జిల్లెళ్ళమూడి అమ్మ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 30:
వీరికి, ఒక కుమార్తె, పేరు హైమ. ఆమె, 1944లో జన్మించి, 1968లో మరణించారు. మొదటినుండి, "అమ్మ" తన కుమార్తె త్వరలోనే ఈ భూ ప్రపంచం వదిలి వెళ్ళిపోతుందని తెలుసుకున్నారు.ఆమె తరువాత అనారోగ్యం తో మరణించారు. అమ్మ తన కూతురు మరణించినప్పుడు కన్నీరు పెట్టుకున్నారు . అమ్మ తన కుమార్తె కు దైవత్వం ఇచ్చి, ఖననం చేయించి అక్కడ ఒక గుడి కట్టించారు. ఆ గుడి "హైమాలయం" గా పేరొందినది.
 
== బాల్యం / వివాహం ==
పసితనం గొల్ల నాగమ్మ పెంపకం లో గడిచింది . చిన్నప్పటి నుంచే అమ్మ అనేక మహిమలు చూపి అందరికి ఆశ్చర్యం కలిగించింది . తల్లి రంగమ్మ చనిపోతే అందరూ ఏడుస్తుంటే ఏడవ వద్దని అమ్మ దేవుడి దగ్గరకే వెళ్లిందని ఓదార్చింది. ఒక సారి బాపట్ల భావనారాయణ స్వామి గుడికి వెడితే పూజారి గమనించకుండా గుడి తలుపులు మూసేసి వెళ్ళిపోగా అక్కడే విచికిత్స చేసి అన్నిటికీ ఆధారం భూమి కనుక భూమి పూజ చేయాలని చెప్పింది. మర్నాడు ఉదయం పూజారి వచ్చి గుడి తలుపులు తెరవగానే అమ్మ రాజ్యలక్ష్మీ అమ్మ వారుగా దర్శన మిచ్చింది. మరో సారి ఒక పోలీసు ఉద్యోగి అమ్మ మెడలోని పులిగోరు తీసుకోవటానికి ప్రయత్నిస్తే అమ్మే తీసి ఇచ్చింది. అతను ఆశ్చర్య పడి మళ్ళీ భక్తితో అమ్మ మెడకు అలంక రించి నమస్కరించి వెళ్లి పోయాడు. అమ్మ పై అందరికీ అనంత విశ్వాసం కలిగింది ఆమెను సర్వ దేవత స్వరూపిణి గా భావించారు. పదమూడవ ఏట అమ్మకు మేనత్త కనకమ్మ గారి పెద్ద కొడుకు బ్రహ్మాండం నాగేశ్వర రావు తో 5-5-1936న బాపట్ల లో వివాహం చేశారు కాపురం బాపట్ల లో పెట్టారు. నాలుగేళ్ల తర్వాత 1940లో జిల్లెల్ల మూడి కి ఆ దంపతులు చేరి అక్కడ కాపురమున్నారు. ఆగ్రామానికి ప్రయాణ సౌకర్యమే లేదు వారి పెద్దకొడుకు సుబ్బారావు గ్రామ సర్పంచ్ అయిన తర్వాతే 1966లో రోడ్డు వేశార .
 
"https://te.wikipedia.org/wiki/జిల్లెళ్ళమూడి_అమ్మ" నుండి వెలికితీశారు