ఏటుకూరి బలరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
ప్రముఖ చరిత్రకారుడు ఆచార్య కీ.శే. బి.ఎస్‌.ఎల్‌. హనుమంతరావు పరిశోధనలను విశ్లేషిస్తూ 'విశిష్ట విశ్లేషణ' అనే గ్రంథాన్ని 1996లో వెలువరించారు. ఇది వారి ఆఖరి ముద్రిత రచన. 78 సంవత్సరాల ముదిమి వయస్సులో కూడా తనకు అత్యంత అభిమానమైన బౌద్ధం గురించి "బౌద్ధం-పుట్టుక-పరిణామం" పేరిట ఒక చారిత్రిక గ్రంథాన్ని రాయ సంకల్పించి రెండు అధ్యాయాలను రాస్తూ విజయవాడలో 1996 ఏప్రిల్‌ 3 న అకస్మాత్తుగా మరణించారు.
 
విశాలాంధ్ర, కమ్యూనిజం పత్రికలలో సాహిత్య, చారిత్రక, తాత్విక సమస్యలకు సంబంధించి పెక్కు వ్యాసాలను రాశారు. బౌద్ధంలో గతితర్కంపై వీరు ఇంగ్లీషులో రాసిన వ్యాసం పీపుల్స్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించిన 'బుద్ధిజం'లో భాగం అయింది. లెనిన్‌పై వ్రాసిన గ్రంథం సోవియట్‌ ల్యాండ్‌ ప్రచురణగా వచ్చింది. అనేక మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలను తెలుగులోకి అనువదించారు.
 
==మూలాలు==