ఎర్రకోట: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి (3) using AWB
పంక్తి 18:
}}
 
'''ఎర్రకోట''' : (لال قلہ )సాధారణముగా '''లాల్ ఖిలాహ్''' అని కాని '''లాల్ ఖిలా ''' అని కాని [[ఆంగ్లం]]లో చెప్పబడే ఈ [[కోట]], [[మొఘల్]] చక్రవర్తి [[షాజహాన్]] చే 15వ శతాబ్దములో [[పాత ఢిల్లీ]] నగరములో (ప్రస్తుతం [[ఢిల్లీ]], [[ఇండియా]]) నిర్మించబడింది. 1857 సంవత్సరములో మొఘల్ చక్రవర్తి [[బహాదుర్ షా జఫర్]] బ్రిటీషువారి పాలన లోని భారత ప్రభుత్వంచే దేశభహిష్కరణకు గురి అయ్యే వరకు, ఢిల్లీ పట్టణము మొఘలులకు రాజధానిగా వ్యవహరించింది. బ్రిటీషువారు ఈ కోటను 1947 సంవత్సరములో భారతదేశం స్వాతంత్రం పొందేవరకు, ఒక సైన్య శిబిరములాగ వాడేరు. ఈ కోట ప్రస్తుతము ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలముగా ఉండటమే కాకుండా, భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి ఒక శక్తిమంతమైన చిహ్నంగా ఉన్నది. [[భారత ప్రధాన మంత్రి]], ఈ కోటలోని లాహోరి గేట్ ప్రాంగణము నుండి ప్రతి ఏడాది [[స్వాతంత్ర్యదినోత్సవం]] రోజు భారత పతాకాన్ని ఎగురవేస్తారు. ఇది UNESCO వారిచే [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]] గా 2007లో గుర్తించబడింది. <ref name="unesco_whl_entry">{{cite web |url=http://whc.unesco.org/en/list/231 |title=Red Fort Complex |author= |date= |work=World Heritage List |publisher=[[UNESCO]] World Heritage Centre |accessdate=November 15, 2009 }}</ref>.
 
==చరిత్ర==
పంక్తి 24:
[[File:Red Fort 65771487 0479aebecc o.jpg|thumb|సిపాయిల తిరుగుబాటు అనంతరం, ఆక్రమిస్తున్న బ్రిటిష్ వాళ్ళు అనేక ముఘల్ కట్టడాలని పగలకొట్టి, వాళ్ళ యొక్క శిబిరాలని నిర్మించుకున్నారు]]
మొఘల్ చక్రవర్తి షాజహాను, ఈ బ్రహ్మాండమైన కోట నిర్మాణాన్ని 1638 సంవత్సరములో ప్రారంభించగా, 1648 సంవత్సరములో నిర్మాణం పూర్తి అయింది.
ఎర్రకోట, మొదట్లో ఖిలా-ఇ-ముబారక్ (దీవించబడ్డ కోట)అని సంబోధించబడేది. ఎందుకంటే అది అప్పట్లో రాజుల కుటుంబానికి నివాస స్థలముగా ఉండేది. ఎర్రకోట యొక్క నిర్మాణ ప్రణాళిక, సలిమ్గార్ కోటతో అనుసంధానంగా ఉండే విధముగా రూపొందించబడింది. ఈ రాజభావన కోట, పురాతనమైన షాజహానాబాద్ నగరానికి ఒక ముఖ్యమైన కేంద్రముగా ఉండేది. ఎర్రకోట యొక్క నిర్మాణ ప్రణాళిక, అందము మరియు అలంకారము షాజహాన్ చక్రవర్తి పాలనలోని అధ్బుత మొఘల్ సృజనాత్మకతకు అద్దం పట్టింది. షాజహాన్ చక్రవర్తి నిర్మించిన తరువాత ఎర్రకోటలో అనేక కొత్త నిర్మాణాలు చేయబడ్డాయి. వీటిలో ముఖ్యమైన నిర్మాణ దశలు, ఔరంగజేబు తదితర మొఘల్ పాలకులు కాలంలో జరిగాయి. బ్రిటిష్ పాలన సమయములో 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర యుద్ధం తరువాత, ఎర్ర కోట స్థలములో ముఖ్యమైన భౌతిక మార్పులు జరిగాయి. స్వాతంత్రం తరువాత, ఎర్రకోట భవనాలకి కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. బ్రిటిష్ వాళ్ళ కాలములో ఈ కోటని ముఖ్యంగా ఒక సైనిక శిభిరముగా వాడారు. స్వాతంత్రం తరువాత కూడా, 2003వ సంవత్సరము వరకు, కోటలో ఎక్కువ భాగం, భారత సైన్యం ఆధ్వర్యంలోనే ఉండేది.
 
