురాణంలో ఉన్నది. ఆప్గానదిలో తర్పణం విడిచిన వారి కోరికలు నెరవేరగలవని విశ్వసించేవారు. బాధ్రపదకృష్ణ చతుర్ధశి మద్యాహ్నం ఇక్కడ తర్పణం విడిచిన వారికి ముక్తి లభిస్తుందని విశ్వసించబడుతుంది.
* జ్యోతిసర్:- కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి [[గీతోపదేశం]] చేసిన ప్రదేశం. ఇక్కడ శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన పాలరాతిశిల్పం ఉంది. అలాగే శ్రీకృష్ణుడి పాదాలు ఉన్నాయి. అర్జునుడి రథం ఉన్న ప్రదేశం చుట్టూ ఐదు వృక్షాలు ఉన్నాయి. ఈ ఐదు వృక్షాలు శ్రీకృష్ణుడి గితోపదేశం నేరుగా విన్నాయని విశ్వసిస్తూ ఐదు వృక్షాలను అతి పవిత్రంగా భావిస్తున్నారు. ఈ వృక్షాల ఆకులు కూడా నేలరాలకూడదు అని ఈ వృక్షాలకు పెద్ద వలలుకట్టి ఉన్నాయి. సమీపంలోనే బాణగంగ మరియు విష్ణుసహస్రనామము ఆరంభమైన ఆలయం ఉన్నాయి. ఇక్కడ ఒకప్పుడు జ్యోతిసర్ మహాదేవుడు ఉండేవాడని అందువలనే ఈ ప్రదేశానికీ పేరు వచ్చింది. ఇక్కడ ఒక ప్రాచీన సరోవరం ఉంది. సరోవరతీరంలో ఉన్న వృక్షం అతిప్రాచీనమైనదని భావించబడుతుంది. దీనిని అక్షయ వటవృక్షమని అంటారు. గితోపదేశం విన్న ఐదు వృక్షాలలో ఇది ఒకటి. థానేశ్వర్ విధ్వంశం జరిగినప్పుడు శిధిలమైన శివాలయం వద్ద అరో వట వృక్షం ఉంది. 1960లో ఇక్కడ శ్రీ కృష్ణ మందిరం నిర్మించబడింది.
* సర్వదమన్ :- ఇది జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రదేశం. ఇక్కడ పెన్నే సూర్యకుండ్ అనే తీర్ధంతీర్థం ఉంది.
 
* భూరి సుర్ :- కౌరవపక్షాన యుద్ధం చేసిన [[భూరిశ్రవుడు]] మరణించిన ప్రదేశమే భూరిసుర్ లేక భౌర్ అనిపిలువబడుతుంది. ఇది జ్యూతిసర్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సూర్యకుండ్ అనే పవిత్ర సరోవరం శివాలయం ఉన్నాయి. యాత్రికులు ఇక్కడ స్నానం ఆచరించి సూర్యోపాసన చేస్తారు. యాత్రికుల వినోదార్ధం ఇక్కడ ఒక మొసళ్ళ అరణాలయం ఏర్పాటు చేయబడి ఉంది.
* వృధోదక తీర్ధంతీర్థం ( పెహ్‌వా ) :- కురుక్షేత్రానికి పశ్చిమాన 25 కిలోమీటర్ల దూరంలో సరస్వతీ తీరంలో ఉన్న పట్టణం పెహ్వా. ఇక్కడి నుండి థానేశ్వర్, అంబాలా, కైథల్ కు రహదారి మార్గాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు, తీర్ధాలు ఉన్న ప్రదేశంగా భావించే పెహ్లా వద్ద పృథుచక్రవర్తి తనతండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడని అందుకే దీనికీ పేరు వచ్చిందని, [[విశ్వామిత్రుడు]] బ్రహ్మఙానం పొందిన ప్రదేశం ఇదని విశ్వసించబడుతుంది. ఇక్కడ ఘోరక్ నాథుని శిష్యుడైన గరీబ్ నాథుని మందిరం ఉంది. ఇక్కడ అతి ప్రాచీనమైన విగ్రహాలు, నాణాలు లభించాయి.
* కామ్య తీర్థం ;- కురుక్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలో పెహవాకు వెళ్ళే మార్గంలో కామోథా గ్రామం ఉంది. మహాభరతంలో వర్ణించబడిన కామ్యకవనమే కామోథాగా పిలువబడుతుందని విశ్వసిస్తున్నారు. ఇక్కడ పవమాన కామ్యకతీర్థం, శివమందిరం ఉన్నాయి. ఇక్కడ ప్రతి చైత్రశుక్ల సపమిలో మేళా నిర్వహించబడుతుంది. పాండవులు తమవనవాస సమయంలో ఇక్కడ నివసించారని పురాణ కథనాలలో వర్ణించబడి ఉంది.
* కుబేర తీర్థం :- భద్రకాళీ మందిరం సమీపంలో సరస్వతీ నదీతీరంలో ఉన్న ఈ తీర్థంలో కుబేరుడు యఙం చేసాడని విశ్వసించబడుతుంది.
