అన్నమయ్య గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{గ్రంథాలయ పుస్తకాల జాబితా/అన్నమయ్య గ్రంథాలయం}}
{{Infobox library
| library_name = అన్నమయ్య గ్రంథాలయం
| name_en = ANNAMAYYA LIBRARY
| library_logo =
| image = Annamayya library.JPG
|caption = గ్రంథాలయం ముంగిలి
| country = [[భారత దేశము]]
| type = ప్రైవేటు
| established =
| ref_legal_mandate =
| location = [[గుంటూరు]]
| coordinates = {{coord|016|18|03|N|080|26|34|E|region:RU_type:landmark|display=inline<!--,title-->}}
| items_collected =
| collection_size = 80, 000
| criteria =
| req_to_access =
| annual_circulation =
| pop_served =
| members =
| budget =
| director =
| num_employees =
| website =
| phone_num =
}}
'''అన్నమయ్య గ్రంథాలయం''' దాదాపు 80 వేల గ్రంథాలతో [[గుంటూరు]] నగరంలోని బృందావన్ గార్డెన్స్ లోని [[గుంటూరు]] తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలయం<ref name="Annamayya Library: a treasure trove of knowledge">http://www.thehansindia.com/posts/index/2014-11-02/Annamayya-Library-a-treasure-trove-of-knowledge-114297</ref>. ఈ గ్రంథాలయానికి మొదటి ధాత శ్రీ కంభం శ్రీనివాస్ గారు. తదనంతరం మహామహులెందరో ముందుకు వచ్చి దీనిని ప్రసిద్ద గ్రంథాలయంగా మార్చారు.
 
==అభివృద్దిలో ప్రముఖులు, పుస్తక దాతలు==
===గోగినేని కనకయ్య===
===[[వెలగా వెంకటప్పయ్య]]===
[[వెలగా వెంకటప్పయ్య]] [[ఆంధ్ర ప్రదేశ్]] లో పౌర గ్రంథాలయోద్యమానికి చాలా సెవ చేసారు. , తన జీవితమంతయూ గ్రంథాలయోద్యమానికి ధారపోశాడు. [[గుంటూరు]] జిల్లా [[తెనాలి]] వాస్తవ్యుడు. [[శాఖా గ్రంథాలయము]]లో చిన్న ఉద్యోగిగా చేరి, స్వయంకృషితో యమ్.ఎ, బాలసాహిత్యంలో పరిశోధన ద్వారా పి.హెచ్.డి పొందాడు. బాల సాహిత్యములో ఎన్నో రచనలు చెశాడు. మరుగున పడిన రచనలు, ముఖ్యముగా పిల్లల సాహిత్యములో ఎందరో మహానుభావుల కృషిని సేకరించి పొందు పరిచాడు. గ్రంథాలయ విజ్ఞానములో వెంకటప్పయ్య తాకని అంశం లేదు. 100కు పైగా పుస్తకాలు, ముఖ్యముగా గ్రంథాలయ విజ్ఞానమునకు సంబంధించి వ్రాసిన గ్రంథాలు అత్యంత ప్రామాణికమైనవి. పలు పుస్తకాలు పాఠ్య గ్రంథాలుగా తీసుకొనబడ్డాయి.
 
===[[పెద్ది వెంకటేశ్వరరావు]]===
పంక్తి 41:
ఈ గ్రంథాలయానికి అత్యధికంగా 60.000 సుమారు పుస్తకాలు ఇచ్చిన దాత. సేవారత్న అవార్డు గ్రహీత. ఈయన చిన్నతనం నుంచి తాను చదివేందుకు సేకరించిన అనేక పుస్తకాలను ఈ గ్రంథాలయ అభివృద్ధికై ఇచ్చివేసారు.
 
===గుంటూరు బృందావన గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయం కమిటి చొరవ===
1999 లో గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో స్థాపించబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటి గ్రంథాలయ స్థాపనకు చొరవ తీసుకున్నది. అయినా కొన్నాళ్ళ పాటు ఆ పుస్తకాలు స్వామివారి ఆలయం లో ధ్యాన మందిరంలో ఉండి పోవటం బాధగా అనిపించి కొందరు దాతలు విరాళాలు అందించారు. క్రమంగా బీరువాల సంఖ్య 100కు చేరింది.
 
===తిరుమల తిరుపతి దేవస్థానం చేయుత===
ప్రతి జిల్లాకు ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు గ్రంథాలయ పరిస్థితిని, దాని అమూల్య సంపదను గురించి తెలుసుకొని [[గుంటూరు]]లోని ఈ గ్రంథాలయాన్ని రాష్ట్రం లో ఆదర్శ గ్రంథాలయం గా రూపుదిద్దటానికి చేయూత నిస్తున్నారు.
 
