చిలుకూరి దేవపుత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''చిలుకూరి దేవపుత్ర''' అనంతపురం జిల్లాకు చెందిన రచయిత. దళితుల జీవన చిత్రాలతో పాటు, కరువు, ఫ్యాక్షనిజం అణగారిన వర్గాల బతుకు కథనాలను కథలుగా మలిచి సీమ జీవితాన్ని ప్రపంచ పాఠకులకు తెలియచేసిన అద్భుత కథకుడు నవలాకారుడు చిలుకూరి దేవపుత్ర.
==జీవితవిశేషాలు==
ఇతడు [[1952]]లో [[ఏప్రెల్ 24]]వ తేదీన [[అనంతపురం జిల్లా]], [[బెలుగుప్ప]] వడ్డుపల్లిమండలం [[కాల్వపల్లె (బెలుగుప్ప)|కాల్వపల్లె]] గ్రామంలో జన్మించాడు.ఇతని తల్లి సోజనమ్మ, తండ్రి ఆశీర్వాదం. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన దేవపుత్ర చాలా కష్టపడి 12వ తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత 1983లో జైళ్ల శాఖలో ఉద్యోగిగా చేరాడు. అటుతరువాత రెవెన్యూ శాఖలో పనిచేసి డిప్యూటి తహసీల్దారుగా పదవీ విరమణ చేశాడు.
 
==రచనలు==
ఇతని రచనలు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఇండియా టుడే, స్వాతి, రచన, ప్రస్థానం, ఆంధ్రభూమి, మయూరి, ఆంధ్రప్రభ, ఈనాడు, నూతన, ఆహ్వానం, పత్రిక, విపుల, నవ్య, వార్త, ప్రజాసాహితి, చతుర, చినుకు, ఆనంద జ్యోతి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని నవల పంచమంను [[శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం]], [[హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ]],[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] కథ బందీని [[శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం]] వారు ఎం.ఎ.లో పాఠ్యాంశంగా ఉంచారు. ఇతని రచనలు ఆంగ్లం, హిందీ, మరాఠీ, కన్నడ, ఒరియా భాషలలోకి అనువాదమయ్యాయి.
"https://te.wikipedia.org/wiki/చిలుకూరి_దేవపుత్ర" నుండి వెలికితీశారు