దేవిప్రియ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
|signature =
}}
'''దేవిప్రియ'''<ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం నుండి</ref> [[1949]] [[ఆగష్టు 15]] న గుంటూరులో జన్మించాడు. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు షేక్ ఖాజాహుస్సేన్. తండ్రి పేరు షేక్ హుస్సేన్ సాహెబ్. తల్లి షేక్ ఇమాం బీ.<ref>అక్షరశిల్పులు- సయ్యద్ నశీర్ అహ్మద్</ref> గుంటూరు లోని ఎ.సి.కాలేజీలో బి.ఏ. చదువుకున్నాడు. కాలేజీ రోజుల్లోనే కవిత్వం పట్ల ఆకర్షితుడై పద్యాలు, గేయాలు వ్రాయడం ప్రారంభించాడు. గుంటూరు కేంద్రంగా అవతరించిన [[పైగంబర కవులు]] బృందంలో దేవిప్రియ ఒకడు. పాత్రికేయుడు గా ప్రజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, జ్యోతి, మనోరమ మొదలైన పత్రికలలోనూ, [[ఆంధ్రప్రభ]], [[ఆంధ్రజ్యోతి]], [[ఉదయం]], హైదరాబాద్ మిర్రర్ దినపత్రికలలోను పనిచేశాడు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన ఇతని 'సమాజానందస్వామి', 'రన్నింగ్ కామెంటరీ' కార్టూన్ కవిత్వం ద్వారా తెలుగు పత్రికారంగంలో కొత్త ఒరవడిని సృష్టించాడు. సినిమా రంగంపై సాధికారమైన వ్యాసాలు వ్రాశాడు. [[దాసి]], [[రంగులకల]] మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు వ్రాశాడు. ప్రజాగాయకుడు [[గద్దర్]] ఆంగ్లంలో పూర్తి నిడివి డాక్యుమెంటరీ ఫిలిం '''మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్‌షిప్''' పేరుతో నిర్మించి దర్శకత్వం వహించాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/దేవిప్రియ" నుండి వెలికితీశారు