ఎర్రకోట, [[మొఘల్]] చక్రవర్తి షాజహాన్ యొక్క కొత్త రాజధాని అయిన షాజహానాబాదుకు రాజభవనముగా ఉండేది. షాజహానాబాద్, ఢిల్లీ ప్రాంతములో ఉన్న ఏడవ గొప్ప నగరము. ఆయన, తన పాలనకి గొప్ప గౌరవం కలిగించాలని మరియు నిర్మాణ రంగములో తనకున్న ఉన్నత ఆశలకు మరియు పధకాలకు అవకాశం కలిగించాలనే ఉద్దేశముతో తన రాజధానిని [[ఆగ్రా]] నుండి మార్చారు.
 
ఈ కోట [[యమునా నది]] ని ఆనుకొని ఉన్నది. ఈ నది నీరు కోట చుట్టూ త్రవ్వబడిన కందకాలకు చేరేది. కోటకి ఈశాన్యము మూలలో ఉన్న గోడ, 1546 సంవత్సరములో [[ఇస్లాం షా సూరి]] కట్టిన పాత రక్షణ కొటైన [[సలిమ్గార్ కోటకి]] ప్రక్కనే ఉంది.ఎర్ర కోట యొక్క నిర్మాణం 1638లో మొదలయి 1648లో ముగిసింది.
 
మార్చ్ 11,1783 నాడు [[సిక్కు]]లు స్వల్పకాలము ఢిల్లీలో ఉన్న ఎర్ర కోటలోకి ప్రవేశించి, దివాన్-ఇ-అం ని ఆక్రమించారు. మొఘలు వజీరు తన సన్నిహితులయిన సిక్కులతో కలిసిపోయి నగరాన్ని వారికి అప్పగించారు. ఈ కార్యము కరోర్ సిన్ఘియా మిస్ల్కి చెందిన సర్దార్ [[బఘెల్ సింగ్]] ధలివాల్ సేనాధిపత్యంలో జరిగింది.
పంక్తి 34:
ఈ కోటలో నివసించిన ఆఖరి మొఘలు చక్రవర్తి [[బహదూర్ షా II]] "జఫర్". ఈ కోట మొఘల్ శక్తికి మరియు దాని రక్షణ సామర్ధ్యానికి కేంద్రముగా ఉన్నప్పటికీ, బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా 1857 సంవత్సరములో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు, ఎర్రకోటకి రక్షణ కల్పించలేదు. 1857 తిరుగుబాటు విఫలమైన తరువాత, 17 సెప్టెంబర్ నాడు జఫర్ కోటని వదిలి వెళ్లారు. ఆయన ఎర్రకోటకి బ్రిటిష్ వాళ్ళ ఖైదీగా తిరిగి వచ్చారు. జఫర్ మీద న్యాయ విచారణ 27 జనవరి, 1858 నాడు ప్రారంభమయి ఆయనను అక్టోబర్ 7 నాడు రాజ్యబహిష్కరణ చేశారు.
 
15 ఆగస్టు, [[1947]]లో, భారత్ స్వతంత్ర దేశముగా మారింది. ఈ సంధర్బములో, [[భారత ప్రధాన మంత్రి]] [[జవాహర్ లాల్ నెహ్రూ]] పతాకాన్ని ఎగుర వేశారు. స్వాతంత్ర్యదినోత్సవం రోజు, ప్రధాన మంత్రి దేశీయ పతాకాన్ని ఎగరవేసి ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఈ నాటికి కొనసాగుతూ ఉన్నదీ. [[రెండవ ప్రపంచ యుద్ధం]] అయిన వెంటనే, [[ఇండియన్ నేషనల్ ఆర్మీ]] ఫై జరిగిన ప్రసిద్ధమైన విచారణ ఎర్రకోటలో జరిగింది.
 
