ఏటుకూరి బలరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 4:
==ఉద్యోగం==
1937లో గుంటూరులోని ఆంద్రా క్రిస్టియన్ కాలేజిలో చదువుతున్నప్పుడే బలరామమూర్తి కమ్యూనిస్టు భావాలకు ప్రభావితమయ్యారు. తొలుత ఆర్.ఎం.ఎస్.(Railway Mail Service) లో ఉద్యోగం చేస్తూ కమ్యూనిస్టు పార్టీ రహస్య పత్రిక 'స్వతంత్ర భారత్' [[విజయవాడ]] నుండి [[శ్రీకాకుళం]] వరకు అన్ని రైల్వేస్టేషన్లలో కమ్యూనిస్టు అభిమానులకు సురక్షితంగా అందచేస్తుండేవారు. ఈ విషయాన్ని పసికట్టిన బ్రిటిష్ ప్రభుత్వం శిక్షగా [[మద్రాసు]] ఆర్.ఎం.ఎస్. ఆఫీసుకు ట్రాన్స్ఫర్ చేసి ఏ పని యివ్వకుండా జీతం ఇస్తూ ఖాళీగా కూచోబెట్టారు. దీనితో విసుగెత్తి 1940లో ఉద్యోగానికి స్వస్తిచెప్పి బలరామమూర్తి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు.
==రాజకీయ జీవితం==
[[రాయలసీమ]]లో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పలువురికి మార్క్సిస్టు సిద్ధాంత శిక్షణ యిచ్చారు. రెండేళ్ళు పాటు (1940-42) గడిపిన అజ్ఞాతవాస జీవితంలో భాగంగా [[విశాఖ జిల్లా]]లో కమ్యూనిస్టు పార్టీ ఆర్గనైజరుగా వ్యవహరించారు. 1948 నుండి 1952 వరకు [[తమిళనాడు]] లోని కడలూరు జైలులో డిటెన్యూగా వున్నారు. ఈ జైలు జీవితం ఆయనలోని తాత్విక జిజ్ఞాసను రేకెత్తించి, పుస్తక పఠనాసక్తిని పెంపొందించింది.విశాలాంధ్ర దినపత్రికలో మూడేళ్ళు ప్రధాన సంపాదక భాద్యతలు నిర్వహించారు. 1972 నుండి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకులుగా, కమ్యూనిజం మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులుగా చివరివరకు పనిచేశారు. తరువాత సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, జాతీయ సమితి సభ్యులుగా కొనసాగారు.
|