సప్తగిరులు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి (2) using AWB
పంక్తి 9:
==ఉపోద్ఘాతము==
[[భగవంతుడు]] పంచాత్మ స్వరూపుడని [[తైత్తరీయ ఉపనిషత్తు]] పేర్కొంటోంది. అంటే దేవుడిని మనం [[పర]], [[వ్యూహ]], [[విభవ]], [[అంతర్యామి]], [[అర్చావతారం|అర్చావతారాలలో]] చూడగలుగుతాం. నిత్యులు, ముక్తులు- అంటే జన్మరాహిత్యాన్ని పొందినవారు మాత్రమే స్వామిని పరరూపంలో- వైకుంఠంలో చూడగలుగుతారు. నారదుని వంటి మహామునులు మాత్రమే స్వామిని-వ్యూహంలో అంటే క్షీరాబ్దిలో చూడగలుగుతారు. స్వామివారి అవతారాల రూపంలో జన్మించినవారు లేదా ఆయా అవతారాల సమయంలోని సమకాలికులు- అంటే [[శ్రీకృష్ణుడు]], [[శ్రీరాముడు]] వంటి వారు మాత్రమే స్వామి విభవ స్వరూపాన్ని చూడగలుగుతారు. యోగసాధనతో, నిరంతర తపస్సుతో స్వామిని భజించేవారికే అంతర్యామి స్వరూపదర్శనం లభిస్తుంది. ఇక సామాన్యులకు లభించేది అర్చావతారమే! ఈ అర్చావతారం మనకు 108 దివ్యదేశాలలో కానవస్తుంది. ఈ 108 దివ్యదేశాల గురించి శ్రీ వేంకటేశ్వరుని భక్తాగ్రేసరులైన [[ఆళ్వారు|ఆళ్వార్లు]] తమ [[నాలాయిర దివ్య ప్రబంధము|నాలాయీర దివ్యప్రబంధాలలో]] ప్రస్తుతించారు.
 
 
ఈ నూటెనిమిది [[వైష్ణవ దివ్యదేశాలు|దివ్యదేశాలూ]] [[శ్రీవైష్ణవమతం|శ్రీవైష్ణవమత]] సంప్రదీకులకు పరమ పవిత్రస్థలాలు. ఇవి భారతదేశమంతా వ్యాపించి ఉన్నాయి. వీటిలో 106 క్షేత్రాలు భూలోకంలో ఉండగా, రెండు పరలోకంలో([[వైకుంఠం]], [[క్షీరాబ్ది]]) ఉన్నాయని భావన. ఈ 106 దివ్యక్షేత్రాలలోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవి రెండే రెండు. అవి... [[తిరుమల]] ([[తిరుపతి]]), [[అహోబిలం]].
Line 20 ⟶ 19:
 
==గరుడాద్రి==
దాయాదులైన [[కద్రువ]] పుత్రుల (నాగులు)ను సంహరించిన [[గరుత్మంతుడు]] పాపపరిహారార్థం [[విష్ణువు|విష్ణువును]] గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ [[వైనతేయుడు|వైనతేయుణ్ని ]] కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.
 
==అంజనాద్రి==
Line 26 ⟶ 25:
 
==వృషబాధ్రి==
[[కృతయుగం|కృతయుగంలో]]... తిరుమలలోని [[తుంబురుతీర్థం ]] వద్ద [[వృషభాసురుడు]] అనే [[రాక్షసుడు]] ప్రతిరోజూ తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన [[శివుడు]] ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలాకాలంపాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడనీ అదే వృషబాధ్రి అనీ పురాణగాథ.
 
==నారాయణాద్రి==
Line 33 ⟶ 32:
==వేంకటాద్రి==
కలియుగదైవం వెలసిన తిరుమల గిరి... అలవైకుంఠం నుంచి గరుడుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని [[భవిష్యోత్తర పురాణం]] చెప్తోంది. 'వేం' అంటే పాపాలు అని, 'కట' అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్రగిరిని 'వేంకటాద్రి' అంటారని ప్రతీతి.దీనికి సంబంధించి జనబాహుళ్యంలో ఓ కథ విస్తృత ప్రచారంలో ఉంది. [[శ్రీకాళహస్తి|శ్రీకాళహస్తిలో]] నివసించే పురందర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఓ కొడుకు పుడతాడు. అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారా దంపతులు. మాధవుడు మాత్రం చెడుసావాసాలు పట్టి అన్నీ పాపాలే చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితోపాటు స్వామిదర్శనానికి వెళతాడు. దర్శనం కోసం స్వామి ఎదుట నుంచున్న మాధవుడికి ఒళ్లంతా మంటలు పుట్టడం మొదలవుతుంది. ఉపశమనం కోసం కేకలు పెడతాడు. క్రమంగా మంటలు తగ్గుతాయి. ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలూ నశించాయట. ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు. అతడే మరుజన్మలో [[తొండమాన్‌చక్రవర్తి|తొండమాన్‌చక్రవర్తిగా]] పుట్టాడని, స్వామికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకం.
[[వర్గం:తిరుమల]]
 
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
 
Line 50 ⟶ 47:
ఆదిశేషుడు పర్వతంగా రూపొందినందువలన శేషశైలం లేదా శేషాచలం .
 
గరుత్మంతుడు వైకుంఠం నుండి తెచ్చినందున గరుడాద్రి.
 
వేం= సమస్త పాపాలను, కట=దహించునది కావున కావున వేంకటాద్రి. వేం= అమృతత్వాన్ని, కట= ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందువల్ల వేంకటాద్రి.
 
నారాయణుడనే మహర్షి శ్రీ మహావిష్ణు వు కోసం తపస్సు చేసిన స్థలం, తన పేరుతో ప్రసిద్దిప్రసిద్ధి పొందాలని వరం పొందినందున అది నారాయణాద్రి.
 
నారాయణుడనే మహర్షి శ్రీ మహావిష్ణు వు కోసం తపస్సు చేసిన స్థలం, తన పేరుతో ప్రసిద్ది పొందాలని వరం పొందినందున అది నారాయణాద్రి.
 
 
వృషభుడనే శెవభక్తుడు కోరి ,శబర వేషం లోవున్న శ్రీనివాసునితో యుద్దం చేసి మరణిస్తూ తనముక్తి కి గుర్తు గా ఆపర్వ తానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని పురాణగాధ , అదే వృషబాధ్రి .
Line 62 ⟶ 57:
వృషమనగా ధర్మము ధర్మ దేవత తన అభివృద్దికై ఈ పర్వతం పై తపస్సు చేసినందున వృషాద్రి అని పేరు కలిగింది.
 
పై ఏడు పేర్ల తో ఈ యుగం లో ప్రసిద్దిప్రసిద్ధి పొందినా, గడచిన యుగాలలో చింతా మణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అజనాద్రి, నీలాద్రి, వరాహాద్రి, వైకుంఠాద్రి .....ఇలా అనేక నామాలను కలిగివుంది.
 
పై ఏడు పేర్ల తో ఈ యుగం లో ప్రసిద్ది పొందినా, గడచిన యుగాలలో చింతా మణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అజనాద్రి, నీలాద్రి, వరాహాద్రి, వైకుంఠాద్రి .....ఇలా అనేక నామాలను కలిగివుంది.
 
{{తిరుమల తిరుపతి}}
 
[[వర్గం:తిరుమల]]
"https://te.wikipedia.org/wiki/సప్తగిరులు" నుండి వెలికితీశారు