== వాస్తుశిల్ప రూపకల్పన ==
{{Wide image|Red Fort courtyard buildings.jpg|1000px|View of the pavilions in the courtyard}}
[[File:RedFortDelhi-NaqqarKhana-20080210-2.jpg|thumb|నక్క్యర్ ఖానా]]
ఎర్రకోట అత్యుత్తమ స్థాయి కళా రూపానికి మరియు అలంకారపు పనితీరుకి అద్దం పడుతుంది. ఈ కోటలో ప్రదర్శించబడిన కళారూపము ఐరోపా, పర్షియా మరియు భారత దేశాలకి చెందిన కళల యొక్క సంయోగము. ఈ కలయిక రూపము, భావవ్యక్తికరణం మరియు వర్ణములలో అత్యుత్తమంగా ఉండే షాజహాని శైలి అనే ఒక విలక్షణమైన అపూర్వమైన వాస్తుకళారూపం వికసించడానికి దారి తీసింది. ఢిల్లీలో ఉన్న ఎర్రకోట, భారత దేశములో ఉన్న ముఖ్యమైన భవన సముదాయాలలో ఒకటి. ఈ కోట భారత దేశపు చిరకాల చరిత్ర మరియు కళలను తనలో ఇముడ్చుకున్నది. ఈ కోట యొక్క ప్రాముఖ్యత కాలానికి మరియు అంతరానికి అతీతంగా నిలుస్తంది. ఈ కట్టడము భవననిర్మాణ కళయొక్క శక్తికి, మేధస్సుకు చిహ్నంగా నిలుస్తుంది. 1913లో ఈ కోటని ఒక దేశీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడముగా ప్రకటించక ముందు నుండే ఎర్రకోటని భావితరాల వారికోసం కాపాడి నిక్షేపించడానికి ప్రయత్నాలు చేయబడ్డాయి.
 
కోట యొక్క గోడలు నున్నగా అలంకరించబడి, పై బాగాములో భారీగా తీగల అలంకారాలు కలిగి ఉన్నాయి. కోటకి రెండు ముఖ్యమైన ముఖద్వారాలు ఉన్నాయి. అవి ఢిల్లీ దర్వాజా మరియు [[లాహోర్]] దర్వాజ. లాహోర్ దర్వాజానే ప్రధాన ప్రవేశము; ఈ ద్వారం చట్టా చౌక్ అనే ఒక పొడుగైన కప్పబడిన బజార్ వీధికి దారి తీస్తుంది. ఈ వీధి గోడలకు ఆనుకుని దుకాణాల కోసం అంగడులు నిర్మించారు. చట్టా చౌక్ తరువాత ఒక విశాలమైన ఖాళి స్థలం ఉంటుంది. ఆ తరువాత, పెద్ద ఉత్తర-దక్షిణ వీధి వస్తుంది. ఈ వీధి పూర్వం కోటని సైన్య కార్యకలాపాలు పడమర వైపున, రాజభవనాలు తూర్పు వైపున ఉండే విధముగా రెండుగా విభజించేది. ఈ వీధి యొక్క దక్షిణము వైపు చివరలో ఢిల్లీ ద్వారం ఉంటుంది.
పంక్తి 46:
=== దివాన్-ఇ-ఆమ్ ===
[[File:Inside Diwan-i-Aam, Lal Quila, Delhi.jpg|thumb|దివాన్-ఎ-ఆమ్]]
ఈ ద్వారం అవతల మరింత పెద్ద ఖాళి స్థలం ఒకటి ఉన్నది. ఈ స్థలం పూర్వం '''దివాన్-ఇ-ఆమ్''' యొక్క దర్బారుగా వాడబడింది. ఈ పెద్ద ప్రాంగాణంలోనే సామాన్య ప్రజలకు రాజు దర్శనం ఇచ్చేవారు. ఇక్కడ చక్రవర్తి కోసం, (ఝారోఖ) అనే బాగా అలంకరించబడిన సింహాసన మేడ ఉంది. స్తంభాలకు బంగారము రంగు వేయబడినది. ఒక బంగారం మరియు వెండి కంచె సింహాసనాన్ని ప్రజల నుండి వేరుచేస్తుంది.
 
