పామర్రు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
===టి.ఎస్.ఆర్ & ఇ.ఆర్.ఆర్.డిగ్రీ కళాశాల===
===టి.కె.ఆర్.పాలిటెక్నిక్===
===[[కంచర్ల రామారావు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల]]===
పామర్రులో దివంగత తుర్లపాటి చినరామకృష్ణయ్య ఇంటివద్ద 1926వ సంవత్సరంలో వల్లూరిపల్లి లక్ష్మీదాస్, షావుకారు సుబ్బారెడ్డిల సహకారంతో వీధిబడిగా ప్రారంభమయిన ఈ బడి నుండి 1936లోనే మొదటి బ్యాచ్ ఎస్.ఎస్.ఎల్.సి. విద్యార్ధులు పరీక్షకు వెళ్ళినారు.
కాలక్రమంలో జిల్ల పరిషత్తు అధీనంలోనికి వెళ్ళిన 1998వ సంవత్సరం వరకు, ఈ పాఠశాలను, స్థానిక సబ్- కోర్టు ఆవరణలోనే కొనసాగించినారు. ఆ సమయలో ఆ భవనాన్ని రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకొనడంతో, నూతన పాఠశాల భవన నిర్మాణానికై పూర్వ విద్యార్ధి శ్రీ కంచర్ల రామారావు 50 లక్షల రూపాయలు వితరణ చేసినారు. మరియొక పూర్వ విద్యార్ధి శ్రీ గుజవర్తి రామకృష్ణ 3 లక్షల రూపాయలనందించినారు. రాజ్యసభసభ్యులుగా పనిచేసిన శ్రీ లాల్ జాన్ బాషా తన ఎం.పి.కోటా నిధులు రు. 30 లక్షలు, శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు రు. 10 లక్షలు అందించినారు. వీరుగాక మరికొందరు దాతలుగూడా వితరణ చేయుటతో, మొత్తం ఒకటిన్నర కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవన నిర్మాణం పూర్తి అయినది. భవన నిర్మాణ పనులలో నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించేటందుకు విశ్రాంత సివిల్ ఇంజనీరు శ్రీ ఎం.వి.వి.మూర్తిని నియమించడం గమనార్హం.
 
===పాఠశాలలో హంగులు===
ఈ పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన అల్లాడ రేణుక తేజస్విని అను విద్యార్ధిని, 9.7 గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణురాలగుటయేగాక, ఐ.ఐ.ఐ.టి.లో సీటు సాధించినది. [6]
ప్రస్తుతం 20 గదులున్న ఈ పాఠశాలలో, సమావేశాలు నిర్వహించడానికి రెండు హాళ్ళు, కుర్చీలతోసహా సమకూర్చినారు. విద్యార్ధులకు కంప్యూటరు కోర్సులో శిక్ష్హణ, 2 ప్రయోగశాలల ఏర్పాటు ఈ పాఠశాల ప్రత్యేకత. ఈ పాఠశాలకు అభివృద్ధి కమిటీ గూడా ఉన్నది. ఈ కమిటీకి ప్రస్తుతం కంచర్ల రామారావు కుమారులు కంచర్ల యుగంధర్, కేశవులు ఈ కమిటీలో ఉంటూ, పాఠశాల అభివృద్ధికి తోడ్పడుచున్నారు.
===ముందంజ==
ఈ పాఠశాల విద్యార్ధులు విద్యలోనూ క్రీడలలోనూ ముందంజలో ఉన్నారు. గత ఏడు సంచత్సరాలుగా 10వ తరగతి పరీక్షలలో 80% ఉత్తీర్ణత సాధించుచుండగా, ఈ సంవత్సరం 94.8% ఉత్తీర్ణత సాధించినారు. కంచర్ల రామారావు గారి కుమారులు, ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ చూపిన విద్యార్ధులకు ప్రోత్సాహక బహుమతులందించుచున్నారు. వీరు 1994-95 సంవత్సరంలో విద్యార్ధులకు స్వచ్ఛమైన శుద్ధినీరందించుటకై, ఒక ఆర్.వో.ప్లాంటును వితరణ చేసినారు. ఈ రకంగా ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెంది, సౌకర్యాల పరంగా నేడు జిల్లాలోనే రెండవ స్థానానికి చేరుకున్నది. ప్రభుత్వ పాఠశాలలో వసతులు కరువనే భావనను పటాపంచలు చేయుచూ, ఇక్కడ సకల వసతులతో నాణ్యమైన విద్యనందించడం ప్రశంసనీయం. ఈ పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన అల్లాడ రేణుక తేజస్విని అను విద్యార్ధిని, 9.7 గ్రేడ్ మార్కులతో ఉత్తీర్ణురాలగుటయేగాక, ఐ.ఐ.ఐ.టి.లో సీటు సాధించినది. [6]&[7]
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/పామర్రు" నుండి వెలికితీశారు