తెలంగాణ సారస్వత పరిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
<big>'''ఆంధ్ర సారస్వత పరిషత్తు'''</big> హైదరాబాదులోని ప్రముఖ సాహిత్య సంస్థలలో ఒకటి. ఇది మొదట నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరుతో [[1943]], [[మే 26]]న లోకనంది శంకర నారాయణరావు అధ్యక్షతన ప్రారంభమైంది. 1949లో ఆంధ్ర సారస్వత పరిషత్తుగా పేరు మార్చారు. 2015 ఆగస్టులో ఈ సంస్థ పేరును తెలంగాణ సారస్వత పరిషత్తుగా మార్చారు.
==చరిత్ర==
[[దస్త్రం:Andhra saraswata parishad.jpeg|thumb|200px|ఆంధ్ర సారస్వత పరిషత్తు]]
ఆంధ్రమహాసభ పదవ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్నపుడు లోకనంది శంకరనారాయణరావు అధ్యక్షతన బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు ప్రభృతులు 1943 మే 26న రెడ్డి హాస్టల్లోని గ్రంథాలయంలో సమావేశమై ఆంధ్ర భాషా సంస్కృతుల ప్రచారానికై "నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్"ను ఏర్పాటుచేశారు<ref>[http://www.suryaa.com/lifestyle/article.asp?category=0&contentId=221223|. సూర్య దినపత్రికలో ఆంధ్రసారస్వతపరిషత్తు పై వ్యాసం]</ref>. దాని ప్రథమ మహాసభ 5 రోజుల తర్వాత (అనగా జూన్1న) జరిగింది. ఆ తర్వాత నుండి [[సురవరం ప్రతాపరెడ్డి]], [[మాడపాటి హనుమంతరావు]], [[కాళోజీ నారాయణరావు]], [[పి.వి.నరసింహారావు]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[బెజవాడ గోపాలరెడ్డి]], [[మర్రి చెన్నారెడ్డి]], [[అడవి బాపిరాజు]] వంటి మహామహులెందరో ఈ సంస్థ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల ప్రచారాన్ని విశాలాంధ్ర అంతటా విస్తరించి విశాలాంధ్రోద్యమాన్ని వేగతరం చేశారు. [[దేవులపల్లి రామానుజరావు]] ఈ సంస్థ అభివృద్ధికి 5 దశాబ్దాల కాలం తను మరణించేవరకు కృషి చేశాడు.