ఎ.ఆర్.కృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎ.ఆర్.కృష్ణ''' ([[నవంబర్ 13]], [[1926]] - [[నవంబర్ 10]], [[1992]]) ప్రముఖ నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. 1954లో [[హైదరాబాదు]]లో ఆంధ్ర ప్రదేశ్ నాట్య సంఘాన్ని స్థాపించి రాష్ట్రంలో నాటకాల అభివృద్ధికి విశేష కృషిచేశాడు<ref>[http://dspace.vidyanidhi.org.in:8080/dspace/bitstream/2009/1111/5/UOH-2003-194-4.pdf Telugu Theatre: Politics Of Representation]</ref>. ఆధునిక తెలుగు సామాజిక నాటకానికి కృష్ణ ఆద్యునిగా భావిస్తారు.<ref>[http://www.hindu.com/thehindu/fr/2008/11/21/stories/2008112150080200.htm Stage act] - The Hindu 21/11/2008</ref>.
 
 
== జననం ==
ఎ.ఆర్.కృష్ణ, [[1926]] [[నవంబర్ 13]]న [[గుంటూరు]] జిల్లా [[పెరవలి]] గ్రామములో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం [[శ్రీకాకుళం]], [[బెజవాడ]], [[చల్లపల్లి]], [[మచిలీపట్నం]] హైదరాబాదులలో జరిగింది. యల్.యం.ఇ చదువుతున్నపుడే [[హైదరాబాదు విమోచనోద్యమం]]లో పాల్గొన్నాడు. అజ్ఞాతవాసమునుండి బయటకువచ్చి [[సోషలిస్ట్ పార్టీ]] కార్యకలాపాలలో పాల్గొన్నాడు. 1948నాటికి రాజకీయ రంగం మీద [[వ్యామోహం]] విడనాడి నాటక రంగంలో ప్రవేశించాడు. 1952నాటికి పూర్తిగా నాటక రంగానికి అంకితమై వినూత్నమైన ప్రయోగాలు చేయాలన్న తపన బయలుదేరింది. జీవిక నిమిత్తం రాష్ట్ర విద్యుత్ బోర్డులో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. [[యునెస్కో]] ఆంతర్జాతీయ నాటక సంస్థకు అనుబంధసంస్థగా [[కమలాదేవి ఛటోపాధ్యాయ]] భారతీయ నాట్య సంఘాన్ని స్థాపించారు. ఆమె ప్రోద్బలంతో కృష్ణ 1952లో "[[ఇండియన్ నేషనల్ థియేటర్]]" నెలకొల్పాడు. 1953లో "దేశం కోసం" నాటక ప్రదర్శన వెల్లువ సృష్టించాడు. 1955లో ఢిలీలో జరిగిన భారతీయ నాట్యసంఘ సమావేశములో ఉపన్యాసమిచ్చి ఆ సంఘపు సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాడు. [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]], నాటక కళల విభాగానికి సభ్యునిగా పనిచేశాడు<ref>http://www.andhrauniversity.info/arts/theatrearts/index.html</ref>.
 
పంక్తి 12:
తన ఆశయాల సాధనలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న కృష్ణను భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.
 
== మరణం ==
కృష్ణ [[1992]] [[నవంబర్ 10]] వ తేదీ మరణించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎ.ఆర్.కృష్ణ" నుండి వెలికితీశారు