తెలంగాణ సారస్వత పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
<big>'''ఆంధ్ర సారస్వత పరిషత్తు'''</big> హైదరాబాదులోని ప్రముఖ సాహిత్య సంస్థలలో ఒకటి. ఇది మొదట నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరుతో [[1943]], [[మే 26]]న లోకనంది శంకర నారాయణరావు అధ్యక్షతన ప్రారంభమైంది. 1949లో ఆంధ్ర సారస్వత పరిషత్తుగా పేరు మార్చారు. 2015 ఆగస్టులో ఈ సంస్థ పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చారు.
==చరిత్ర==
ఆంధ్రమహాసభ పదవ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్నపుడు లోకనంది శంకరనారాయణరావు అధ్యక్షతన బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు ప్రభృతులు 1943 మే 26న రెడ్డి హాస్టల్లోని గ్రంథాలయంలో సమావేశమై ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారానికై "నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్''ను ఏర్పాటుచేశారు. దాని ప్రథమ మహాసభ 5 రోజుల తర్వాత (అనగా జూన్1న) జరిగింది. ఆ తర్వాత నుండి [[సురవరం ప్రతాపరెడ్డి]], [[మాడపాటి హనుమంతరావు]], [[కాళోజీ నారాయణరావు]], [[పి.వి.నరసింహారావు]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[బెజవాడ గోపాలరెడ్డి]], [[మర్రి చెన్నారెడ్డి]], [[అడవి బాపిరాజు]] వంటి మహామహులెందరో ఈ సంస్థ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల ప్రచారాన్ని విశాలాంధ్ర అంతటా విస్తరించి విశాలాంధ్రోద్యమాన్ని వేగతరం చేశారు. [[దేవులపల్లి రామానుజారావు]] ఈ సంస్థ అభివృద్ధికి 5 దశాబ్దాల కాలం తను మరణించేవరకు కృషి చేశాడు.
 
తెలంగాణా ప్రజల్లో సంచలనాత్మక అస్థిత్వ చైతన్యాన్ని కలిగిస్తే ఉలిక్కిపడిన నిజాం, ముస్లిం/ఉర్దూ దురహంకారులు, గుండాలు పరిషత్తు సమావేశాలకు ఎన్నో ఆటంకాలు కలిగించారు. భారతదేశానికి స్వాతంత్య్రం (1947-8-15) వచ్చాక నిజాం రజాకార్ల (ముస్లిం దురహంకార స్వచ్ఛంద సైనికుల) అణచివేత చర్యలు తీవ్రతరం కావడంతో 16 నెలలు అజ్ఞాతవాసం చేసిన పరిషత్ పోలీస్‌చర్య (1948.9.17) అనంతరం నిజాం రాష్ట్రం భారతదేశంలో కలవడంతో నూతనోత్సాహంతో తన 5వ సమావేశాన్ని (తూపురాన్) జరుపుకొన్న పరిషత్ తన శాఖలను తెలంగాణాతో పాటు ఆంధ్ర, రాయలసీమలకు, బీదర్, గుల్బర్గా, బెంగుళూరు, రాయచూర్ మొదలైన కర్ణాటక ప్రాంతాలకు, సేలం, హోసూర్, కె.జి.కండ్రిగ, మద్రాస్ మొదలైన తమిళ ప్రాంతాలకు, బొంబాయి, పూనా, షోలాపూర్, నాందేడ్, దేగ్లూర్ మొదలైన మహారాష్ట్ర ప్రాంతాలకు, మారిషస్ దేశానికి కూడా విస్తరించింది. అలా 1973 నాటికి ఆంధ్ర సారస్వత పరిషత్ శాఖల సంఖ్య 375కిపైనే.
 
ఈ కృషిలో మధ్యతరగతి మేధావులదే కాదు, నస్పూరు (ఆదిలాబాద్ జిల్లా), వనపర్తి వంటి సంస్థానాధీశుల పాత్రా ఉంది. వీరందరి కృషి తెలుగు జనసామాన్యానికి చేరిందనడానికి ఒక నిదర్శనం ఆలంపూర్‌లో జరిగిన పరిషత్ 7వ సమావేశానికి 30 వేల మంది హాజరు కావడం. ఈ విషయం నాడు కాంగ్రెస్ సమావేశాలకున్నంత విలువే పరిషత్ సమావేశాలకూ ఉందని నిరూపిస్తుంది.
గ్రంథ ప్రచురణ, గ్రంథాలయ నిర్వహణ, తెలుగులో బోధన, పరీక్షల నిర్వహణ, సాహిత్య కార్యక్రమాల నిర్వహణ మొదలైన కార్యక్రమాలను విస్త�ృతంగా చేపట్టింది పరిషత్. పండిత, ప్రజా, బాల సారస్వతాలు అనే మూడు విభాగాల్లో సుమారు రెండువందల పుస్తకాలను ప్రచురించి అతితక్కువ ధరలకు విక్రయించింది. తెలుగునాట మొట్టమొదటిసారిగా జానపద వాజ్ఞ్మయాన్ని ప్రచురించింది పరిషత్తే. పరిషత్ ప్రచురించిన సురవరం ప్రతాపరెడ్డిగారి "ఆంధ్రుల సాంఘిక చరిత్ర''కు 1955లో వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమి అవార్డే తెలుగులో మొదటిది. రామాయణ, భారత, భాగవతాది ప్రఖ్యాత గ్రంథాలెన్నింటిపైనో వ్యాఖ్యానాలు, హాస్య విమర్శలను పరిషత్ ప్రచురించింది. ఎన్నో ప్రఖ్యాత గ్రంథాలను సేకరించి గ్రంథాలయాన్ని నిర్వహించింది. 1952లో హైదరాబాద్‌లో నిర్వహించిన అఖిల భారత గ్రంథాలయ మహాసభలకు ఆహ్వాన సంఘ కార్యదర్శిగా పనిచేసింది. లక్ష్మణరాయ పరిశోధక మండలికి, తెలంగాణా రచయితల సంఘ స్థాపనకు, అఖిల భారత తెలుగు రచయితల సమావేశాలకు, యువభారతి సాహిత్య కార్యక్రమాలకు, తెలుగు లిపి సంస్కార కార్యక్రమాలకు, సారస్వత వేదికకు కేంద్రంగా పనిచేసింది.
 
