భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 58:
తన సొంత పాస్పోర్టులు జారీచేసిన ''భారత సామ్రాజ్యము'', ప్రాంతీయముగా మరియు అంతర్జాతీయముగా సాధారణంగా ''ఇండియా'' అనే పిలవబడేది. ''ఇండియా''గా ఇది [[నానారాజ్యసమితి]] యొక్క వ్యవస్థాపక సభ్యురాలు మరియు 1900, 1920, 1928, 1932 మరియు 1936లో జరిగిన [[వేసవి ఒలంపిక్ క్రీడల]] కు సభ్యదేశము.
ఈ ప్రాంతములోనీ ఇతర దేశాలలో, [[సిలోన్]] (ప్రస్తుత [[శ్రీలంక]]), 1802లో అమియన్స్ ఒప్పందము ప్రకారము యునైటెడ్ కింగ్డమ్ కు దత్తము చేయబడినది. అయితే ఇది బ్రిటీషు కాలనీ అయినప్పటీకీ బ్రిటీషు ఇండియాలో భాగము కాదు. నేపాల్ మరియు భూటాన్ రాజ్యాలు గ్రేట్ బ్రిటన్ తో కుదుర్చుకున్న ఒప్పందాల వలన స్వతంత్ర రాజ్యాలుగా గుర్తింపబడినవి. ఇవి కూడా బ్రిటీషు ఇండియాలో భాగము కాదు.{{Fact|date=August 2007}} 1861 లో కుదుర్చుకున్న "ఆంగ్లో-సిక్కిమీస్ ఒప్పందము" తదనంతరము [[సిక్కిం]] రాజ్యము ఒక సంస్థానముగా యేర్పాటు చేయబడినది. అయితే దీని సార్వభౌమత్వ విషయము నిర్ధిష్టంగా నిర్వచించలేదు.<ref> "Sikkim." Encyclopædia Britannica. 2007. Encyclopædia Britannica Online. 5 Aug. 2007 <http://www.britannica.com/eb/article-46212>.</ref> [[మాల్దీవులు]] 1867 నుండి 1965 వరకు బ్రిటీషు ప్రొటెక్టరేటుగా ఉన్నవి కానీ బ్రిటీషు ఇండియాలో భాగము కాదు.
ఈ పాలనా వ్యవస్థ 1858లో బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ తన పాలనా బాధ్యతలను [[విక్టోరియా మహారాణి]]కి బదలాయించడముతో ప్రారంభమైనది. విక్టోరియా 1877లో భారతదేశ సామ్రాజ్ఞిగా ప్రకటించబడినది. బ్రిటీషు పాలన 1947లో బ్రిటీషు ఇండియా సామ్రాజ్యము రెండు స్వతంత్ర దేశాలుగా విభజించబడే వరకు కొనసాగినది. 1947 ఆగష్టు 14 న డొమినయన్ ఆఫ్ పాకిస్తాన్ యేర్పడినది. ఆగష్టు 15న యూనియన్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది.
|