=== దివాన్-ఇ-ఖాస్ ===
[[File:Red Fort Delhi.jpg|thumb|left|దివాన్-ఐ-ఖాస్]]
'''దివాన్-ఇ-ఖాస్''' , పూర్తిగా పాలరాయితో చేయబడిన ఒక మంటపము. ఇక్కడ స్తంభాలలో పూల చిత్రాలు చెక్కబడి విలువైన రాళ్ళతో అలంకరించబడి ఉంటాయి.
 
=== నహర్-ఇ-బెహిష్త్ ===
రాజుల అంతరంగ భవనాలు సింహాసనానికి వెనుక ఉంటాయి. కోట యొక్క తూర్పు అంచున, యమునా నదిని చూస్తూ ఉండే విధముగా, ఒక ఎత్తైన వేదిక మీద వరుసగా మంటపాలు ఉన్నాయి. ఈ మంటపాలు అన్నిటిని '''నహర్-ఎ-బెహిష్త్''' (స్వర్గం యొక్క ప్రవాహము) అని పిలవబడే ఒక నిరంతర నీటి కాలువ కలుపుతుంది. ఈ కాలువ ప్రతి మంటపము మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. కోట యొక్క ఈశాన్యము మూలలో ఉన్న ''షా బుర్జ్'' అనే స్తంభముఫై నుండి ఈ కాలువకి యమునా నది నీళ్ళు చేదబడతాయి. రాజభవనము ఖురాన్లో వర్ణించబడే స్వర్గాన్ని పోలి ఉన్నట్టు ఉంటుంది; రాజభవనంలో తరుచూ చెక్కబడిన రెండు వాక్యాలు ఏమనగా, "భూమి మీద స్వర్గం కనగ ఉంటె, అది ఇక్కడే ఉంది, అది ఇక్కడ ఉంది". ఈ రాజభవనము యొక్క ప్రణాళిక, ఇస్లాం యొక్క నమూనాలు మీద ఆధారబడి ఉన్నాయి. అయితే ప్రతి మంటప నిర్మాణంలో, ఇతర [[మొఘల్]] భవనాలలో మాదిరిగా హైందవ ప్రభావం ఉంటుంది. ఎర్రకోట యొక్క రాజభవన సముదాయం, మొఘలుల శైలికి ఒక ఉత్తమ ఉదాహరణగా చెప్పబడుతుంది.
 
=== జేనానా ===
[[File:RedFortDelhi-Rang-Mahal-20080210-2.jpg|thumb|రంగ మహల్]]
దక్షిణ మూలలో ఉన్న రెండు మంటపాలు, ''జనానా'' లు (స్త్రీల నివాసము): '''ముంతాజ్ మహల్''' (ప్రస్తుతం ఒక మ్యూజియం) మరియు పెద్ద విశాలమైన రంగ్ మహల్. ఈ '''రంగ్ మహల్''' యొక్క బంగార పూతతో అందముగా అలంకరించబడిన లోకప్పు మరియు ''నహర్-ఇ-బెహిష్త్'' నుండి నీరు వచ్చే పాలరాయి జలాశయము చాల ప్రసిద్దిప్రసిద్ధి చెందినవి.
 
=== మోతి మస్జిద్ ===
[[File:Fuerte Rojo Delhi 3.JPG|thumb|left|మోతి మస్జిద్]]
హమాం యొక్క పడమర దిశలో ముత్యాల మసీదు అయిన '''[[మోతి మస్జిద్]]''' ఉంది. ఈ మసీదు తరువాత కాలములో కట్టబడింది. షాజహాన్ యొక్క వారుసుడైన [[ఔరంగజేబ్]] కోసం అంతరంగ మసీదులాగ 1659లో నిర్మంచబడింది. ఇది తెల్ల పాలరాయితో నిర్మించబడి మూడు కలశాలు కలిగి ఉన్న ఒక చిన్న మసీదు. ఈ మసీదులో మూడు వంపుల తెర ఉండి, అది క్రింది ఆవరణ వరకు వస్తుంది.
 
=== హయాత్ బఖ్ష్ బాగ్ ===
పంక్తి 69:
[[File:Delhi red fort night.jpg|thumb|రాత్రిలో ఎర్రకోట]]
 
పాత ఢిల్లీలో ఉన్న ఎక్కువ ప్రసిద్దిప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ఎర్రకోట ఒకటి. ఈ కోట ప్రతి ఏడాది వేలాది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కోట నుండే భారతదేశం బ్రిటీషు వారి నుండి స్వాతంత్రం పొందిన రోజైన ఆగస్టు 15వ తారీఖున, [[భారత ప్రధాన మంత్రి]], దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదే పాత ఢిల్లీలోని అతి పెద్ద చారిత్రాత్మిక నిర్మాణము.
 