==అతిధులు==
పంక్తి 52:
ఈ గ్రంథాలయానికి తరచుగా వచ్చు కొందరు పెద్దలు, వక్తలు, రచయితలు, గ్రంథ సేకరణ కర్తలు తదితర అతిధుల గురించిన సమాచారం
; [[పొత్తూరి వెంకటేశ్వరరావు]] :
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ద్వారా భావితరాలకు పనికివచ్చే కార్యక్రమాలకు రూపశిల్పిగా ప్రసిద్ధిగాంచిన మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు 2015 జనవరి 29 న అన్నమయ్య గ్రంథాలయాన్ని సందర్శించారు. వీరు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, రాష్ట్రప్రభుత్వ ఉత్తమ జర్నలిష్టు అవార్డు వంటి పలు సత్కారాలు అందుకున్నారు. వీరు ప్రముఖ పాత్రికేయులు. 4 దశాబ్దాల పాటు వివిధ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు.
 
వీరు గ్రంథాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించి ఈ సేకరణ అరుదైనదని ప్రశంసించారు. వీరు ప్రెస్ అకాడమి అధ్యక్షులుగా ఉన్నపుడు పాతపత్రికలను 10 లక్షల పుటలను డిజిటల్ రూపంలో భద్రపరచారు. ప్రస్తుతం అన్నమయ్య గ్రంథాలయంలో జరుగుతున్న గ్రంథ పట్టిక డిజిటలైజేషను గురించి వివరాలు తెలుసుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో అవసరమైన మెళకువలను సూచించారు. ప్రముఖుల పరిచయాలను అదే రంగంలో అనుభవం గల వారిచే ఇంటర్వూ చేయించి పదిలపరచటం అవసరం అన్నారు.
; [[కుర్రా జితేంద్రబాబు]] :
కుర్రా జితేంద్రబాబు గారు త్రిభాషా పండితులు. ఈయన తెలుగు, ఇంగ్లీషు మరియు సంస్కృతంలో మహా పండితులు డెక్కన్ ఆర్‌ఖ్యలాజికల్ ఎండ్ కల్‌చరల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. [[సాలార్‌జంగ్ మ్యూజియం]] మరియు [[వేమన ఫౌండేషన్]] లో సభ్యులు గా ఉన్నారు. డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. విశ్వ విద్యాలయాల కొలమానం లో ఇతనొక సైన్స్ విద్యార్థి. న్యాయశాస్త్ర పట్టభద్రుడు. స్వతహాగా లోక సంచారి. ఇతనికి ఒంటబట్టింది చరిత్ర, సాహిత్యం, సామాజిక, మనోవిజ్ఞాన తత్త్వ శాస్త్రాలు. “ఒంటరిగా సంచరిస్తూ, పలువురిలా శ్రమిస్తూ” అనితర సాధ్యంగా వేల గ్రంథాలను సేకరించడమే కాకుండా ఆమూలాగ్రం మస్తిష్కంలో భధ్రపరచుకున్న ఏకసంథాగ్రాహి. యుద్ధాలు, విప్లవాలు, ఆరంభాలు,అంతాలు, తారీఖులు, దస్తావేజులు అన్నీ అతని నాలుక మీద మీట నొక్కితే కంపుటర్ లోంచి ప్రత్యక్షమైనట్లుగా నర్తిస్తాయి. ఆయా సన్నివేశలను అద్భుతంగా కళ్లకు కనిపిస్తాయి. నిజాం ఆంధ్రరాష్ర్ట మహాసభలు, హైదరాబాద్ సంస్థానం ప్రజా ఉద్యమాలు ని రచించారు. అనేక పుస్తకాలను అనువదించారు.
; [[పెద్ది రామారావు]] :
పెద్ది రామారావుగారు....తెలుగు భాషని ఒక వైవిద్యమైన బాటలో నడిపిస్తూ, భాషాభివృధ్ది చేస్తూ ముందుకు సాగుతున్నారు. రామారావు గారు ధియేటర్ ఆర్ట్స్‌లో పి.హెచ్ డి చేసారు, హైదరాబాదులోని [[తెలుగు విశ్వవిద్యాలయం]] లో ధియేటర్ ఆర్టిస్ట్‌లకు తమదైన శైలిలో పాఠాలను నేర్పి తన ఉనికిచాటుకుంటున్నారు. "యవనిక" అని ఒక ధియేటర్ మాస పత్రికని నడుపుతున్నారు. ధియేటర్ గురించి ఆర్టికల్స్ రాస్తున్నారు. వాటన్నిటిని త్వరలో ఒక చక్కని పుస్తక రూపంలో మన ముందుకు తీసుకురాబోతున్నారు.శనివారం(21/2/2015)న వీరు తమ ప్రదేశమైన [[గుంటూరు]] నగరానికి వచ్చి ఈ యొక్క అన్నమయ్య గ్రంథాలయాన్ని కూడా సందర్శించారు.తమ యొక్క అమూల్యమైన స్పందనని ఈ విధంగా తెలియజేసారు. "అభిరుచి తో పనిచేయడం అంటే ఏమిటో ఈ గ్రంథాలయానికి వచ్చాక అర్థం అయ్యింది,ఆ అభిరుచి పదిమందికి ఉపయోగపడేది అయినప్పుడు జీవితానికి ఏర్పడే సార్థకతకి సరిహద్దులు ఉండవు". "సూర్యనారాయణ గారికి హాట్స్ ఆఫ్ అని అభినందిస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసారు."
 
==ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/అన్నమయ్య_గ్రంథాలయం" నుండి వెలికితీశారు