* దధీచి తీర్ధంతీర్థం:-ఇక్కడ దధీచి మహర్షి నివసించేవాడని వృత్తాసుర సంహారార్ధం ఇంద్రుడు దధీచి మహర్షి అస్థికలను స్వీకరించి వజ్రాయుధం తయారుచేసుకున్నాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.
* చక్రవ్యూహం ( అమీన్) :- అమీన్ పర్వతం థానేసర్‌కు దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అథిది వనం ఉందని, ద్రోణాచార్యుడు పద్మవ్యూహం రచించిన ప్రదేశం ఇదని ఇక్కడ ప్రవేశిచిన అభిమన్యుడు వెలుపలికి పోలేక యుద్ధంలో హతుడయ్యాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. అభిమన్యుడి పేరుమీద ఉన్న ఈ ప్రదేశం కాలభ్రమణంలో అమీన్ అయిందని భావిస్తున్నారు.
* మార్కండేయ తీర్థం :- మార్కండేయుడు ఇక్కడ ఆశ్రమవాసం చేసాడని విశ్వసించబడుతుంది. యాత్రీకులు ఇక్కడ స్నానం చేసి పూజలు నిర్వహిస్తారు.
* రత్నయక్ష తీర్థం:- 48 క్రోసుల కురుక్షేత్ర యాత్రను ఇక్కడి నుండి కూడా ఆరాంభిస్తారు. ఇది కురుక్షేత్ర స్టేషను‌కు ఒక కిలోమీటర్ దూరంలో పిపలీ మార్గంలో ఉంది. ఇక్కడ ఒక పవిత్ర సరసు, కార్తిక మందిరం, రత్నయక్ష మందిరం ఉన్నాయి.
* పిండారా :- ఇక్కడ ఉన్న సోమతీర్ధంలోసోమతీర్థంలో చంద్రుడు శివుని గురించి తపసు చేసి వ్యాధి నుండి విముక్తిడయ్యాడు. చంద్రుడు ఆరాధించిన క్ ఆరణంగా ఇక్కడ శివుడు సోమేశ్వరుడు అయ్యాడు. ఇక్కడ స్నానం ఆచరించి సోమేశ్వర దర్శనం చేసుకునే వారు రోగవిముక్తులు ఔతారని భక్తులు విశ్వసిస్తున్నారు.
* సఫీడోం :- సాలవనానికి 10 మైళ్ళదూరంలో ఉన్న ససదోం వద్ద ఉన్న నాగతీర్ధంలోనాగతీర్థంలో స్నానం ఆచరించి నాగేశ్వరుడికి పెరుగు, నెయ్యి దానం చేస్తే సర్పభయం ఉండదని భక్తులు విశ్వసిస్తుంటారు.
* కైథల్:- పురాణాలలో కపిస్థలంగా వర్ణించబడిన ఈ ప్రదేశం మహావానరుడు హనుమంతుని భూమిగా విశ్వసిస్తున్నారు. యుధిష్ఠతుడు దాయాదులతో శాంతిని కోరుతూ అడిగిన ఐదూళ్ళలో కపిస్థలం ఒకటి. కపిస్థల్ కాలక్రమంలో కైథల్ అయింది. సరోవరం అనే ప్రాచీనమందిరం, ప్రాచీన దుర్గం ఉన్నాయి. ఇక్కడ శ్రావణ మాసంలో బ్రహ్మాండమైన మేళా నిర్వహించబడుతుంది.
* ద్వైశంపాయన హృదయ తీర్ధంతీర్థం :-
* వరాహ తీర్ధంతీర్థం :- జీంద్ స్టేషను సమీపంలో ఉన్న చిరహీకలా గ్రామంలో వరాహతీర్ధంవరాహతీర్థం ఉంది. విష్ణు భగవానుడు వరాహావతారం ఎత్తి భూమిని రక్షించిన ప్రదేశం ఇదని భక్తుల విశ్వాసం. ఇక్కడ భక్తులు స్నానం ఆచరించి విష్ణుమూర్తిని ఆరాధిస్తారు.
* దుఃఖభంజనేశ్వర మహాదేవ్ మందిరం :- సన్నిహిత సరోవరానికి సమీపంలో ఉన్న సుందర మందిరమిది. శిధిలమైన ఈ మందిరాన్ని దాతల సాయంతో పునరుద్ధరించి సుందరంగా తీర్చిదిద్దారు.
ఇక్కడ ఉన్న శివాలయంలో శివినికి ఉదయకాలం మరియు సాయంకాలవేళలలో హారతులు ఇస్తారు. శ్రావణ, కార్తిక మాసాలలో శివినికి అభిషేకాలు చేసి వ్రతమాచరిస్తారు. ఇక్కడ శివునికి పూజలు చేస్తే శివుడు భౌతిక దుఃఖాలు హరిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.
1,38,903

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1654039" నుండి వెలికితీశారు