ఇతడు స్త్రీ పాత్రలేకాక, '''రామదాసు''' లో "రామదాసు", '''విప్రనారాయణ'''లో "విప్రనారాయణ" మొదలైన పురుష పాత్రలను అద్భుతంగా అభినయించి మెప్పించాడు.
1930 లో "యంగ్మెన్స్ యూనియన్" పేరుతో స్వంత కంపెనీ స్థాపించి 1932 వరకు నడిపి, [[ఎస్. సిపి.లక్ష్మణస్వామి]], [[ఎ.వి.సుబ్బారావు]], [[రేలంగి వెంకటరామయ్య|రేలంగి]] మొదలయిన బాల్యమిత్రులతో ఆనేక నాటకాలను ప్రదర్శించాడు. ఆ తరవాత 1935 వరకు [[పారుపల్లి సుబ్బారావు]]గారి కంపెనీలో బలిజేపల్లి వారితో హీరోయిన్గా ఎన్నో నాటకాలు ఆడాడు. [[సి.ఎస్.ఆర్. ఆంజనేయులు]] ఇతడి సహకారంతో స్వంత కంపెనీ స్థాపించి "తుకారాం", "పతితపావన", "చింతామణి", "రాధాకృష్ణ" వగైరా నాటకాలు ప్రదర్శించాడు. దురదృష్టవశాత్తు 1937 లో తీవ్ర విషజ్వరానికి లోనై ఆరోగ్యం చెడిపోయి, రంగస్థలం నుంచి నిష్క్రమించాడు.