'''ఖాసా సుబ్బారావు''' [[1896]], [[జనవరి 23]]న [[నెల్లూరు]] జిల్లా [[కావలి]] పట్టణంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు<ref>{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=Eminent Editors|date=2012-11-01|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=37-44}}</ref>,<ref>{{cite news|last1=D. ANJANEYULU|title=The man and the journalist|url=http://chaitanya.bhaavana.net/telusa/apr96/0011.html|accessdate=13 February 2015|work=THE HINDU|date=1996-01-21}}</ref>. ఇతని తల్లి రాంబాయి, తండ్రి సుందర రామారావు. యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు. ఇతని పూర్వీకులు మహారాష్ట్ర ప్రాంతం నుండి [[నెల్లూరు]]కు వలస వచ్చారు. ఇతడు హైస్కూలుఉన్నత పాఠశాల విద్య నెల్లూరులో పూర్తి చేసి [[మద్రాసు]] ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఫిలాసఫీ ప్రధాన విషయంగా డిగ్రీ పుచ్చుకున్నాడు. డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] మద్రాసు కాలేజీలో ఇతనికి గురువు. ఖాసా సుబ్బారావుపై అతని గురువు డా.[[సర్వేపల్లి రాధాకృష్ణన్]] బోధనల ప్రభావం జీవితాంతం ఉండేది. డిగ్రీ పూర్తి అయిన తరువాత న్యాయశాస్త్రంలో పట్టా సంపాదించాడు. కానీ కారణాంతరాల వల్ల న్యాయవాద వృత్తి చేపట్టలేదు. పైగా [[రాజమండ్రి]] వెళ్లి ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. నెల్లూరు లోని ఒక మిడిల్ హైస్కూలులోఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. తరువాత ప్రధానోపాధ్యాయుడయ్యాడు. ఈ ఉద్యోగం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. రాత్రి వేళల్లో స్కూలు సమీపంలో ఉన్న 50 మంది వయోజనులకు చదువు చెప్పి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాడు.
ఇతడు స్వరాజ్య దినపత్రిక మూతబడిన తర్వాత [[కలకత్తా]]లోని లిబర్టీ, ఇండియన్ ఫైనాన్స్, [[బొంబాయి]]లోని ఫ్రీప్రెస్ జర్నల్, [[మద్రాసు]]లో ఇండియన్ ఎక్స్ప్రెస్, [[ఆంధ్రప్రభ]] దినపత్రికలలో సంపాదకుడిగా పనిచేశాడు.