కొక్కొండ వెంకటరత్నం పంతులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
==జీవిత విశేషాలు==
తల్లి రామాంబ, తండ్రి నరసింగరావు పంతులు గారు. జననం మార్చి24,1843 వినుకొండలో. వీరు మాధ్యులు. తండ్రిగారు1845 లో మరణించారు.మేనమామ అప్పయ సోమయాజి. [[నందిరాజు లక్ష్మీనారాయణ దీక్షితులు]] గారు వెంకటరత్నంగారి తల్లికి పెదతండ్రి. సంస్కృతాంధ్రవెంకటరత్నం గారు స్కృతాంధ్ర గ్రంధములు ఇంటివద్దనే చదువుతూ ఇంగ్లీషు పాఠశాలలో చదివారు. 1855 లొ వివాహం. మేనరిక్కం. 15 వ ఏటనే గుంటూరు కలెక్టరు కచ్చేరీలో గుమాస్తాగా ఉద్యోగంలో చేరారు. చిన్నప్పుడే కవిత్వం అబ్బినది. వెంకటరత్నం పంతులు గారు స్మార్తులైనారు. 1856 లో మొట్టమొదటి పర్యాయము చన్నపట్టణం వెళ్ళారు. 1856 కాళయుక్తసంవత్సరం లో కంపెనీసర్కారు వారి సర్వే పార్టీలో ఉద్యోగమునకు దరకాస్తుచేశారు. సేలం లో సర్వే పార్టీలో ఉద్యోగం వచ్చింది. అటుతరువాత కోయంబత్తూరు దగ్గర పాల్ఘాట్ కు వెళ్లి అక్కడ తెలుగు పాఠశాల పెట్టారు. అందులో కన్నడం మరియు అరవం కూడా బోధించేవారు. కోయంబత్తూరు లో నారాయణ అయ్యర్ వారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. 1864 లో వారి తల్లిగారు ఉడుపి యాత్రలో మరణించారు. 1863లో సర్వే పార్టీ మూసివేసినతరువాత 1866 లో చన్నపట్టణం రెవెన్యూబోర్డులో ఉద్యోగం చేశారు. 1870 లో చన్నపట్టణం లో హిందూ ప్రొప్రయటరీ స్కూలులో తెలుగు పండితులు గా చేరారు. 1870 సంవత్సరములో హిందూశ్రేయోభివర్ధనీ సమాజమును స్థాపించి దానిలో విధ్యార్దులను, ఉపాధ్యాయులను, ఉద్యోగస్తుల ను సమావేశ పరచి ఒకొక్క సారి ఒకొక్క విషయమునుగూర్చి ఉపన్యాసముచేశేవారు. 1871 లో [[ఆంధ్ర భాషాసంజీవని పత్రిక]] స్ధాపించారు. అందులో పత్రికాలక్షణములును గురించి, పత్రికాసంపాదకులక్షణములను గురించి పద్యాలు వ్రాసేవారు. ఆ ఆంధ్ర భాషాసంజీవని లో ఇంగ్లీషు పత్రికలమాదిరి Editorials ప్రారంభించారు. 1872 జూలైలో [[ పురుషార్ధప్రదాయనీ పత్రిక]] లో కొక్కొండవారి ఆంధ్ర భాషాసంజీవని గూర్చి ప్రశంసిస్తూ ఇంగ్లీషులోను తెలుగులోనూ సమీక్షలు ప్రకటించారు. 1874 లో స్ధాపించిన కందుకూరి వీరేశలింగం గారి [[ వివేకవర్ధని పత్రిక]] ఆంధ్ర భాషాసంజీవనికి పోటీ పత్రిక గా నుండేది. 1874 సంవత్సరం నవంబరు మాసములో వెలువడిన ఆంధ్ర భాషాసంజీవని పత్రికలో సంజీవని సమాజం పేరిట దేశ పరిపాలన వ్యవహారాలను గూర్చిన 16 ప్రశ్నలను ప్రచురించారు. 1874 నుంచీ వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం గారు సంజీవని విమర్శలు ప్రచురించటము మొదలైనది. 1875 లో వెంకటరత్నంగారు హాస్యవర్ధని స్థాపించారు, 1876 లో కందుకూరి వీరేశలింగం గారు హాస్య సంజీవని ప్రచురణ ప్రారంభించారు. ఆ విధముగా కొక్కొండ వారికీ, కందుకూరి వారికీ వ్యంగ్య వాదోపవాదాలు కొనసాగుతూ వుండేవి. 1877 లో కొక్కొెండ వెంకటరత్నం గారు మద్రాసు ప్రెసిడెంసీ కాలేజీలో తెలుగు పండితులు గా నియమింప బడ్డారు. 1890 లో ప్రెసిడెంసీ కాలేజీలో కొక్కొండ వారు ఆంధ్రభాషా వర్ధని స్థాపించారు.
 
ఈయన రచించిన మహాశ్వేత (1867) తెలుగులో తొలి నవలగా కొంతమంది భావిస్తారు.<ref>[http://books.google.com/books?id=sHklK65TKQ0C&pg=PA209&lpg=PA209&dq=kokkonda+venkataratnam+pantulu#v=onepage&q=kokkonda%20venkataratnam%20pantulu&f=false A History of Indian Literature: 1800-1910, western impact: indian ..., Volume 8 By Sisir Kumar Das p.209]</ref>