ఒక కాలములో, 3000 మంది కంటే ఎక్కువ జనము ఢిల్లీ కోట సముదాయము లోపల నివసించేవారు. కాని [[1857]] సంవత్సరములోని [[సిపాయిల తిరుగుబాటు]] అనంతరం, [[బ్రిటన్]] ఈ కోటని కైవసం చేసుకొని, నివాస రాజభవనాలని నాశనం చేసింది. ఈ కోట బ్రిటిష్ ఇండియన్ సైన్యం యొక్క కేంద్ర స్థావరముగా మార్చబడింది. తిరుగుబాటు జరిగిన వెనువెంటనే బహదూర్ షా జఫర్ మీద ఎర్రకోటలో విచారణ జరిపించారు. ఇక్కడే నవంబరు 1945లో, [[ఇండియన్ నేషనల్ ఆర్మీ]]కి చెందిన మూడు అధికారుల మీద, ప్రసిద్దిప్రసిద్ధి చెందిన సైన్య విచారణ జరిగింది. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత, [[భారత సైన్యం]], ఈ కోటని తన కైవసం చేసుకుంది. డిసెంబర్ 2003లో భారత సైన్యం, ఈ కోటని భారత పర్యాటక అధికారులకు స్వాధీనం చేసింది.
 
ప్రస్తుతం మొఘల్ చరిత్రని వివరించే ఒక [[ధ్వని మరియు కాంతి ప్రదర్శన]] సాయంత్రం జరిగుతుంది. ఇది పర్యాటకులని ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖ్యమైన వాస్తుశిల్ప కళారూపాల యొక్క పరిస్థితి మిశ్రమంగా ఉన్నది. విస్తరించి ఉన్న నీటి వనరులలో వేటిలోనూ నీరు లేదు. కొన్ని కట్టడాలు ఒక మోస్తరుగా మంచి పరిస్థితిలోనే ఉన్నాయి. వాటి అలంకరణలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. మరి కొన్నిట్లో పాలరాతి పూల చెక్కుడులని జులాయిలు మరియు దోపిడీదార్లు తీసివేశారు. తేనీరు భవనము చారిత్రాత్మిక పరిస్థితిలో లేనప్పటికీ, ప్రస్తుతం ఇది ఒక పని చేస్తున్న ఫలహారశాల వలె ఉన్నది. మసీదు మరియు హమాం ప్రజల దర్శనానికి మూసివేయబడినా, గాజు కిటికీల ద్వారా కాని పాలరాతి జాలకం ద్వారా కాని లోపలకు తొంగి చూడవచ్చు. నడక దారులు అన్ని నాశనమయ్యే పరిస్థితిలో ఉన్నాయి. ప్రజా మరుగుగదులు ఉద్యానవనానికి ప్రవేశద్వారము వద్దను లోపల కూడా ఉన్నాయి. అయితే కొన్ని అపరిశుభ్రంగా అనారోగ్యకరంగా ఉన్నాయి.
 
లాహోర్ ద్వారము నుండి ఆభరణాలు, చేతిపనికారుల తయారు చేసిన వస్తువుల చిల్లర విక్రయము చేసే ఒక దుకాణ సముదాయం వస్తుంది. "రక్తపు చిత్రాలని" ప్రదర్శించే ఒక మ్యూజియుం ఉన్నది. దీంట్లో 20వ శతాబ్దానికి చెందిన ప్రాణత్యాగం చేసిన భారతీయ యువకుల చిత్రాలు, వాళ్ళ త్యాగానికి సంబందించిన వివరాలు ప్రదర్శించారు. భవన నిర్మాణ కళకి సంబంధించిన మ్యూజియుం మరియు భారత యుద్ధ స్మారక చిహ్నాల మ్యూజియం ఉన్నాయి.
 
==కోటపై ఉగ్రవాదుల దాడి==
పంక్తి 94:
== సూచనలు ==
{{reflist}}
 
 
[[వర్గం:మొఘల్ భవననిర్మాణకళ]]
"https://te.wikipedia.org/wiki/ఎర్రకోట" నుండి వెలికితీశారు