1950 నుండే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహాయం పొందినా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిందీ భాషలో విద్యాబోధనను వ్యతిరేకించి మెట్రిక్యులేషన్, ఇంటర్, డిగ్రీ స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన జరిగేటట్లు ప్రభుత్వ వ్యవహారాలూ తెలుగులో జరిగేటట్లు ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించింది. 1945 అక్టోబర్ నుండి ప్రాథమిక, మాధ్యమిక పరీక్షలను నిర్వహించింది. 1951 మార్చి నుంచి ఉన్నత స్థాయిలో విశారద పూర్వభాగం, 1953 మే నుండి విశారద ఉత్తరభాగం పరీక్షలను నిర్వహించి విశారదను ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాచ్య భాషా ప్రవేశ పరీక్ష (ఓరియంటల్ లాంగ్వేజ్ ఎంట్రన్స్)తో సమానంగా గుర్తించేటట్లు చూసింది. ఈ పరీక్షలను సంవత్సరానికి రెండు సార్లు దాని శాఖలన్నింటిలోనూ నిర్వహించినట్లే, 1964 దసరా (అక్టోబర్ 22) నుండి తెలుగు పండిత శిక్షణ కళాశాలను 1962లో ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రారంభించిన భవనంలో నిర్వహించింది. డి.ఓ.యల్., బి.ఓ.యల్, ఎం.ఓ.యల్ కోర్సులను 1965 సంక్రాంతి (జనవరి15) నుండి సాయంకాలం కళాశాలలో, ఆగస్ట్ 27 నుండి డే కళాశాలలో నిర్వహించింది.
 
బడికి పోలేని పిల్లలు, స్త్రీ పురుష వయోజనుల్లో తెలుగు విద్యను వ్యాప్తి చేయడానికి హైదరాబాద్‌లో 1950 జూన్‌లో వయోజన విద్యా శిక్షణ కేంద్రమును స్థాపించి 1950-54 మధ్య తెలంగాణాలో 64, సింగరేణి, కొత్తగూడెం, బెల్లంపల్లి మొదలైన బొగ్గు గనుల కార్మికుల కోసం 16, బొంబాయి తదితర రాష్ట్రేతర ప్రాంతాల తెలుగు కార్మికుల కోసం మరికొన్ని అన్నీ కలిపి సుమారు 130 వయోజన/ రాత్రి పాఠశాలలను, 1954-56 మధ్య ప్రభుత్వ సహకారంతో 19 సాంఘిక సంక్షేమ విద్యా కేంద్రాలను నడిపింది.
పరిషత్ తెలుగు సాంస్క�ృతిక కళలనూ పోషించింది. తన వార్షికోత్సవాలందు 1952 అక్టోబర్ నుండి నటరాజ రామకృష్ణ చేత హైదరాబాద్‌లోని పలుచోట్ల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలను ఇప్పించింది. కొండపల్లి శేషగిరిరావు, కె.రాజయ్యల చేత చిత్రకళా ప్రదర్శనలను నిర్వహిం చింది. 'రసరంజని' నాటకాలకు ఉచితంగా ఆడిటోరియాన్నిచ్చింది. అయ్యదేవర కాళేశ్వరరావు, మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజరావు పరిషత్‌ను విశాలాంధ్రోద్యమ కేంద్రంగా నడిపారు.
 
1944-92ల మధ్య 1,39,143 మంది పరిషత్ పరీక్షల్లో పాల్గొనడం, శ్రీపాద నుండి శ్రీశ్రీ వరకు పరిషత్‌లో కావ్యగానం/ ఉపన్యాసం చేయని కవిపండితులు లేకపోవడం మొదలైనవి పరిషత్ తెలుగు భాషా సంస్క�ృతులను వ్యాప్తి చేయడంలో, తద్వారా తెలుగు ప్రజలందరినీ విశాలాంధ్రను సాధిం చడం ద్వారా ఏకం చేయడంలో చేసిన కృషిని విశదపరుస్తాయి. బూర్గుల రామకృష్ణారావు అన్నట్లు పరిషత్తు 'సూర్యుని వెలుతురు వలె రాష్ట్రంలోని ప్రతి పల్లెను విజ్ఞానవంతం చేసి', మాడపాటి గారన్నట్లు 'తెలంగాణాలో మహోద్యమాన్ని' నడిపి సఫలీకృతమైంది.
 
==ఆశయాలు==
==కార్యవర్గం==