కాశీయాత్ర చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

→‎మూలాలు, వనరులు: మూలాలు జతచేశాను
పంక్తి 7:
{{main|ఏనుగుల వీరాస్వామయ్య}}
శ్రీ ఏనుగుల వీరాస్వామి అనే మహాపురుషుడు మద్రాసు నుండి కాశీకి రెండుసార్లు కాలి మార్గంలో ప్రయాణం చేశాడు. ఆ వివరాలు ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర చరిత్ర అనే గ్రంథంగా తర్వాతి కాలంలో అంటే 1838 లో కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్లై అనే విద్వాంసుడు అచ్చు వేయించాడు. శ్రీ వీరాస్వామి మద్రాసు సుప్రీం కోర్టు శాఖలో ఇంటర్‌ప్రిటర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఆయనకు ధర్మబుద్ధి, పలుకుబడి ఎక్కువే. సకుటుంబ సపరివారంగా డేరాలతో సహా ఆయన చేసిన ప్రయాణాలలో మనకు అద్భుతం కల్గించే అంశాలు ఎన్నో ఉన్నాయి.
1941 లో [[దిగవల్లి వేంకట శివరావు]] ఈ గ్రంథాన్ని సంస్కరించి ఎన్నో క్లిష్టతరమైన ఆలనాటి తెలుగు-ఉరుదూ-తమిళం కలిసియున్న మాటలకు అర్ధములతో సరళమైన తెలుగు భాషలో వెలువరించి 3 వ సంకలనము ప్రచురించారు. వీరస్వామి వ్రాసింది తెలుగు భాషలోనే. ఐతే అది రెండు వందల సంవత్సరాల నాటి జనవ్యవహార భాష కావటంతో మూడవసంకలనములో చేసిన సంస్కరణలుకు భాషా శాస్త్రపరంగా కూడా ఎంతో ప్రాధాన్యం లభించి, గిడుగు రామమూర్తి పంతులుగారి మన్ననలకు పాత్రమయింది. వెళ్ళేటప్పుడు మద్రాసు, హైదరాబాద్‌, నాగపూర్‌, అలహాబాదుల మీదుగా వీరాస్వామిగారు కాశీ చేరారు. వచ్చేటప్పుడు గయ, ఛత్రపురం, భువనేశ్వర్‌, విశాఖపట్నం, ఒంగోలు, కావలి, నెల్లూరు మీదుగా సాగరతీరం వెంట మద్రాసు చేరారు. లొదటి రెండు సంకలనములలో లేనివి ఈ 1941 మూడవ సంకలనములో ఏనెన్నో విశేషములు కలువకలవు. క్షేత్ర మహాత్మ్య కధలు, తీర్ధశార్ధ విధులు మతధర్మ చర్చలు, దేశచరిత్రాంశములు, గ్రంధకర్త జీవితవిశేషములు, రాజకీయ సాంఘిక పరిస్తితులను గూర్చి వివరణ, 39 పుటల అకారాది సూచిక, అనేక చిత్రపఠములు కలవు. 3వ సంకలన మొదటిముద్రణ లో యాత్ర మార్గసూచికాపఠము(route map) లేదు. దిగవల్లి1991 వేంటసంవత్సరము శివరావుగారురెండవముద్రణలో తనఅప్పటికి 94 సంవత్సరముల ఏటవయస్సు గల సంపాదకులు దిగవల్లి వేంట శివరావుగారు గ్రంధకర్త ప్రయాణించిన మార్గసూచికాపఠమును (route map)ను 1991లో ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ క్రొత్త ఢిల్లీ వారు చేసినరెండవముద్రణ లో జతచేయించారు. ఈ అమూల్య పుస్తకమును అనేక సాహిత్యకారులు, విద్వాంసులు సమీక్షించి బహుముఖముగా ప్రశంసించారు
 
==కాశీయాత్ర చరిత్ర రచన ప్రాముఖ్యత==
"https://te.wikipedia.org/wiki/కాశీయాత్ర_చరిత్ర" నుండి వెలికితీశారు