రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 90:
 
==కవిపండితపోషణ==
పిఠాపుర సంస్థాన చరిత్రలో రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు కాలం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఇతని సంస్థానంలో ఆస్థాన పండితులుగా [[శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రి]] (తర్కశాస్త్రం), [[తాతా సుబ్బరాయశాస్త్రి]] (వ్యాకరణం), [[చిలుకూరి నారాయణశాస్త్రి]], [[వేదుల సూర్యనారాయణశాస్త్రి]], [[గుదిమెళ్ల వేంకటరంగాచార్యులు]] (విశిష్టాద్వైతము), [[వడలి లక్ష్మీనారయణశాస్త్రిలక్ష్మీనారాయణశాస్త్రి]] (వేదం), [[దెందుకూరి నరసింహశాస్త్రి]] (వేదాంతం), [[తుమురాడ సంగమేశ్వరశాస్త్రి]] (సంగీతం) మొదలైన దిగ్దంతులు ఉండేవారు. ఈ పండితుల సహకారంతో ఇతడు ప్రతియేటా పీఠికాపుర సంస్థాన విద్వత్పరీక్షలువిద్వత్పరీక్షల పేరుతో విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంలో శాస్త్ర పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారిని కానుకలతో సత్కరించేవాడు. ప్రబంధ రచనలో కూడా పోటీలు నిర్వహించేవాడు. ఆనాటి సుప్రసిద్ధ పండితులు ఎందరో ఈ పరీక్షలలో బహూకృతులైనవారే. [[పానుగంటి లక్ష్మీనరసింహారావు]], [[వేంకట రామకృష్ణ కవులు]] ఇతని ఆస్థానకవులుగా ఉన్నారు. వీరు కాక [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]], [[కందుకూరి వీరేశలింగం]], [[టేకుమళ్ళ అచ్యుతరావు]], [[దేవగుప్తాపు భరద్వాజము]], [[పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి|పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి]], [[వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి]], [[శొంఠి భద్రాద్రి రామశాస్త్రి]], [[వేంకట పార్వతీశ కవులు]], [[దాసరి లక్ష్మణకవి]], [[వేదుల రామచంద్రకీర్తి]], [[శ్రీరాం వీరబ్రహ్మకవి]], [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]], [[కూచి నరసింహము]], [[నడకుదుటి వీరరాజు]] మొదలైన ఎందరో కవులు ఇతనిచేత సన్మాన సత్కారాలను అందుకున్నారు.
 
==అంకితం పొందిన గ్రంథాలు==