కుమారజీవుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
 
కుమారజీవుని ఆధ్వర్యంలో అనువాద సభలు ఏర్పాటయ్యేవి. వాటి సమావేశాలకు వందలాది బౌద్ద సన్యాసులు హాజరయ్యేవారు. ఆ సమావేశాలలో అనువాదం చెయదానికి ఎంచుకొన్న మూల తాళపత్ర గ్రంథంలోని ప్రతీ వాక్యాన్ని గట్టిగా పఠించేవారు. ప్రతీ వాక్య పఠనానంతరం ఆ వాక్యానికి కుమారజీవుడు అర్ధాన్ని, భావాన్ని విశిదీకరించేవాడు. చైనా భాషలో తన అనువాదాన్ని సైతం వినిపించేవాడు. అనువాద సభా సమావేశాలకు హాజరైన వందలాది బౌద్ద సన్యాసులు దానికి వ్యాఖ్యలు, మార్పులు, చేర్పులు సూచించేవారు. అత్యధికుల ఆమోదం పొందిన అనంతరం అనువాద వాక్యం రాయబడేది. తరువాత మూల గ్రంధంలో అంతర్గతంగా పొసగేటట్లుగా ఆ అనువాద వాక్య శైలి సవరించబడేది. తరువాత నగిషీకారులు (Calligraphers) ఆ వాక్యాన్ని చైనా లిపిలోకి మార్చేవారు. ఇటువంటి అనువాద సభా సమావేశాలకు చైనా చక్రవర్తి సైతం తరచుగా హాజరయ్యేవాడు. ఈ విధంగా అనువాద ప్రక్రియలో సామూహిక కృషికి పెద్ద పీట వేయడం వలన విస్తృత జనామోదం పొందిన వాక్యాలే నిలిచేవి. గందరగోళంతో కూడిన నూతన పదాలకు ఆస్కారం వుండేది కాదు. కుమారజీవుడు అనువాద ప్రక్రియలో ప్రవేశపెట్టిన నిర్దిష్ట మార్పులు, వ్యవస్థాగతమైన పద్దతులు తదనంతర కాలంలో అనువాదకులకు మార్గదర్శకంగా నిలిచాయి.
 
ఈ అనువాద కృషిలో 800 కు పైగా చైనా, విదేశీ పండితులు, బౌద్ద సన్యాసులు, అనువాదకులు కుమారజీవునికి సాయంగా నిలిచారు. అనువాద కృషి సామూహికంగా జరిగినప్పటికీ అనువాద కర్తగా కుమారజీవుని పేరుతోనే నమోదయ్యంది. దీనికి కారణం అనువాదంలోని కనిపించిన ప్రతీ చైనా పదం అనేక విస్తృత చర్చలనంతరం కుమారజీవుని ఆమోదంతోనే ప్రకటితం కావడమే.
 
==కుమారజీవుడు అనువదించిన ముఖ్య బౌద్ధ గ్రంధాలు==
"https://te.wikipedia.org/wiki/కుమారజీవుడు" నుండి వెలికితీశారు