ముకురాల రామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ముకురాల రామారెడ్డి''' మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి మరియు రచయిత. [[1976]] లో ఆకాశవాణి, ఢిల్లీ వారిచే 'జాతీయకవి 'గా గుర్తింపబడి, సన్మానం అందుకున్నాడు. పద్యాలు, కవితలు, పాటలు, కథలు వ్యాసాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్రవేసిన సాహితీపరుడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[పాలమూరు జిల్లా]], [[కల్వకుర్తి]] మండలం [[ముకురల్|ముకురాల]] గ్రామంలో [[1929]] [[జనవరి 1]]వ తేదీన జన్మించాడు. 1947-48లో నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలుగులో ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందాడు. తెలుగు అకాడెమీ ఉపసంచాలకులుగా పనిచేశాడు. దుందుభి అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణా రచయితల సంఘం, విజ్ఞానవర్ధని పరిషత్ మొదలైన సంస్థలలో చురుకుగా పాల్గొన్నాడు.ఇతడు [[2003]], [[ఫిబ్రవరి 24]]న మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/ముకురాల_రామారెడ్డి" నుండి వెలికితీశారు