బొబ్బిలి బ్రహ్మన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
writer = [[పరుచూరి బ్రదర్స్|పరుచూరి సోదరులు]]|
}}
బొబ్బిలి బ్రహ్మన్న [[ఉప్పలపాటి కృష్ణంరాజు|కృష్ణంరాజు]], [[జయసుధ]], [[రావు గోపాలరావు]] ప్రధాన పాత్రధారులుగా [[గోపీకృష్ణా కంబైన్స్|గోపీకృష్ణా మూవీ క్రియేషన్స్]] పతాకంపై [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో నిర్మించిన 1984 నాటి తెలుగు చలన చిత్రం. ఈ చిత్రానికి కథ, మాటలు [[పరుచూరి బ్రదర్స్|పరుచూరి సోదరులు]] అందించారు. బ్రిటీష్ కాలంలోని కథగా టైటిల్స్ లో చూపించిన ఈ సినిమా బొబ్బిలి ప్రాంతంలోని కోటిపల్లి అనే గ్రామంలో ప్రారంభమవుతుంది. గ్రామంలోని ఏ నేరానికైనా స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన బొబ్బిలి వంశీకుడు బ్రహ్మన్న విచారించి తీర్పు చెప్తూంటారు. ఆ గ్రామ పొలిమేరల్లో పోలీసులు కూడా అడుగుపెట్టరు. ఊళ్ళో చేనేత కార్మికుల పొట్టకొడుతున్న రాయుడి దుర్మార్గాన్ని బయటపెట్టి బ్రహ్మన్న తమ్ముడు రవి కస్తూరి, స్వరాజ్యం అనే చేనేత కార్మికులతో ఓ చేనేత పరిశ్రమ పెట్టిస్తారు. స్వరాజ్యాన్ని చెరబట్టబోయి గొంతు పోగొట్టడంతో రాయుడి కొడుకు బుల్లబ్బాయి ఆమెను వివాహం చేసుకోవాలని బ్రహ్మన్న తీర్పునిస్తాడు. బ్రహ్మన్నకు సుశీల అనే ఆమెకు మధ్య తప్పు సంబంధాన్ని బుల్లబ్బాయి కక్షతో అంటగట్టగా బ్రహ్మన్న భార్య సావిత్రికి గతంలో తాను తప్పుగా చెప్పిన తీర్పు కారణంగా సుశీల భర్త చనిపోవడం, దాంతో తాను ఆమెను చెల్లెలిగా భావించి ఆశ్రయమిచ్చి పిల్లలను చదివించడం చెప్తారు. తప్పనిసరి పరిస్థితిలో స్వరాజ్యాన్ని బుల్లబ్బాయి పెళ్ళి చేసుకుంటారు. కస్తూరి-రవి ప్రేమించుకుంటూండగా, సుశీల కుమారుడు రాంబాబు బ్రహ్మన్న కూతురు రాజేశ్వరి ఒకరినొకరు ఇష్టపడుతూంటారు. ఆ విషయం రవి ద్వారా తెలుసుకున్న బ్రహ్మన్న తన కూతురికి, రాంబాబును ఇచ్చి పెళ్ళిచేయడానికి ఒప్పుకుంటారు. కానీ రాజేశ్వరి ఉయ్యాల ఊగుతుంటే ఆ ఊయల తాడు తెగ్గోసే ప్రయత్నం చేసిన నారాయణ అనే మనిషిపై పొరపాటున పడి ఆమె కళ్ళు పోగొట్టిందని రాయుడు అభియోగం తెస్తాడు. దాంతో బ్రహ్మన్న ఆమెను నారాయణకి ఇచ్చి పెళ్ళి చేయాలన్న తీర్పును ఇస్తారు. ఆ తీర్పు వ్యతిరేకించి రవి దగ్గరుండి రాజేశ్వరి-రాంబాబుల పెళ్ళి జరిపిస్తారు. ఆగ్రహించిన బ్రహ్మన్న వారిని ఊరి నుంచి వెళ్ళగొడతారు. చివరకి నారాయణ కళ్ళుపోలేదని తెలుసుకుని బ్రహ్మన్న-రవి రాయుడి ఆటకట్టిస్తారు.
 
1983లో పరుచూరి సోదరులను పిలిపించి కె.రాఘవేంద్రరావు కృష్ణంరాజు కథానాయకునిగా తీర్పులు చెప్పే ఊరిపెద్ద పాత్రను ఆధారం చేసుకుని కథ రాయమని కోరారు.
== కథ ==
రామనాథం అనే బ్రాహ్మణుడు చాలామంది బ్రాహ్మణులు తరుముతూండగా ప్రాణభయంతో పారిపోయి కోటిపల్లి అనే ఊళ్ళోకి వెళ్తారు. అది బ్రహ్మన్న గారి ఊరు అంటూ వారందరూ పొలిమేరల్లోనే ఆగిపోతారు. రామనాధం మార్కండేయశాస్త్రి అనే కోటిపల్లి గ్రామ పూజారి ఆశ్రయం తీసుకుంటారు. గ్రామంలోకి అప్పటివరకూ పోలీసులు అడుగుపెట్టింది లేదు. కొత్త ఎస్సై నేరస్తుడైన రామనాథం కోసం కోటిపల్లికి రాబోతూండగా పొలిమేరల వద్ద బ్రహ్మన్న అడ్డుకుని అతను నేరస్తుడో కాదో నేను తేలుస్తాను, తీర్పు వినడానికి మీరు సాధారణ పౌరునిగా రండి అని పిలుస్తారు. తర్వాతి రోజు సామాన్యపౌరునిగా వచ్చిన ఎస్సైకి కస్తూరి(జయసుధ), స్వరాజ్యం ధర్మపీఠం గొప్పదనం, బ్రహ్మన్న వంశస్తులు స్వరాజ్యం కోసం చేసిన పోరాటం వంటివి బుర్రకథగా చెప్తారు. ధర్మపీఠం దగ్గర బ్రహ్మన్న బ్రాహ్మణుడిగా పుట్టి తిండికి గతిలేని స్థితిలో మాంసం కొట్టు పెట్టుకున్న రామనాథానిది తప్పు కాదని ధర్మశాస్త్రాల ప్రమాణంగా తీర్పునిస్తాడు బ్రహ్మన్న. అయితే పొరుగూరి నుంచి వచ్చిన వ్యక్తికి నేరస్తుడో కాదో నిర్ధారణగా తెలుసుకోకుండా ఆశ్రయమిచ్చినందుకు శాస్త్రిని ఆలయ పూజకు దూరంచేస్తూ శిక్ష విధిస్తారు. బ్రహ్మన్న తీర్పును సామాన్య పౌరుని హోదాలో విన్న ఎస్సై ఆయనను కలిసి అభినందిస్తారు.<br />
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_బ్రహ్మన్న" నుండి వెలికితీశారు