(1) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల:- చుండూరు గ్రామంలో 22 సంవత్సరాల క్రితం, ఈ పాఠశాల ప్రారంభించినారు. అప్పడి నుండి పక్కా భవనాలు లేవు. 4 సంవత్సరాల క్రితం, నూతనభవన నిర్మాణానికి రు. 9.75 కోట్ల నిధులు మంజూరయినవి. ఈ నిధులతో, 4వ తరగతి నుండి ఇంటరు వరకు చదువుకొనడానికి తరగతి గదులు, విద్యార్ధులకు వసతి గృహాలు, ఒకేసారి 300 మంది కూర్చొని భోజనంచేయడానికి సువిశాలమైన స్థలం, మరుగుదొడ్లు, ఆ ప్రాంగణంలోనే ఉపాధాయులకు గృహాలు నిర్మించినారు. మొదట 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు 350 మందికి మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉండేది. గత సంవత్సరం, స్థానిక పాఠశాలలో జూనియర్ కళాశాల ప్రారంభించినారు. దీనితో ఇక్కడ చదువుకొనే విద్యార్ధుల సంఖ్య 540 కి చేరుకున్నది. నూతన భవనం నిర్మాణం పూర్తి అయినచో మరో 150 మంది చదువుకొనడానికి అవకాశం ఉంటుంది. [6]