తెలంగాణ సారస్వత పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
<big>'''ఆంధ్ర సారస్వత పరిషత్తు'''</big> హైదరాబాదులోని ప్రముఖ సాహిత్య సంస్థలలో ఒకటి. ఇది మొదట నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరుతో [[1943]], [[మే 26]]న లోకనంది శంకర నారాయణరావు అధ్యక్షతన ప్రారంభమైంది. 1949లో ఆంధ్ర సారస్వత పరిషత్తుగా పేరు మార్చారు. 2015 ఆగస్టులో ఈ సంస్థ పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చారు.
==చరిత్ర==
ఆంధ్రమహాసభ పదవ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్నపుడు లోకనంది శంకరనారాయణరావు అధ్యక్షతన బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు ప్రభృతులు 1943 మే 26న రెడ్డి హాస్టల్లోని గ్రంథాలయంలో సమావేశమై ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారానికై "నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్"ను ఏర్పాటుచేశారు<ref>[http://www.suryaa.com/lifestyle/article.asp?category=0&contentId=221223|. సూర్య దినపత్రికలో ఆంధ్రసారస్వతపరిషత్తు పై వ్యాసం]</ref>. దాని ప్రథమ మహాసభ 5 రోజుల తర్వాత (అనగా జూన్1న) జరిగింది. ఆ తర్వాత నుండి [[సురవరం ప్రతాపరెడ్డి]], [[మాడపాటి హనుమంతరావు]], [[కాళోజీ నారాయణరావు]], [[పి.వి.నరసింహారావు]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[బెజవాడ గోపాలరెడ్డి]], [[మర్రి చెన్నారెడ్డి]], [[అడవి బాపిరాజు]] వంటి మహామహులెందరో ఈ సంస్థ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల ప్రచారాన్ని విశాలాంధ్ర అంతటా విస్తరించి విశాలాంధ్రోద్యమాన్ని వేగతరం చేశారు. [[దేవులపల్లి రామానుజారావురామానుజరావు]] ఈ సంస్థ అభివృద్ధికి 5 దశాబ్దాల కాలం తను మరణించేవరకు కృషి చేశాడు.
 
ఈ పరిషత్తు తన కార్యకలాపాలతో తెలంగాణా ప్రజల్లో సంచలనాత్మక అస్థిత్వ చైతన్యాన్ని కలిగిస్తే ఉలిక్కిపడిన నిజాం, ముస్లిం/ఉర్దూ దురహంకారులు, గుండాలు పరిషత్తు సమావేశాలకు ఎన్నో ఆటంకాలు కలిగించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక నిజాం రజాకార్ల (ముస్లిం దురహంకార స్వచ్ఛంద సైనికుల) అణచివేత చర్యలు తీవ్రతరం కావడంతో 16 నెలలు అజ్ఞాతవాసం చేసిన పరిషత్ పోలీస్‌చర్య అనంతరం నిజాం రాష్ట్రం భారతదేశంలో కలవడంతో నూతనోత్సాహంతో తన 5వ సమావేశాన్ని [[తూప్రాన్]] లో జరుపుకొంది. ఆంధ్ర సారస్వత పరిషత్ తన శాఖలను తెలంగాణాతో పాటు ఆంధ్ర, రాయలసీమలకు, బీదర్, గుల్బర్గా, బెంగుళూరు, రాయచూర్ మొదలైన కర్ణాటక ప్రాంతాలకు, సేలం, హోసూర్, కె.జి.కండ్రిగ, మద్రాస్ మొదలైన తమిళ ప్రాంతాలకు, బొంబాయి, పూనా, షోలాపూర్, నాందేడ్, దేగ్లూర్ మొదలైన మహారాష్ట్ర ప్రాంతాలకు, మారిషస్ దేశానికి కూడా విస్తరించింది. అలా 1973 నాటికి ఆంధ్ర సారస్వత పరిషత్ శాఖల సంఖ్య 375కి చేరింది.